Adimulapu Suresh: మా మంత్రి కనిపించడం లేదు.. కలకలం రేపిన వాల్పోస్టర్లు
పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కనిపించడం లేదంటూ యర్రగొండపాలెంలో వెలసిన గోడపత్రికలు కలకలం రేపుతున్నాయి.
మంత్రి సురేష్ ఎక్కడంటూ వెలిసిన గోడపత్రిక
యర్రగొండపాలెం పట్టణం, న్యూస్టుడే: పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కనిపించడం లేదంటూ యర్రగొండపాలెంలో వెలసిన గోడపత్రికలు కలకలం రేపుతున్నాయి. ఆదివారం వై.పాలెం ప్రధాన రహదారిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉండే ఆర్టీసీ బస్ స్టాప్ గోడకు వీటిని అంటించారు. గోడపత్రికలో ఆదిమూలపు సురేష్, పేరు, వయస్సు పేర్కొంటూ.. మేము ఓట్లు వేసి గెలిపించిన ఈయన కనిపించటం లేదంటూ వ్యంగ్యంగా రాశారు. మరికొన్ని గోడ పత్రికలు కింద పడి కనిపించాయి. దీంతో వచ్చే పోయే ప్రజలు వాటిని చదువుతూ వెళుతున్నారు. వైకాపా అధిష్ఠానం మంత్రి సురేష్ను వై.పాలెం నుంచి కొండపి పంపించిన తరువాత ఆయన యర్రగొండపాలెం ప్రాంతానికి రాలేదు. ఈ మధ్య సీఎం రాకకు సంబంధించి ఏర్పాట్లు కోసం జిల్లా కలెక్టర్తో ఆయన వై.పాలెం కనిపించారు. అంతే తప్ప ఆయన వై.పాలం రాలేదు. వైకాపాలో కొందరు ఆయనకు వ్యతిరేకంగా పని చేస్తున్నట్లు ఆ పార్టీలోని వారే పేర్కొంటున్నారు. మంత్రి స్థాయిలో నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయకుండా నమ్మిన కార్యకర్తలను నట్టేటముంచారనే అపవాదు ఆయన మూట గట్టుకున్నారు. అంతేకాక వైకాపా అధిష్టానం తాటిపర్తి చంద్రశేఖర్ను ఇక్కడ సమన్వయకర్తగా నియమించడంతో ఆయన జీర్ణించుకోలేక పోయారని, దీంతో చంద్రశేఖర్ సమావేశాలకు వైకాపా నాయకులు కార్యకర్తలు హాజరు కావద్దంటూ ఆదేశాలిచ్చినట్లు మొదట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో మంత్రి వ్యతిరేక వర్గం ఆయనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కోవలోనే మంత్రి కనిపించ లేదంటూ గోడపత్రికలు వెలువడటం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
తెదేపా, జనసేన ఫ్లెక్సీల ధ్వంసం
బేస్తవారపేట, న్యూస్టుడే: తెదేపా, జనసేన ఫ్లెక్సీలపై అధికార పార్టీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. అధికారం ఉందనే అహంకారంతో వాటిని చించేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఏ నియోజకవర్గంలో చూసినా ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా బేస్తవారపేట మండలం చింతలపాలెం సమీపంలోని రహదారి పక్కన కంభానికి చెందిన జనసేన నాయకులు ఏర్పాటు చేసిన సంసిద్ధం ఫ్లెక్సీలను వైకాపా కార్యకర్తలు చించేశారు. అదే ప్రాంతంలో కొంతదూరంలో తెదేపా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని సైతం చించేశారు. పక్కనే ఉన్న వైకాపా ఫ్లెక్సీ మాత్రం చెక్కుచెదరకుండా ఉండటం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ చేతిలో జనం బికారులు.. వైకాపా భక్షణ చట్టంపై జనాగ్రహం
[ 05-05-2024]
జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం (టైటిలింగ్ యాక్ట్-2022)పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
కూటమిదే పక్కా విజయం
[ 05-05-2024]
‘సభకు వచ్చిన జనం చూపుతున్న ఉత్సాహం.. యువత, మహిళల కేరింతలు చూస్తుంటే దర్శిలో మన విజయం పక్కా అని తేలిపోయింది. ఈ సారి కచ్చితంగా తెదేపా జెండా ఎగరేస్తాం. -
పోలింగ్కు ఇదేం సన్నద్ధత!
[ 05-05-2024]
తపాలా ఓటింగ్ మొదటి రోజైన శనివారం జిల్లాలో పలు చోట్ల అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించారు. ఒంగోలు డీఆర్ఆర్ఎం ఉన్నత పాఠశాలలోని సగం కేంద్రాల్లో గెజిటెడ్ అధికారులు అందుబాటులో లేరు. -
జగన్ రాసిన మరణ శాసనం
[ 05-05-2024]
అయిదేళ్ల క్రితం వచ్చిన ఆ పాద యాత్రికుడు అక్కడి వారిపై అమృతం కురిపించారు..జీవచ్ఛవాల్లా ఉన్న కనిగిరివాసులకు ఊరడించారు..ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమికొడతానన్నారు. -
11న ఒంగోలుకు చంద్రబాబు
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 11న తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంగోలు రానున్నారు. -
తెదేపా గూటికి వైకాపా సర్పంచి
[ 05-05-2024]
పొన్నలూరు మండలంలో సైకిల్ జోరు మీదుంది. మండలంలోని కె.అగ్రహారం గ్రామ సర్పంచి షేక్ చిన్న మస్తాన్ శుక్రవారం రాత్రి దామచర్ల సత్య సమక్షంలో తెదేపాలో చేరారు. -
పోలింగ్ కేంద్రాల్లో వసతులు కల్పించాలి
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల్లో ఓటర్లకు అవసరమైన అన్ని వసతులు కల్పించాలని కలెక్టర్ దినేష్కుమార్ అధికారులను ఆదేశించారు. -
కొత్తపట్నంలో భద్రతా ఏర్పాట్ల పరిశీలన
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కొత్తపట్నం మండలం రెడ్డిపాలెం, కె.పల్లెపాలెం, ఈతముక్కలలోని పోలింగ్ కేంద్రాలను శనివారం జిల్లా పోలీసు పరిశీలకులు హసిబ్ ఉర్ రెహమాన్ పరిశీలించారు. -
చట్టం ముసుగులో దోపిడీకి జగన్ కుట్ర
[ 05-05-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్రంతో పాటు జిల్లాలోని మార్కాపురం పశ్చిమ ప్రాంతంలో రైతులకు చెందిన భూములు, పట్టా భూములను పట్టపగలే ఆక్రమణ చేసుకోని కబ్జా చేస్తున్న, చేసిన ఉదంతాలు అనేకం ఉన్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
-
మృణాల్ అవుట్ఫిట్కు నెటిజన్లు ఫిదా.. డిజైనింగ్కు 1400 గంటలు
-
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు