logo

తెదేపాతోనే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి

వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించింది తెదేపానే, పూర్తి చేసేది కూడా తెదేపానని మాజీ ఎమ్మెల్యే, తెదేపా మార్కాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు.

Published : 27 Mar 2023 04:09 IST

ప్రజా చైతన్య పాదయాత్రలో కందుల నారాయణరెడ్డి

నారాయణరెడ్డి, ఎమ్మెల్యే స్వామికి పొదిలి నేతల సంఘీభావం

మార్కాపురం, కొనకనమిట్ల,  పొదిలి, న్యూస్‌టుడే : వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించింది తెదేపానే, పూర్తి చేసేది కూడా తెదేపానని మాజీ ఎమ్మెల్యే, తెదేపా మార్కాపురం నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి పేర్కొన్నారు. మార్కాపురం ప్రాంత వాసుల చిరకాల వాంఛ అయిన  మార్కాపురం జిల్లా ఏర్పాటు, వెలిగొండ ప్రాజెక్టు పూర్తిని కాంక్షిస్తూ నియోజకవర్గంలో ఆయన చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర ఆదివారం కొనకనమిట్ల మండలంలోని వెలిగొండ క్షేత్రం నుంచి అట్టహాసంగా ప్రారంభమైంది. కొండపి ఎమ్మెల్యే డోల బాలవీరాంజనేయస్వామి, తెదేపా నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు వెంట రాగా నారాయణరెడ్డి ముందుకు కదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టుకు నిధుల కేటాయింపులోనే ప్రభుత్వ నిర్లక్ష్యం అర్థం అవుతుందన్నారు.  నిర్వాసితుల సమస్యలకు రూ.2500 కోట్లు, ప్రాజెక్టు నిర్మాణానికి రూ.2 వేల కోట్లు అవసరం అవుతాయని తెలిపారు. తెదేపాకు ఓటు వేస్తే రెండు లాభాలు ఉన్నాయని ఒక్కటి వెలిగొండ పూర్తి అవుతుందని, మరొకటి మార్కాపురం జిల్లా అవుతుందని ప్రజలు ఆలోచించాలని పేర్కొన్నారు. పాదయాత్ర కొనకనమిట్ల మండలంలో 12 కిలోమీటర్లు సాగింది. పొదిలి మండల తెదేపా నాయకులు యాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఆదివారం పాదయాత్ర ప్రారంభమైన కొనకనమిట్ల మండలం వెలిగొండకు వెళ్లి నారాయణరెడ్డితోపాటు పాదయాత్రలో పాల్గొన్నారు.

పాదయాత్రలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెదేపా శ్రేణులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని