logo

‘పవన్‌ కటౌట్‌ చూసి ధర్మాన బెదిరారు’

గార మండలం లింగాలవలసలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం జరుగుతున్న సమయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కటౌట్‌ చూసి మంత్రి ధర్మాన ప్రసాదరావు బెదిరిపోయారని ఆ పార్టీ పాతపట్నం నియోజకవర్గ ఇన్‌ఛార్జి గేదెల చైతన్య విమర్శించారు. శ్రీకాకుళం నగరంలోని పార్టీ కార్యాలయంలో

Published : 10 Aug 2022 04:08 IST

మాట్లాడుతున్న గేదెల చైతన్య, చిత్రంలో ఇతర నాయకులు

అరసవల్లి, న్యూస్‌టుడే: గార మండలం లింగాలవలసలో ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం జరుగుతున్న సమయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ కటౌట్‌ చూసి మంత్రి ధర్మాన ప్రసాదరావు బెదిరిపోయారని ఆ పార్టీ పాతపట్నం నియోజకవర్గ ఇన్‌ఛార్జి గేదెల చైతన్య విమర్శించారు. శ్రీకాకుళం నగరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన కార్యకర్తలు అభిమానంతో కట్టిన బ్యానర్‌ను చూసి మంత్రి ధర్మాన ఓర్వలేక అకారణంగా మాట్లాడారన్నారు.  2019లోనూ జనసేన ఓట్లు చీలడం వల్లే ఆయన గెలిచిన విషయం గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రజల డబ్బులను పథకాల కోసం ఖర్చు చేసి గొప్పలు చెప్పుకోవడం మానేసి, సొంతంగా ప్రజలకు ఏం చేశారో చెప్పాలని కోరారు. 15 ఏళ్లుగా నగరపాలక సంస్థ ఎన్నికలు పెట్టలేని దయనీయ స్థితిలో ఉన్నారని వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని