logo

ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రీఫైనల్‌గా భావిస్తున్నాం: కృష్ణదాస్‌

త్వరలో జరగబోయే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రీఫైనల్‌ టెస్ట్‌గా భావిస్తున్నామని మాజీ ఉప ముఖ్మమంత్రి, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు

Published : 27 Sep 2022 06:27 IST

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌

అరసవల్లి, న్యూస్‌టుడే: త్వరలో జరగబోయే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రీఫైనల్‌ టెస్ట్‌గా భావిస్తున్నామని మాజీ ఉప ముఖ్మమంత్రి, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ బలపర్చిన సీతంరాజు సుధాకర్‌ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. పార్టీ గుర్తుమీద ఎన్నికలు జరగకపోయినా ఈ ఎన్నికలను తాము ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం కేడరంతా కలిసికట్టుగా పనిచేయాలన్నారు. ఫలితం చూసి శత్రువుల వెన్నులో వణుకు పుట్టడం ఖాయమన్నారు. అర్బన్‌ ఒటర్లు పార్టీకి దూరమనే ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి సుధాకర్‌ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తానని, ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ పిరియా విజయ, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, పార్టీ నేతలు కృపారాణి, దానేటి శ్రీధర్‌, మీసాల నీలకంఠం, ఎన్ని ధనుంజయరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని