logo

బావిలో పడి వ్యక్తి దుర్మరణం

మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతిచెందిన ఘటన ఇచ్ఛాపురంలో చోటుచేసుకుంది. పలాస రైల్వే క్వార్టర్స్‌కు సమీపంలో ఉంటున్న భైరవ్‌ నాయకో(44) ఈ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు

Published : 12 Aug 2022 05:04 IST

బైరవ్‌ నాయకో (పాతచిత్రం)

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: మద్యం మత్తులో ఉన్న వ్యక్తి ప్రమాదవశాత్తూ బావిలో పడి మృతిచెందిన ఘటన ఇచ్ఛాపురంలో చోటుచేసుకుంది. పలాస రైల్వే క్వార్టర్స్‌కు సమీపంలో ఉంటున్న భైరవ్‌ నాయకో(44) ఈ ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నాయకో తొలి భార్య మృత్యువాత పడగా, కుమారునితో ఉండేవాడు. అనంతరం బెల్లుపడ హడ్డివీధికి చెందిన మహిళతో రెండో వివాహమైంది. పొక్లెయిన్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ, తరచూ ఇక్కడకు వస్తుండేవాడు. బుధవారం కూడా అలాగే వచ్చి దాసన్నపేట-రథంవీధి కూడలిలో ఉన్న దుకాణంలో మద్యం తాగాడు. ఆ తరువాత ఏమైందో గానీ దుకాణం పక్కనే ఉన్న బావిలో పడిపోయాడు. గమనించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపకదళం వారు అర్ధరాత్రి దాటిన తరువాత వచ్చి బావిలోంచి మృతదేహాన్ని బయటకు తీశారు. శవపంచనామా కోసం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని