ఊసే లేని సచివాలయ ఖాళీల భర్తీ
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల చెంతకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
సీఎం ప్రకటించి అయిదు నెలలు
ఎదురుచూపుల్లోనే నిరుద్యోగులు
ఒంగోలు మండలం యరజర్ల గ్రామ సచివాలయం
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల చెంతకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో 2019 అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అప్పటి నుంచి వాటి ద్వారానే అవి అమలవుతున్నాయి. మొదటి విడత ప్రకటనలో అన్ని ఖాళీలు భర్తీ కాలేదు. దీంతో 2020లో రెండో విడత ఉద్యోగులను ఎంపిక చేశారు. కొన్ని శాఖల్లో అర్హులు లేకపోవడంతో గ్రేస్ మార్కులు కూడా కేటాయించారు. ఆ తర్వాత కొందరు ప్రభుత్వ శాఖల్లో ఉన్నత ఉద్యోగులుగా... మరికొందరు సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్లారు. ఇంకొందరు వివాహాలు చేసుకుని సచివాలయ కొలువు వీడి ఇతర వృత్తుల్లో స్థిరపడ్డారు. అలాగే పలు కారణాలతో ఉద్యోగాలకు రాజీనామా చేశారు. దీంతో మళ్లీ ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ పోస్టుల్లో సమీప సచివాలయ ఉద్యోగులను ఇన్ఛార్జులుగా నియమించి కాలం నెట్టుకొస్తున్నారు.
దీర్ఘకాలిక సెలవులో 276 మంది...
విభజన తర్వాత ప్రకాశం జిల్లాలో 597 గ్రామ, 122 వార్డు సచివాలయాలున్నాయి. అందులో ప్రస్తుతం అన్ని ప్రభుత్వ శాఖల కింద మొత్తం 6,533 మంది ఉద్యోగులు కొనసాగుతుండగా.. 276 మంది వివిధ కారణాలతో దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. ప్రస్తుతం 6,257 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారిలో గత ఏడాది సుమారు 4,500 మందిని క్రమబద్ధీకరించారు. మిగతా ఉద్యోగులకు కూడా ఇటీవల రెండేళ్ల సర్వీసు పూర్తికావడంతో క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే జిల్లా పంచాయతీ, పశు సంవర్ధక శాఖ ఉద్యోగులకు నియామక పత్రాలు అందజేశారు. పోలీసు శాఖాపరమైన విచారణ పూర్తికాకుండటంతో అందులో కొందరికి మాత్రం ఇంకా ఇవ్వలేదు.
* ఇది ప్రకటన...: ‘గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలి. అందుకుగాను వివరాలు సేకరించండి. అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయండి..’
ఇదీ ఈ ఏడాది జనవరి 4న సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ఆదేశం.
* ఆచరణేమో ఇలా...: గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన సమీక్షలో ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి ఆదేశాలివ్వడంపై నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. జిల్లా ఉన్నతాధికారులు కూడా సచివాలయాల వారీగా ఖాళీ పోస్టుల వివరాలు సేకరించి అప్పట్లోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అప్పటి నుంచి నిరుద్యోగ యువత ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తూనే ఉంది. అయిదు నెలల కాలం గడిచినప్పటికీ ఆచరణ దిశగా కార్యాచరణ లేక ఈసురోమంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను చంపేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్