పశువుల పథకానికి మంగళం!
పాడి రైతులెవరూ ప్రీమియం చెల్లించకుండానే చనిపోయిన పశువులకు పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఉచిత నష్ట పరిహారానికి నిరీక్షణ
అమల్లోకి ప్రీమియం చెల్లిస్తేనే బీమా
ఒంగోలు గ్రామీణం, న్యూస్టుడే: పాడి రైతులెవరూ ప్రీమియం చెల్లించకుండానే చనిపోయిన పశువులకు పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2019 సెప్టెంబర్లో వైఎస్సార్ పశు నష్ట పరిహార పథకాన్ని ప్రవేశ పెట్టింది. అయినా ప్రారంభం నుంచే లబ్ధిదారులు పరిహారం కోసం నెలల తరబడి నిరీక్షించారు. ఈ క్రమంలో క్లెయిమ్లు అధికంగా రావడంతో తాజాగా ప్రభుత్వం ఆ పథకాన్నే నిలిపేసింది. పాత పథకం కింద లబ్ధిదారులకు ఇంకా నగదు చెల్లించాల్సి ఉంది. ఇక నుంచి రైతు భాగస్వామ్యంతో ప్రీమియం చెల్లించేలా పశు బీమా పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
* బియ్యం కార్డు లేకుంటే భారం...: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా రైతులు పాడి పెంపకంపై ఎక్కువగా ఆధార పడుతున్నారు. పశు సంవర్ధక శాఖ గణాంకాల ప్రకారం జిల్లాలో 6,71,812 గేదెలు; 56,332 ఆవులు; 15,67,122 గొర్రెలు, 4,17,589 మేకలున్నాయి. వర్షాలు, వరదలు, పిడుగులు, విద్యుత్తు, రోడ్డు ప్రమాదాల కారణంగా పశువులతో పాటు, గొర్రెలు, మేకలు మరణిస్తుంటాయి. ఒక్కోసారి వ్యాధులు వచ్చి మృత్యువాత పడుతున్నాయి. తద్వారా బీమా చేయించకుంటే పోషకులకు ఎంతో మేలు చేకూరుతుంది. వీటి వయసు, ఇతర నిబంధనలతో పథకం అమలు చేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. బియ్యం కార్డు కలిగిన వారికి తక్కువ.. లేనివారు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పశువులకు ఒకేసారి మూడేళ్ల కాల పరిమితితో బీమా చేస్తుండగా.. మేకలు, గొర్రెలకు ఏడాది నుంచి మూడేళ్ల కాలపరిమితితో చేయించుకోవచ్చు. జిల్లాలో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నూతన బీమా పథకం కింద పశు పోషకులు ప్రీమియం చెల్లించేందుకు వెబ్సైట్ను ప్రారంభించారు. దీనిపై క్షేత్రస్థాయిలో పశు సహాయకులు అవగాహన కల్పిస్తున్నారు.
* పాత బకాయిలు ఇస్తారో లేదో...: 2022 జనవరి నెల నుంచి సుమారు 3,600 మంది లబ్ధిదారులకు రూ.7 కోట్ల మేర పశు నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంది. పథకం రద్దయినా సదరు బకాయిలను ఇంతవరకు చెల్లించలేదు. అసలు ఇస్తారా లేదా అనే విషయంపై కూడా స్పష్టత లేదు. దీంతో పశు పోషకుల్లో ఆందోళన నెలకొంది. పథకం ప్రారంభం నుంచి 2021 డిసెంబర్ వరకు సుమారు రూ.17 కోట్ల మేర బకాయిలు చెల్లించారు. అందుకు కూడా ఏడాది పైనే నిరీక్షించారు. మిగతా లబ్ధిదారులు క్లెయిమ్ చేసుకుని నగదు జమ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
గంజాయి వనం.. మీ వల్లే జగన్
[ 26-04-2024]
గతంలో కనివినీ ఎరగని అకృత్యాలకు జగన్ మోహన్ రెడ్డి అరాచక పరిపాలనే కారణమంటూ అన్ని వేళ్లూ చూపుతున్నాయి. గంజాయి సాగును పెకలించేందుకు ఇదమిత్థంగా చేసేందేమీ లేదు. కట్టడి చేయడంలోనూ నేరపూరిత నిర్లక్ష్యం వహించారు. -
ఇచ్చోటి నుంచే ఏడుగురు
[ 26-04-2024]
కొండపి.. జిల్లాలోని ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గం. ఇప్పుడీ నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఏడుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. -
నేను డీపీవో అయితే చచ్చిపోతారు
[ 26-04-2024]
‘నేను రెగ్యులర్ డీపీవో అయితే మీరంతా చచ్చిపోతారు’ అని ఇన్ఛార్జి డీపీవో ఉషారాణి తనను హెచ్చరించారంటూ మద్దిపాడు ఈవోఆర్డీ రఘుబాబు వాపోయారు. -
జిల్లాకొచ్చిన ఎన్నికల పరిశీలకులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకుడు అరవింద్ కుమార్ చౌరాసియా(ఐఏఎస్, 2012 బ్యాచ్, ఉత్తరప్రదేశ్ క్యాడర్) జిల్లాకు వచ్చారు. -
వెండి పళ్లేలు.. మద్యం సీసాల స్వాధీనం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రైల్వే పోలీసులు చేపట్టిన తనిఖీల్లో వెండిపళ్లేలు, మద్యం సీసాలు పట్టుబడ్డాయి. జీఆర్పీ సీఐ ఎన్.శ్రీకాంత్బాబు తెలిపిన వివరాల మేరకు.. ఒంగోలు స్టేషన్లో బుధవారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చుండూరి రామకృష్ణ, విజయలక్ష్మి వద్ద 27 వెండి పళ్లేలుండటాన్ని గుర్తించారు. -
నామపత్ర ఘట్టం.. పరిసమాప్తం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం గురువారంతో ముగిసింది. -
రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం
[ 26-04-2024]
నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. మంగమూరురోడ్డులోని శ్రీ సరస్వతి కళాశాల విద్యార్థి జి.వెంకట పవన్కుమార్ ఆలిండియా స్థాయిలో 335 ర్యాంకు సాధించగా, కె.సాకేత్ సాయిరాం 1736, ఆర్. చంద్రవిహారిక 2641 ర్యాంకు సాధించారు. -
జనమంటే విసుగు.. జగన్ పైనే మనసు
[ 26-04-2024]
ఒకప్పుడు పల్లె వెలుగులంటే గుర్తుకొచ్చేవి ఆర్టీసీ బస్సులే! అలాంటివి నేడు పల్లెసీమలకు రావడం లేదు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక రాబడి లేదని.. ఖర్చులు పెరిగాయని సాకులు చూపుతూ జిల్లాలో పలు సర్వీసులకు మంగళం పాడేశారు. -
ఆహ్లాదం ఆవిరి
[ 26-04-2024]
త్రిపురాంతకం మండలం కేశినేనిపల్లి పంచాయతీ పరిధిలో గొండ్లవాండ్లపల్లిలో నిర్మించిన విలేజ్ పార్కు స్మశానాన్ని తలపిస్తోంది. -
వైభవంగా రంగనాయకస్వామి తెప్పోత్సవం
[ 26-04-2024]
రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. -
పల్లెవనాన్ని పక్కనపడేశారు...
[ 26-04-2024]
పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం జూనియర్ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. -
ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు
[ 26-04-2024]
‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM