జగనా‘సుర’ కుట్రలు
మత్తెక్కించేందుకు ముందస్తు వ్యూహాలు
సంపూర్ణ నిషేధమంటూ అప్పట్లో డప్పులు
ఆనక ప్రైవేట్ సైన్యం నియామకాలు
నామినేషన్ల ముందు దొరుకుతున్న వైకాపా మద్యం నిల్వలు
ఒంగోలు నేరవిభాగం, న్యూస్టుడే
నమ్మించేందుకు నాటకాలు...: మేం ఎన్నికల్లో గెలిస్తే దశలవారీగా మద్యనిషేధం విధిస్తాం. మద్యాన్ని స్టార్ హోటళ్లకు మాత్రమే పరిమితం చేస్తాం. మద్య నిసేధం విధించిన తర్వాతే మళ్లీ ఓట్ల కోసం మీ ముందుకు వస్తాం..
2019 ఎన్నికలకు ముందు వైకాపా అధినేత జగన్ మాటలు
దారి మళ్లిన సగం సరకు...: మద్య నిషేధం సంగతి అటుంచితే ప్రస్తుత ఎన్నికల వేళ అధికార వైకాపా బరితెగించింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం పైనే ఆధారపడింది. నూతన విధానంలో భాగంగా అన్ని ప్రభుత్వ దుకాణాల్లో ఏర్పాటు చేసుకున్న సొంత సైన్యంతో దాదాపు సగానికి పైగా సరకును ఇప్పటికే బ్లాక్ చేసిందనే విమర్శలున్నాయి. తాజాగా దర్శి నియోజకవర్గం ముండ్లమూరు మండలంలోని మూడు దుకాణాల నుంచే ఏకంగా 240 కేసుల మద్యం పట్టుబడటం, ఇందులో ఆయా దుకాణాల సిబ్బంది ప్రమేయం ఉండటం ఇందుకు నిదర్శనం.
చెప్పినవారినే నియమించుకుని...: జిల్లాలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఒంగోలు, మార్కాపురం కేంద్రాలుగా రెండు మద్యం డిపోలు ఉన్నాయి. ఒంగోలు డిపో పరిధిలో 77, మార్కాపురం పరిధిలో 101 దుకాణాలున్నాయి. వీటిలో నియమితులైన సూపర్వైజర్లు, సేల్స్మెన్లలో అధికభాగం స్థానిక వైకాపా నాయకుల సిఫారసులు పొందినవారే. వీటి పర్యవేక్షణ బాధ్యత ఎక్సైజ్ శాఖకు అప్పగించారు. అప్పటికే సెబ్ ఏర్పాటుతో ఎక్సైజ్ శాఖలో సిబ్బంది కొరత అధికమైంది. దీంతో ఒక్కొక్క కానిస్టేబుల్ పది నుంచి 12 దుకాణాల విక్రయాలను రోజూ పర్యవేక్షించాలి. ఇది వారికి తలకు మించిన భారంగా మారింది.
చోద్యం చూస్తున్న సెబ్...: దుకాణాల్లో సిబ్బంది తమ సొంత మనుషులు కావటం, ఎక్సైజ్ శాఖ పర్యవేక్షణ కొరవడటంతో పాటు సెబ్ సమర్థంగా పనిచేయక పోవడంతో అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దుకాణాల్లో మంచి బ్రాండ్ల మద్యం అక్రమంగా తరలించి బ్లాక్ మార్కెట్లో విక్రయించేవారు. దుకాణాల్లో ఊరూపేరూ తెలియని జే బ్రాండ్ల మద్యాన్ని మాత్రమే విక్రయించేవారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇష్టారీతిన ప్రభుత్వ దుకాణాల నుంచి అధికార పార్టీ సొంతం చేసుకుంది. ఈ దఫా సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ మరింతగా బరితెగించింది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కోడ్కు ముందే భారీగా మద్యాన్ని పక్కదారి పట్టించింది. అయినా ప్రభుత్వం ఏర్పాటుచేసిన ప్రత్యేక వ్యవస్థ సెబ్ చిన్నాచితకా కేసులకే పరిమితమై చోద్యం చూస్తోంది. కొన్నిచోట్ల నెలవారీ మామూళ్లు పొందుతూ తూతూమంత్రపు తనిఖీలకే పరిమితమైంది.
ముండ్లమూరులో అధికారులు స్వాధీనం చేసుకున్న మద్యం కేసులు
నామినేషన్ల ముందు రోజు పట్టివేత...: ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత గతేడాది ఏ తేదీన ఎంత విక్రయించారో అదేస్థాయిలో విక్రయించాలని, మనిషికి ఒక సీసా మాత్రమే అమ్మాలని ఈసీ అదేశాలు జారీ చేసింది. ఇవి అధికార పార్టీకి ఆయాచిత వరంగా మారాయి. ప్రతి దుకాణానికీ రోజుకు 12 నుంచి 15 కేసుల మద్యం కేటాయిస్తున్నా.. ఉదయం 11 గంటలకు తెరిచిన దుకాణాలను తమ విక్రయ పరిమితి దాటిపోయిందంటూ మధ్యాహ్నం ఒంటి గంటలోపే మూసేస్తున్నారు. అదే సమయంలో పెద్దఎత్తున దొడ్డిదారిన తరలిస్తున్నారు. ఇందుకు బలం చేకూర్చేలా దర్శి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్రెడ్డి నామినేషన్కు ఒక్కరోజు ముందు ముండ్లమూరు మండలంలో భారీఎత్తున మద్యం డంప్ బయట పడటం, వీటిలో మూడు దుకాణాల సిబ్బంది ప్రమేయం ఉండటం గమనార్హం. పట్టుబడిన మద్యాన్ని పరిశీలించేందుకు జిల్లా ఎస్పీ సునీల్ అక్కడికి వెళ్లారు. అయితే పూర్తిస్థాయిలో విచారణ చేపట్టడాన్ని విస్మరించారు. ఇంత పెద్ద ఎత్తున మద్యాన్ని ఎవరి కోసం కొనుగోలు చేశారనే దిశగా దర్యాప్తు చేయడాన్ని మరిచారు. ఇప్పటికైనా అధికారులు పూర్తిస్థాయిలో స్పందించి జిల్లావ్యాప్తంగా గత కొన్నాళ్లుగా మద్యం దుకాణాల బాగోతాలపై లోతుగా విచారణ చేపడితే మరిన్ని మద్యం డంప్లు వెలుగుచూస్తాయి.
చీల్చి.. నిర్వీర్యం చేసి
ఎన్నికల తర్వాత ఆబ్కారీ శాఖను రెండుగా చీల్చేశారు. అక్రమ మద్యం, ఇసుక నియంత్రణ పేరిట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో(సెబ్)ను ఏర్పాటు చేశారు. ఎక్సైజ్ శాఖను కేవలం మద్యం దుకాణాల నిర్వహణకే పరిమితం చేశారు. అనంతరం సెబ్ను పోలీసు శాఖ పర్యవేక్షణలోకి తెచ్చారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి అందులో సూపర్వైజర్లు, సేల్స్మెన్లుగా తమ ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకున్నారు.
తనిఖీలంటూ వేధింపులు...
నూతన విధానంలో భాగంగా ఒక వ్యక్తికి కేవలం మూడు సీసాల మద్యం మాత్రమే విక్రయించేలా వైకాపా ప్రభుత్వం చట్టం చేసింది. అంతకుమించి ఒక సీసా దొరికినా అరెస్టు చేసి జైలుకు పంపేలా విధానం రూపొందించింది. రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటుచేసి వాహనాలు, ఆర్టీసీ బస్సులు సహా అర్ధరాత్రీ, అపరాత్రీ అనే తేడా లేకుండా మహిళలను కూడా వదిలి పెట్టకుండా తనిఖీల పేరిట వేధింపులకు గురిచేసింది.
తూట్లు పొడిచి.. అప్పులు చేసి...
మద్య విషేధం విషయంలో తాము పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని నమ్మించిన ప్రభుత్వం.. ఆనక చేతులెత్తేసింది. చివరికి మద్యం విక్రయాలపై వచ్చే ఆదాయాన్ని చూపి అప్పులు చేసింది. గతంలో రాష్ట్రంలో ప్రభుత్వ దుకాణాల ద్వారా విక్రయించే మద్యం మూడు సీసాలకు మించి ఉంటే అరెస్టు చేసి జైలుకు పంపిన ప్రభుత్వం.. గతేడాది ఏప్రిల్లో చట్ట సవరణ చేసింది. తొమ్మిది లీటర్లలోపు మద్యం(సుమారు 50 క్వార్టర్ సీసాలు)తో ఎవరైనా పట్టుబడితే స్టేషన్ బెయిల్ ఇవ్వొచ్చని పేర్కొంది. ఎన్నికల సమయంలో తమ నియంత్రణలోనే ఉన్న దుకాణాల సిబ్బంది ద్వారా విచ్చలవిడిగా మద్యం కొనుగోలు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బానిస పోలీసులపై వేటు
[ 01-05-2024]
పోలీసు శాఖ నుంచి వేతనం తీసుకుంటున్న కానిస్టేబుల్ ఒకరు అధికార పార్టీకి చెందిన యువనేతకు ప్రైవేట్ వ్యక్తిగత అంగరక్షకుడిలా మారారు. మరొకరు ఏళ్ల తరబడి స్టేషన్ ముఖం చూడకుండానే వ్యక్తిగత సేవలో తరిస్తున్నారు. -
భరోసాల తెదేపా... ప్రలోభాల వైకాపా
[ 01-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారంతో ముగిసింది. గెలుపే ధ్యేయంగా నాయక గణం ప్రచారపర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా సభలు ఏర్పాటు చేస్తున్నారు. -
దుకాణాల మూత.. అక్రమంగా చేరవేత
[ 01-05-2024]
ఎన్నికల వేళ అధికార వైకాపా బరితెగించింది. ఓటర్లను మద్యం మత్తులో ముంచి లబ్ధి పొందే కుటిల యత్నాలకు తెర లేపింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో తాము నియమించిన సిబ్బందిని వినియోగించుకుని ఇప్పటికే పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున అక్రమంగా నిల్వ చేసింది. -
మీకంటే రౌడీషీటర్లు నయం
[ 01-05-2024]
‘ఎన్నికల ప్రక్రియలో మీరు ఘోరంగా విఫలమవుతున్నారు. నామినేషన్ల వేళే మీ సామర్థ్యం ఏంటో తెలిసింది. వంద మీటర్ల పరిధి దాటకుండా పార్టీల కార్యకర్తల్ని అడ్డుకోలేకపోయారు. మీతో పోల్చుకుంటే గ్రామాల్లో రౌడీషీటర్లే ప్రజలను నియంత్రిస్తున్నారు. -
ఉపాధి హరీ.. శ్రమజీవికి ఉరి
[ 01-05-2024]
శ్రమను పెట్టుబడిగా..స్వేదాన్ని ఇంధనంగా మార్చి పారిశ్రామిక వెలుగులు పూయించిన కార్మిక వర్గం నేడు చీకట్లో మగ్గుతోంది. తెదేపా హయాంలో మద్దిపాడు గ్రోత్ సెంటర్..గెలాక్సీపురిలో గ్రానైట్ యూనిట్లు..మార్కాపురంలో పలకల పరిశ్రమలు శ్రమజీవులతో కళకళలాడేవి. -
ప్రాజెక్టులు, పాత హామీల దాటవేత
[ 01-05-2024]
అసలే వెనుకబడిన ఎస్సీ నియోజకవర్గం..దానికితోడు గత అయిదేళ్లుగా ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేపట్టిందీ లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం టంగుటూరులో ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్.. స్థానికుల సహనానికి పరీక్ష పెట్టారు. -
ప్రజల ఆస్తులు కొట్టేసేందుకు జగన్ పన్నాగాలు
[ 01-05-2024]
ఆంధ్ర రాష్ట్రాన్ని దుర్మార్గుల బారి నుంచి కాపాడుకునేందుకు సమర్థులకు మద్దతుగా నిలవాలని తెదేపా హిందూపురం ఎమ్మెల్యే, సినీ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కోరారు. మర్రిపూడిలో మంగళవారం నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడారు. -
రాష్ట్రంలో ఒంగోలు నుంచే మార్పు మొదలు
[ 01-05-2024]
‘2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా గాలి వీచినా.. ఉమ్మడి ప్రకాశంలో తెదేపా నెగ్గింది. మీరంతా కలిసి పౌరుషాల గడ్డ ప్రకాశం నుంచి పార్టీకి నాలుగు స్థానాలిచ్చారు. ఒంగోలు మహానాడు విజయవంతం నుంచి యువగళం పాదయాత్ర వరకు అన్నింటా అండగా నిలిచారు. -
నిలువునా ఎండిన ఉద్యాన తోటలు
[ 01-05-2024]
చినుకు జాడ లేదు.. అడుగంటిన భూగర్భ జలం.. ఫలితంగా బోరు బావుల్లో నీళ్లు లేక ఉద్యాన తోటలు నిలువెల్లా ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కెప్టెన్గా మార్ష్.. యంగ్ సెన్సేషన్కు నో ఛాన్స్.. ఆసీస్ జట్టు ఇదే!
-
‘రామాయణ’లో పాత్ర..రూమర్స్పై లారా దత్తా కామెంట్స్
-
లోక్సభ ఎన్నికల వేళ.. దిల్లీ హైకోర్టుకు ‘డీప్ఫేక్’ వ్యవహారం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
జీఎస్టీ చరిత్రలో రికార్డు వసూళ్లు.. ఒక్క నెలలో రూ.2.10 లక్షల కోట్లు!
-
చెన్నై ‘విన్నింగ్’ ట్రెండ్ను కొనసాగిస్తుందా.. ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకుంటుందా?