ఉద్దానంలో పడకేసిన వైద్యం
కంచిలి మండలం జె.నారాయణపురం గ్రామానికి చెందిన గర్భిణి ప్రసవానికి సోంపేట సామాజిక ఆసుపత్రిని సంప్రదించగా సంబంధిత వైద్యులు లేరని చెప్పారు. దీంతో పేదవర్గానికి చెందిన సంబంధిత మహిళ రూ.35 వేలు వెచ్చించి ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవం చేయించుకుంది. ప్రత్యేక వైద్యులు లేకపోవడంతో ఇదిగో ఇలా ప్రసూతిని ఇలా సాధారణ వార్డుగా మార్చేశారు.
వైద్యుల కొరతతో నామమాత్ర సేవలు
న్యూస్టుడే, సోంపేట
కంచిలి మండలం జె.నారాయణపురం గ్రామానికి చెందిన గర్భిణి ప్రసవానికి సోంపేట సామాజిక ఆసుపత్రిని సంప్రదించగా సంబంధిత వైద్యులు లేరని చెప్పారు. దీంతో పేదవర్గానికి చెందిన సంబంధిత మహిళ రూ.35 వేలు వెచ్చించి ప్రైవేటు ఆసుపత్రిలో ప్రసవం చేయించుకుంది. ప్రత్యేక వైద్యులు లేకపోవడంతో ఇదిగో ఇలా ప్రసూతిని ఇలా సాధారణ వార్డుగా మార్చేశారు.
ఉద్దానం మండలాల పెద్దాసుపత్రుల్లో పేదలవైద్యం పడకేసింది. ఆరుగురు వైద్యులుండాల్సిన చోట ఒకరిద్దరే ఉండడంతో నామమాత్ర సేవలకే పరిమితమవుతున్నారు. ప్రమాదాలు, ఇతర అత్యవసర వైద్యానికి శ్రీకాకుళం, బ్రహ్మపుర వెళ్లాల్సిన పరిస్థితితో పేదలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కిడ్నీ రోగులకు ప్రాథమికవైద్యమూ అందని పరిస్థితి నెలకొంది. వారు శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తోంది.
సోంపేటలో ఆరుగురికి ఒక్కరే..
సోంపేట సామాజిక ఆసుపత్రిలో నెలకు సగటున 75 వరకు ప్రసవాలు జరిగేవి. ఇద్దరు గైనకాలజిస్టుల్లో ఒకరు స్వచ్ఛంద విరమణ చేయగా, మరొకరికి బదిలీ అయ్యారు. దీంతో ప్రసవాలు నిలిచిపోయాయి. ఆరుగురు వైద్యులకు చిన్నపిల్లల వైద్యుడు ఒక్కరే మిగిలారు. ఇచ్ఛాపురం నుంచి మందస మండలం మదనాపురం వరకు జాతీయ రహదారిపై ఎక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగినా ఐదు మండలాల్లో ఎక్కడ పాముకాట్లు సంభవించినా బాధితులు ఇక్కడకే వస్తుంటారు. ప్రస్తుతం ఒక్కరే వైద్యుడు ఉండడంతో రోజువారీ రోగులను చూసేందుకు సమయం చాలకపోగా చిన్న, చిన్న ప్రమాదాలకు సైతం శ్రీకాకుళం పంపించాల్సిన పరిస్థితి ఉంది.
ఇచ్ఛాపురంలో మరో ముగ్గురు అవసరం..:
సుమారు 80 గ్రామాలకు ఇచ్ఛాపురం సామాజిక ఆసుపత్రే దిక్కు. రూ.3.50 కోట్లతో ఆధునాతన భవనాన్ని నిర్మించినా.. ఆరుగురు వైద్యులకు ముగ్గురే ఉన్నారు. వీరిలో ఒక్కరే రెగ్యులర్. ఆయన చర్మవ్యాధి నిపుణులైనా సాధారణ సేవలూ అందిస్తున్నారు. అర్థోపెడిక్, ప్రసూతి వైద్యనిపుణులు ఒప్పంద తరహాలో సేవలందిస్తున్నారు. రోజుకు సుమారు 200 మంది వస్తుంటారు. కనీసం ఒక సర్జన్, ఇద్దరు ఎంబీబీఎస్ వైద్యులను తాత్కాలికంగా అయినా నియమించాలి.
హరిపురంలో కిడ్నీ రోగుల ఇక్కట్లు..:
మందస మండలం హరిపురం సామాజిక ఆసుపత్రిలో ఏడుగురు వైద్యులకు ఇద్దరు సెలవులో ఉన్నారు. దంతవైద్యం వారానికి మూడు రోజులకే పరిమితం కాగా సూపరింటెండెంట్ ఎప్పుడొస్తారో తెలియని పరిస్థితి. ఇక్కడ కిడ్నీరోగులు ఎక్కువగా వస్తుంటారు. వైద్యులు లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించి అప్పులపాలవుతున్నారు.
బారువలో సిబ్బందే దిక్కు..
బారువ సామాజిక ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యుడు, గైనకాలజిస్టు ఉన్నప్పటికీ ఎప్పుడు ఎవరు అందుబాటులో ఉంటారో తెలియదు. ఈ ఆసుపత్రికి హెడ్నర్సు, ఇతర పారామెడికల్ సిబ్బంది మాత్రమే దిక్కుగా మారారు. ఇక్కడ పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందకపోవడంతో బారువ మేజర్ పంచాయితీతో పాటు తీరప్రాంత గ్రామాల రోగులు సంచివైద్యులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇప్పటి వరకు ఒకే డాక్టర్తో నడిచిన కవిటి సామాజిక ఆసుపత్రిలో ఇటీవల ముగ్గురు వైద్యులను నియమించారు. అందులో ఒకరు డెప్యుటేషన్. ఉద్దానానికి కీలకమైన ఈ ఆసుపత్రి వైద్యుల కొరతతో పీహెచ్సీ స్థాయి సేవలు కూడా అందించలేకపోతోంది. ప్రసూతి, చిన్నపిల్లల వైద్యుల పోస్టులు భర్తీకి నోచుకోకపోవడంలేదు. డయాలసిస్కేంద్రం వద్ద నిరీక్షిస్తున్న కిడ్నీరోగులను చిత్రంలో చూడవచ్చు.
నియామకానికి ప్రయత్నం... సోంపేట సామాజిక ఆసుపత్రితో పాటు ఇతర చోట్ల ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ విషయమై కలెక్టర్, వైద్యశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నాం. కొందరిని నియమించినా వారు విధుల్లో చేరకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. వీలైనంత త్వరలో సమస్యను పరిష్కరిస్తాం.
- పిరియా విజయ, జడ్పీ అధ్యక్షురాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!