స్వాతంత్య్రమే లక్ష్యం.. పోరాటంలో మనం
జాతి సంపదను దోచుకుపోతున్న తెల్లోళ్లను తరిమేందుకు.. బానిస సంకెళ్ల నుంచి భావితరాలకు విముక్తి కోసం... స్వరాజ్య సాధనే ధ్యేయంగా... ధన, ప్రాణాలను క్కచేయక.. బ్రిటిష్ దొరల చిత్రహింసలకు అదరక, బెదరక.. జైల్లోనే ఓనమాలు దిద్ది.. పోరాట పాఠాలు నేర్చుకుని... తెల్లవాడి తూటాలకు ఎదురొడ్డారు.. ప్రాణత్యాగాలు చేశారు.. నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం, స్వేచ్ఛ వెనుక సిక్కోలు ప్రముఖులెందరో ఉన్నారు. ఆజాదీ
- ఈనాడు డిజిటల్, శ్రీకాకుళం, న్యూస్టుడే, ఇచ్ఛాపురం
జాతి సంపదను దోచుకుపోతున్న తెల్లోళ్లను తరిమేందుకు..
బానిస సంకెళ్ల నుంచి భావితరాలకు విముక్తి కోసం...
స్వరాజ్య సాధనే ధ్యేయంగా...
ధన, ప్రాణాలను లెక్కచేయక..
బ్రిటిష్ దొరల చిత్రహింసలకు అదరక, బెదరక..
జైల్లోనే ఓనమాలు దిద్ది.. పోరాట పాఠాలు నేర్చుకుని...
తెల్లవాడి తూటాలకు ఎదురొడ్డారు..
ప్రాణత్యాగాలు చేశారు..
నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రం, స్వేచ్ఛ వెనుక సిక్కోలు ప్రముఖులెందరో ఉన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవాన వారందరికీ వందనాలు...
షేర్ మహ్మద్పురంలో కిసాన్ కాంగ్రెస్ మహాసభలో పాల్గొన్న నాయకులు
స్వాతంత్య్ర సాధనకు ముందు జిల్లాలో జరిగిన ఉద్యమాన్ని మూడు దశలుగా చరిత్రకారులు అభివర్ణించారు. గాంధీ మహాత్ముడు 1927లో జిల్లాను సందర్శించారు. శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వరకూ పర్యటించి ప్రతి ఒక్కరిలో పోరాట స్ఫూర్తి రగిలించారు. అక్కడి నుంచి జాతీయోద్యమం ఊపందుకుంది. 1936-40 మధ్య కాలాన్ని రెండో దశగా పరిగణించారు. దేశవ్యాప్తంగా ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. 1940-47 మధ్యకాలంలో ముఖ్యంగా 1942 ఆగస్టులో ఉద్యమంలో సామూహిక సత్యాగ్రహంలో జిల్లా వీరయోధులు, దేశభక్తులు వందమందికి పైగా జైళ్లకు వెళ్లారు. కొన్నివేల మంది ఉద్యమాగ్నికి ఆజ్యం పోశారు.
పలాసలో కిసాన్ సభలు
ఉద్యమంలో భాగంగా 1940 మార్చి 26 నుంచి 30 వరకు ఆల్ ఇండియా కిసాన్ మహాసభలు పలాసలో జరిగాయి. దీనికి శ్యామసుందరం అధ్యక్షులు కాగా జనరల్ సెక్రటరీ గౌతు లచ్చన్న, జాయింట్ సెక్రటరీ జొన్నలగడ్డ రామలింగయ్య వ్యవహరించారు. పలాస రైల్వేస్టేషన్కు అతి దగ్గరలో ఏర్పాటు చేసిన సభకు విద్యుత్తు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. క్షణాల్లో పెట్రోమాక్సు, గ్యాస్ లైట్లు వచ్చి పడ్డాయి. మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, బిహార్, రాజస్థాన్, ఒడిశా నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన ప్రతినిధులు, రైతులతో పలాస నిండిపోయింది. దాదాపు 1.5 లక్షల మంది హాజరైనట్లు అంచనా.
ఉద్దానంలో ఉదయించిన సర్దార్
దేశంలో వల్లభ్ భాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి గౌతు లచ్చన్న. వి.వి.గిరి, సుభాష్ చంద్రబోస్ వంటి జాతీయ నాయకులతో కలిసి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. తన 21వ ఏట గాంధీజీ పిలుపుతో విద్యకు స్వస్తిపలికి ఉద్యమంలోకి దూకారు. 1930లో ఉప్పు సత్యాగ్రహానికి ప్రభావితుడైన లచ్చన్న బారువ వద్ద ఉప్పు తయారు చేసి ఆ డబ్బుతో ఉద్యమం నడిపారు. విదేశీ వస్తు బహిష్కరణలో పాల్గొని అందరూ చూస్తుండగానే తన విలువైన దుస్తులు అగ్నికి ఆహుతి చేశారు. ఈ సమయంలో ఆయన్ను అరెస్టు చేసి టెక్కలి, నరసన్నపేట సబ్ జైళ్లలో 40 రోజులు ఉంచారు. 1932లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్న లచ్చన్నను బంధించి రాజమహేంద్రవరం జైల్లో ఐదు నెలలు ఉంచారు. బయటకొచ్చి రాజకీయాలు, సంఘ సంస్కరణలకు నడుం బిగించారు. అంటరానితనంపై కత్తి ఝుళిపించారు. ఆయన నడిపిన హరిజన సేవా సంఘాలు, చేపట్టిన హరిజన రక్షణ యాత్రలు ప్రజల్లోకి వెళ్లాయి.
\శాసన ఉల్లంఘనకు పాల్పడ్డారని సర్దార్ గౌతు లచ్చన్నను అరెస్టుచేస్తున్న పోలీసులు
పట్టిస్తే రూ.10 వేల బహుమతి..
స్వాతంత్రోద్యమంలో చివరిదిగా చెప్పుకొనే క్విట్ ఇండియా ఉద్యమం 1942లో జరిగింది. ఈ సమయంలో లచ్చన్నను అతి ప్రమాదకరమైన, ప్రభావిత గల వ్యక్తిగా భావించిన నాటి ప్రభుత్వం ఆయన్ను పట్టిస్తే రూ.10 వేలు బహుమతి ప్రకటించింది. చివరకు ప్రభుత్వమే అతన్ని బంధించి మూడేళ్లు జైల్లో ఉంచి 1945 అక్టోబరులో విడిచిపెట్టింది. అప్పటి నుంచి ఆంధ్రాలో లచ్చన్న అగ్రనాయకుల్లో ఒకరుగా
నిలిచారు.
పరాయి పెత్తనంపై పుల్లెల గర్జన
అపార సంపదను తృణప్రాయంగా వదులుకుని, తెల్లదొరల పాలన నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు పోరాడి, చిరుప్రాయంలోనే కన్నుమూసిన మహనీయుడు పుల్లెల శ్యామసుందరరావు. ఈయనిది ఇచ్ఛాపురం. నాడు బ్రిటీష్దొరలను గడగడలాడించి ఫైర్ ది గ్రేడ్ అనిపించుకున్నారు. విద్యార్థి దశలోనే 1921లో మహాత్ముడు నిర్వహించిన సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని ఉద్యమబాట పట్టారు. ‘దున్నేవాడిదే భూమి’ నినాదంతో రైతు ఉద్యమానికి కళింగసీమ నుంచి నాయకత్వం వహించారు. తొలుత తన భూములనే రైతుపరం చేసి ఆదర్శంగా నిలిచారు. 1930లో నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం, శాసనోల్లంఘన ఉద్యమాల్లో పాల్గొని జైలుశిక్ష అనుభవించారు.. పుల్లెల పోరాటస్పూర్తిని మెచ్చుకున్న గాంధీ ఇచ్ఛాపురంలో ఆరుగంటల పాటు గడిపి, స్వాతంత్రోద్యమ ప్రసంగాన్ని చేశారు. ఈ ఘట్టం ప్రస్తుత దాసన్నపేటలో జరిగింది.
నిద్రలేపి మరీ అరెస్టులు..
* 1921లో ఆంధ్ర కాంగ్రెస్ మహాసభలు బరంపురంలో గంపలగూడెం జమిందార్ అధ్యక్షతన జరిగాయి. తిరుగు ప్రయాణంలో జమిందార్ ఉండగా శ్రీకాకుళం-దూసి రైల్వేస్టేషన్ల మధ్య నిద్రలేపి పోలీసులు అరెస్టులు చేశారు.
* 1923లో కళింగపట్నంలో కప్పగంతుల రామయ్యపంతులు అధ్యక్షతన జిల్లా రాజకీయ సభ జరిగింది.
* 1930లో గాంధీ పిలుపు మేరకు నౌపడాలో నాయకులు చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం విజయవంతమైంది. ఇదే సమయంలో గాంధీజీ నౌపడా రైల్వేస్టేషన్లో ఉద్యమకారులతో మాట్లాడారు.
జాతీయోద్యమంలో జిల్లా ప్రముఖులు
గాంధీజీ సిక్కోలు పర్యటన తర్వాత విదేశీ వస్త్ర దహనం, ఖద్దరు వినియోగం, కల్లు దుకాణాల పికెటింగ్, అంటరానితనానికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. 1920లో బరంపురం, నరసన్నపేట కేంద్రాలుగా రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయోద్యమాలు నిర్వహించారు. నరసన్నపేటలో పొట్నూరు స్వామిబాబు అండతో సమరయోధులు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించారు. నాడు విద్యార్థులు పాఠశాలలను బహిష్కరించి ఉద్యమాల్లో పాలు పంచుకున్నారు. వారిలో టెక్కలికి చెందిన అట్టాడ కృష్ణమూర్తి, శ్రీకాకుళానికి చెందిన పూడిపెద్ది వెంకటరావు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటల మంత్రి.. పలాసకు చేసిందేంటి?
[ 07-05-2024]
పలాస ముఖచిత్రాన్ని మారుస్తామని గత ఎన్నికల్లో హామీలు గుప్పించిన సీదిరి అప్పలరాజు అధికారంలోకి రాగానే వాటిని విస్మరించారు. కాలం కలిసి రావడంతో వైకాపా ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు. అయిదేళ్ల పాటు ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. -
ముఖ్యమంత్రి గారూ.. బటన్ నొక్కేస్తే నీళ్లిచ్చినట్లేనా..
[ 07-05-2024]
ఉద్దానం ప్రజలు కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా వంశధార జలాశయం నుంచి ఉపరితల జలాలు అందిస్తామని జగన్ ఊదరగొట్టారు. -
జగన్మాయ..!
[ 07-05-2024]
ఉద్దానం పేరు వినగానే కిడ్నీ వ్యాధితో అతలాకుతలమైన కుటుంబాలు గుర్తుకొస్తాయి. కాశీబుగ్గ వద్ద తెదేపా హయాంలో శంకుస్థాపన చేసిన భవన నిర్మాణాన్ని వైకాపా ప్రభుత్వం పూర్తి చేసినా తగిన వసతులు కల్పించలేదు. -
నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుదాం
[ 07-05-2024]
రాష్ట్రంలో అయిదేళ్ల పాటు కొనసాగిన వైకాపా ప్రభుత్వ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుదామని తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కింజరాపు రామ్మోహన్నాయుడు, గొండు శంకర్ పిలుపునిచ్చారు. -
కమ్యూనిస్టు యోధుడు శ్రీరాములు కన్నుమూత
[ 07-05-2024]
మండల పరిధి నగరంపల్లిలో సోమవారం తొలితరం కమ్యూనిస్టు యోధుడు బమ్మిడి శ్రీరాములు (91) అనారోగ్యంతో కన్నుమూశారు. సుమారు 70 ఏళ్ల పాటు కమ్యూనిస్టు భావజాలంతో కొనసాగారు. -
సముద్రమంత కష్టం.. వలస బతుకులే శరణ్యం
[ 07-05-2024]
మత్స్యకారుడైన అప్పలరాజు మత్స్య శాఖకు మంత్రి కాగానే ఆ సామాజిక వర్గీయులు సంబరపడ్డారు. కష్టాలు తీరుతాయని ఆశించారు. వీలున్నప్పుడల్లా ఆయనను కలిసి సమస్యలు విన్నవించారు. -
చేనేత ఊపిరి తీసిన జగన్..!
[ 07-05-2024]
సంప్రదాయ వస్త్రాలను ఉత్పత్తి చేసే నేతన్నల బతుకు భారంగా మారింది. ఐదేళ్ల పాలనలో జగన్ కనీస ప్రోత్సాహం అందించలేదు. చేనేత గ్రామాలుగా పేరుగాంచిన ప్రాంతాల్లో మగ్గం చప్పుడు వినిపించడం లేదు. -
ప్రచారం జోరు..!
[ 07-05-2024]
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి యాదవులలో అత్యధికులు ఈ పార్టీ వెంటే ఉన్నారని, రాబోయే కాలంలో సముచిత స్థానం లభిస్తుందని పట్టణ తెదేపా అధ్యక్షులు కాళ్ల ధర్మారావు యాదవ్ అన్నారు. -
నీరు గారిన పథకం
[ 07-05-2024]
ప్రజల దాహార్తి తీర్చే తాగునీటి పథకాల నిర్వహణ ఐదేళ్లుగా గాలికి వదిలేయడంతో అవి శిథిలావస్థకు చేరుకున్నాయి. ఫలితంగా నీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. -
వైకాపా నుంచి తెదేపాలో చేరికలు
[ 07-05-2024]
కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడలోని టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు కార్యాలయంలో సోమవారం ఆయన సమక్షంలో వైకాపా నుంచి పలువురు తెదేపాలో చేరారు. -
జగన్ను ఇంటికి సాగనంపుదాం
[ 07-05-2024]
అయిదేళ్ల పాలనలో జగన్ ప్రభుత్వం రాష్ట్ర్రానికి చేసిన అభివృద్ధి శూన్యమని, పరిశ్రమలను వెళ్లగొట్టి యువతను నిరుద్యోగులుగానే వదిలేశారని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయడు, టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు... -
ఆఖరి మజిలిలోనూ ‘అవస్థలే’..!
[ 07-05-2024]
నరసన్నపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో సుమారు 400లకు పైగా శ్మశాన వాటికలు ఉన్నాయి. వీటిలో అత్యధిక శాతం రూపురేఖలే కోల్పోయాయి. దీంతో దహన సంస్కారాలకు వెళ్లేందుకు అవస్థలు పడాల్సి వస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
ఆస్ట్రేలియా హెలికాప్టర్పై నిప్పుల వర్షం.. చైనా దుందుడుకు చర్య
-
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!