ఆశలు జలసమాధి..!
జిల్లాలో గురువారం వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. నీటమునిగి ఇద్దరు మృతి చెందగా.. ఓ బాలుడు గల్లంతయ్యాడు. బలవన్మరణానికి పాల్పడి ఒకరు ప్రాణాలు విడించారు.
జిల్లాలో గురువారం వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృత్యువాత పడ్డారు. నీటమునిగి ఇద్దరు మృతి చెందగా.. ఓ బాలుడు గల్లంతయ్యాడు. బలవన్మరణానికి పాల్పడి ఒకరు ప్రాణాలు విడించారు. వారిపై కుటుంబసభ్యులను పెట్టుకున్న ఆశలను జలసమాధి చేశారు.
ఒకే పంచాయతీలో ఇద్దరి మృత్యువాత
పొందూరు, న్యూస్టుడే: పొందూరు మేజరు పంచాయతీ పరిధిలో గురువారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొందూరు పంచాయతీ లక్ష్మీపేట గ్రామానికి చెందిన మొకర సాయి(34) ఆటోపై పాత ఇనుప సామాన్లు సేకరించే వ్యాపారం చేస్తున్నాడు. నాలుగు రోజుల నుంచి అతడు కనిపించడం లేదు. కుటుంబ సభ్యులు వెతుకుతున్నారు. గురువారం ఉదయం గ్రామానికి సమీపంలోని చెరువులో ఆయన మృతదేహాన్ని వారు గుర్తించారు. సాయికి¨ భార్య సిమ్మన్న, కుమారుడు శ్యామలరావు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బహిర్భూమికి చెరువుకు వెళ్లి ప్రమాదవశాత్తు పడిపోవడంతో మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు.
చెత్త వేసేందుకు వెళ్లి.. మేజరు పంచాయతీ విజయభారతి కాలనీకి చెందిన అనకాపల్లి రాము (36) ఇంటికి సమీపంలోని బావిలో కాలుజారి పడి మృతి చెందాడు. బావిలో చెత్త వేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయినట్లు కాలనీ వాసులు తెలిపారు. గురువారం మృతదేహాన్ని బయటకు తీశారు. భవన నిర్మాణ కార్మికుడైన రామకు భార్య భాగ్యం, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్సై ఎన్.లక్ష్మణరావు సిబ్బందితో వెళ్లి శవ పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టానికి శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు.
వంశధార నదిలో విద్యార్థి గల్లంతు
గార, న్యూస్టుడే: దసరా సెలవులకు తాతగారింటికి వచ్చిన బాలుడు ప్రమాదవశాత్తూ వంశధార నదిలో పడి గల్లంతైన ఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలంలో గురువారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గార మండల కేంద్రానికి సమీపంలో వంశధార నదిలో విశాఖపట్నం కొత్త గాజువాక హైస్కూలు రోడ్డు ప్రాంతానికి చెందిన టోకూరు కార్తీక్ (9) గురువారం గల్లంతైయ్యాడు. తల్లి లక్ష్మి, అక్క లోకితతో కలిసి గార మండలం తూలుగు పంచాయతీ కొయ్యానపేటలోని తాతగారింటింకి రెండు రోజుల కిందట వచ్చారు. భవానీ దీక్షలో ఉన్న చిన్నాన్న దేవరాజ్ వ్యాను శుభ్రం చేసుకునేందుకు గురువారం నది వద్దకు వెళ్తుండగా కార్తిక్, లోకిత, దేవరాజ్ ఇద్దరు పిల్లలు వెళ్లారు. దేవరాజ్ వాహనం కడుగుతుండగా కార్తీక్ నదిలోకి దిగాడు. ప్రవాహంలో కొట్టుకుపోయాడు. సమాచారం తెలుసుకుని అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులు, గజ ఈతగాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేదు. సాయంత్రం వరకు కార్తీక్ ఆచూకీ లభ్యం కాలేదు. కార్తీక్ తండ్రి లారీ క్లీనరుగా పనిచేస్తున్నారు. ఆయన చరవాణి స్పందించకపోవడం సాయంత్రం వరకు ఈ విషయం ఆయనకు చేరలేదు. ఎస్ఐ మధుసూదనరావు గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో బలవన్మరణం
లావేరు, న్యూస్టుడే: ఆర్థిక బాధలు తాళలేక పొలాల్లో కలుపు నివారణకు వినియోగించే మందు ద్రావణం తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లావేరు మండలంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బుడుమూరు పంచాయతీ బొంతువలసకి చెందిన బాస జగదీశ్వరరావు(32) స్థానికంగా ఓ ప్రైవేటు పరిశ్రమలో కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కొంతమేర అప్పులు చేశారు. తీర్చే మార్గం లేకపోవడంతో మంగళవారం రాత్రి పురుగుల మందు తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజనాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు జామున మృతిచెందాడు. ఇతనికి భార్య, ఐదేళ్ల కుమార్తె, తల్లిదండ్రులు ఉన్నారు. ఈ మేరకు లావేరు ఏఎస్ఐ కె.భుజంగరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?