ప్చ్.. ఫ్యూజులు వేసేవారూ లేరు
ఆధునిక సమాజంలో విద్యుత్తు ఓ నిత్యావసరం. అలాంటి సేవలు అందించే కీలకశాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. క్షేత్రస్థాయిలో సత్వర సేవలు అందించాల్సిన అధికారులు, సిబ్బంది పోస్టుల భర్తీ ఏళ్లుగా లేకపోయింది.
విద్యుత్తు శాఖలోఖాళీ కుర్చీలు
పోస్టుల భర్తీకి కానరాని చర్యలు
వినియోగదారులకు తప్పని అవస్థలు
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే:
విద్యుత్తు భవన్
ఆధునిక సమాజంలో విద్యుత్తు ఓ నిత్యావసరం. అలాంటి సేవలు అందించే కీలకశాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. క్షేత్రస్థాయిలో సత్వర సేవలు అందించాల్సిన అధికారులు, సిబ్బంది పోస్టుల భర్తీ ఏళ్లుగా లేకపోయింది. ఈ విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందనే విమర్శలున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాలో చిన్నపాటి అంతరాయం కలిగినా పరిష్కరించేవారు కనిపించడం లేదు. ఒక్కో ఉద్యోగి పక్క ప్రాంతాలకు ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. ఫలితంగా సకాలంలో సేవలు అందటం గగనంగా మారింది. ఈ విషయంలో అధికారులు, సిబ్బంది కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానికులే కొద్దిపాటి అవగాహనతో ఎలక్ట్రీషియన్లుగా మారుతున్నారు. అపాయం అయినప్పటికీ.. విద్యుత్తు పరివర్తకాల వద్ద ఫ్యూజు అమర్చడం, లైన్ మీద మరమ్మతులు చేయడం వంటి పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.
స్తంభాలు ఎక్కేవారే లేరు...: ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1989 నుంచి లైన్మెన్ మాత్రమే స్తంభం ఎక్కాలి. జూనియర్ లైన్మెన్, లైన్మెన్కు అసిస్టెంట్ లైన్మెన్ అనుసంధానంగా ఉండేవారు. కాలక్రమేణా 2001లో డిస్కమ్లు ఏర్పాటైన తర్వాత నిబంధనలు సడలించారు. అసిస్టెంట్ లైన్మెన్ కూడా స్తంభం ఎక్కేలా మార్పులు చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయాల ఎనర్జీ అసిస్టెంట్(జేఎల్ఎం-గ్రేడు 2) పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయి. మార్గదర్శకాల ప్రకారం వీరు స్తంభం ఎక్కడానికి లేదు. అత్యవసర సమయంలో వారితో పని చేయించినా ఆ సమయంలో ఊహించని ప్రమాదాలు సంభవిస్తే అందుకు బాధ్యులైన ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
స్థానికంగా ఉండని అసిస్టెంట్లు!...: గతంలో జేఎల్ఎం మీటరు రీడింగ్ తీయగా.. వారికి పనిభారం రీత్యా ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల కొరతను దృష్టిలో ఉంచుకుని జూనియర్ లైన్మెన్, అసిస్టెంట్ లైన్మెన్కు రెండు లేదా మూడు గ్రామాల చొప్పున విద్యుత్తు సరఫరా నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. దీంతో వినియోగదారుల నుంచే వచ్చే ఫిర్యాదులను పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. 2019లో రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను అమల్లోకి తెచ్చాక ఎనర్జీ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ చేశారు. 638 సచివాలయాలకు పోస్టులు మంజూరవగా, అందులో 629 మంది విధుల్లో కొనసాగుతున్నారు. ప్రస్తుతం వారు కూడా పనిచేసే చోట నివాసం ఉండటం లేదనే విమర్శలున్నాయి.
సొంత ప్రయత్నాలతో మృత్యువాత...: వేసవి సీజన్లో రాత్రివేళ ఏసీల వినియోగం కారణంగా పరివర్తకం మీద లోడు ఎక్కువ పడటంతో తరచూ ఫ్యూజులు పోతున్నాయి. జేఎల్ఎం, అసిస్టెంట్ లైన్మెన్లు అందుబాటులో లేకపోవడం.. ఎనర్జీ అసిస్టెంట్లలో కొందరు స్థానికంగా ఉండకపోవడంతో పల్లెల్లో రాత్రివేళ ఫ్యూజు పోతే వేసేవారు కరవయ్యారు. విధి లేని పరిస్థితుల్లో స్థానికులే వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు. పొలాల్లో పరివర్తకాలు మరమ్మతులకు గురికావడంతో సాగు రైతులు ఫిర్యాదు చేసినా రోజుల తరబడి ముఖం చాటేయడంతో తమకున్న కొద్దిపాటి అవగాహనతో వారు సొంత ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలో కొన్నిసార్లు మృత్యువాత పడుతున్న ఉదంతాలూ ఉన్నాయి. అయినా విద్యుత్తు శాఖకు ఖాళీ పోస్టుల భర్తీ ఊసే పట్టడం లేదు.
ప్రభుత్వానికి నివేదించాం...
జిల్లాలో 36 ఆపరేషన్ ఏఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు జిల్లావ్యాప్తంగా ఉన్న ఖాళీల గురించి ప్రభుత్వానికి నివేదించాం. వినియోగదారులకు సేవలు అందించడంలో అంతరాయానికి తావులేకుండా ఉండేందుకు సబ్ ఇంజినీర్లకు అదనపు బాధ్యతలు అప్పగించాం. రైతులు, వినియోగదారులు సరఫరాలో ఏదైనా సమస్య తలెత్తితే సిబ్బంది దృష్టికి తీసుకురావాలి. అంతేకానీ వారే స్వయంగా ఫ్యూజులు వేయడం, ఇతరత్రా మరమ్మతులు వంటివి చేయొద్దు.
కేవీజీ.సత్యనారాయణ, ఎస్ఈ, విద్యుత్తు శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్