అంబా అని అరిచినా ఆలకించరేం
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది.
పథకాలు తొలగించిన వైకాపా సర్కారు
పోషకుల రాయితీల పైనా వేటు
కష్టకాలంలో పశువులకు గ్రాసమూ లేదు
కరవు ప్రాంతంగా పేరున్న జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా ఎక్కువ మంది రైతు కుటుంబాలు పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇటువంటి వారికి గత అయిదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం కరవైంది. ఫలితంగా పాడి పరిశ్రమ కుదేలైంది. పశు పోషకులకు అందాల్సిన రాయితీ పథకాలు ఒక్కొక్కటిగా దూరమయ్యాయి. అందుబాటులో ఉన్న పథకాలకు కూడా నిధులు విడుదల కాలేదు. పాల ఉత్పత్తి పెంపుతో పాటు పాడి రైతులకు ఆర్థిక చేయూత అందించేలా తెదేపా ప్రభుత్వం అమలు చేసిన పథకాలు వైకాపా ప్రభుత్వం నిలిపివేయడంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
న్యూస్టుడే, కొత్తపట్నం
గతంలో అమలు చేసిన పథకాలివీ...
- తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పాల ఉత్పత్తి పెంపునకు ఏటా పశు పోషకులకు పాతర గడ్డి(సైలేజ్), దాణాతో పాటు, పలు పథకాలు రాయితీపై అందించారు.
- ఏటా టన్నుల కొద్ది పాతర గడ్డి బేళ్లను నేరుగా గ్రామాల్లోని పశు పోషకులకు అందజేశారు.
- 75 శాతం రాయితీపై పాతర గడ్డి కిలో రూ.2కే అప్పట్లో సరఫరా చేశారు.
- పశు దాణా కూడా 75 శాతం రాయితీపై కిలో రూ.4 చొప్పున సరఫరా చేసేవారు.
- జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధుల కింద పశువుల సంరక్షణ షెడ్ల నిమిత్తం గోకులం, మినీ గోకులం నిర్మించారు. 2019 తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సదరు పథకాన్ని రద్దు చేయడంతో పాటు, చివరి ఏడాది కట్టుకున్న లబ్ధిదారులకు బిల్లులు కూడా వైకాపా నిలిపేసింది.
- ఉపాధి హామీ నిధులతో ఊరూరా పశుగ్రాసం విస్తారంగా సాగు చేయించారు. అధిక సంఖ్యలో రైతులు దీన్ని వినియోగించుకుని వేసవిలో పశుగ్రాసం కొరత ఉన్న అన్ని ప్రాంతాలకు రాయితీపై పచ్చగడ్డి సరఫరా చేసి ఆదాయం పొందారు.
- వేసవి సీజన్లో పొలాలు వెళ్లిన పశువులకు తాగునీటి సమస్య లేకుండా అందుబాటులో ఉన్న చేతి పంపుల వద్ద నీటి తొట్టెలు నిర్మించారు.
అధికారంలోకి వస్తూనే రద్దు
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త వాటి సంగతి అటుంచితే అప్పటికే అమలు చేస్తున్న ఆయా పథకాలను పూర్తిగా ఆపేసింది. నిర్మాణాల ఊసే లేకపోయింది. గత ప్రభుత్వ హయాంలో రాయితీపై దాణామృతం కిలో రూ.3 చొప్పున పంపిణీ చేయగా, వైకాపా ప్రభుత్వం వచ్చాక దాని ధర రూ.6.50కు పెంచింది.
పెరిగిన పశుగ్రాసం ధరలు...: వేసవి సీజన్ రావడంతో ప్రస్తుతం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొల్లాల్లో ఎక్కడా పచ్చిగడ్డి అందుబాటులో లేకపోవడంతో పశువులు విలవిల్లాడుతున్నాయి. ప్రభుత్వం రాయితీపై పాతర గడ్డి ఇవ్వని కారణంగా పల్లెల్లో పశు పోషకులు వరిగడ్డే దిక్కైంది. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా గరిష్ఠంగా ట్రాక్టర్ ట్రక్కు రూ.20 వేలు వరకు పలుకుతోంది. ఎండాకాలం పాల దిగుబడి తగ్గడం ద్వారా ఆదాయం కూడా తగ్గుముఖం పట్టింది. ఈ పరిస్థితుల్లో పశుగ్రాసం కొనుగోలు చేయడం రైతులకు భారంగా మారింది. మళ్లీ వర్షాకాలం సీజన్ వచ్చే వరకు ఆగస్టు, సెప్టెంబర్ నెల దాకా గడ్డికి డిమాండ్ ఉంటుంది. అయిదేళ్లగా ప్రభుత్వం రద్దు చేసిన పథకాలు వలన పశు పోషకులకు మరింత భారంగా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
[ 27-04-2024]
పేరుకే పోలీసులు. నిత్యం వైకాపాకు వంతపాడుతుంటారు. ఆ నాయకులతో అంటకాగుతుంటారు.. అధికార పార్టీ నేతల సేవలో తరిస్తూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. -
30న నేతల ఆగమనం.. ఒకేరోజు జగన్, లోకేష్, బాలకృష్ణ
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల తేదీ సమీపించే కొద్ది ప్రధాన పార్టీల కీలక నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇకపై ప్రచారం జోరందుకోనుంది. -
రూ. 4.92 కోట్ల ఖర్చు.. రూ.2.21 కోట్ల జప్తు
[ 27-04-2024]
ఎన్నిల కోడ్ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో రూ.2,21,90,514 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఓటర్లను ప్రభావితం చేసేలా పంచేందుకు సిద్ధం చేసినట్లుగా అనుమానిత వస్తువులను సీజ్ చేసినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. -
హెచ్చరిక.. కండువాలు మారిస్తే జరిమానా
[ 27-04-2024]
ప్రస్తుతం ఎవరు ఏ పార్టీనో ఇతమిత్థంగా చెప్పలేం. ఈ రోజు ఉదయం ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకొంటే.. సాయంత్రానికే మరో పార్టీ పిలిచిందంటూ అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. -
246మంది అభ్యర్థులు415నామినేషన్లు48తిరస్కరణలు
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. -
18,22,470 మంది చేతుల్లో భవిత
[ 27-04-2024]
మే 13 నాటి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపుల సవరణల ప్రక్రియ పూర్తయింది. -
తాడేపల్లి జలగ.. రక్త మాంసాలు పీల్చ
[ 27-04-2024]
అధికారంలోకి వస్తానే జగన్ విడతల వారీగా మద్య నిషేధాన్ని గాలికొదిలేశారు. ఏకంగా ప్రభుత్వంతోనే మద్యం దుకాణాలు ఏర్పాటు చేయించారు. ఊరూరా మద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. -
పైసా విదిల్చింది లేదు
[ 27-04-2024]
గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల కేంద్రంలోని బాలుర గురుకుల మైదానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటి నిధులతో మినీ ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను 2018లో చేపట్టింది. -
తెదేపా పాలనలోనే అభివృద్ధి
[ 27-04-2024]
తెదేపా పాలనలోనే అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి పేర్కొన్నారు.. ఆయన శుక్రవారం గిద్దలూరు నగర పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. -
కన్నీరే మిగిల్చావ్.. జగన్
[ 27-04-2024]
బొప్పాయి పంట పండించి ఆదాయాన్ని సాధించాలన్న రైతుల కల కలగానే మిగిలింది. ఉద్యాన పంటలకు గత ప్రభుత్వం రాయితీలిచ్చి ప్రోత్సహించడంతో రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టారు. -
నిధులు నిలిపివేసి.. కేంద్రానివీ మింగేసి.. పురాల గొంతు నులిమిన పాలకుడు
[ 27-04-2024]
రోడ్ల విస్త‘రణం’..ఊసేలేని కాలువల నిర్మాణం..వీధి దీపాల ఏర్పాటులో నిర్లక్ష్యం..ఇక పత్తాయే లేని పారిశుద్ధ్యం ! జిల్లాలోని నగర, పుర సంస్థల్లో గత అయిదేళ్లలో జగన్ ప్రభుత్వం ఒరగబెట్టిందిదే ! వసతులు కల్పించడం లేదు మొర్రో అని స్వయంగా వైకాపా వార్డు సభ్యులే గళమెత్తడం పాలకుల వైఫల్యాలకు అద్దం పడుతోంది. -
కక్ష కట్టి కడుపు కొడతారు
[ 27-04-2024]
2019 ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం వీచినా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి, పర్చూరు, చీరాల నియోజకవర్గాల్లో (ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉన్నాయి) తెదేపా ఎమ్మెల్యేలే విజయం సాధించారు. -
తెదేపాకు మద్దతుగా ఉన్నారని నీళ్ల నిలిపివేత
[ 27-04-2024]
బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వైకాపా నేతల దాష్టీకాలకు అంతులేకుండా పోతోంది. తాజాగా రేపల్లె, నగరం మండలాల్లోని మూడు, నాలుగు గ్రామాల్లో దళిత కాలనీలకు తాగునీరు సరఫరా చేసే విషయంలో ఆ కాలనీల్లో ఉండే వైకాపా నాయకులు రాజకీయ కోణంలో ఆలోచించి వివక్ష చూపడంతో గుక్కెడు నీటి కోసం ప్రజలు అవస్థలు పడుతున్నారు. -
ఐ ప్యాక్ సర్వేలన్నీ బోగస్
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా పనైపోయిందని, ఐప్యాక్ సర్వేలన్నీ బోగస్ అని నరసరావుపేట కూటమి ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే