తవ్వేసి తరలించేసి!
అక్రమార్కులు ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాల్లోని కొండలను తవ్వేసి కంకరను యథేచ్ఛగా తరలిస్తున్నారు.
కరిగిపోతున్న కొండలు
పట్టని అధికారులు
గాజులకొల్లివలసలోని ఈ కొండ నుంచే కంకర తవ్వేస్తున్నారు..
ఆమదాలవలస గ్రామీణం, సరుబుజ్జిలి, న్యూస్టుడే: అక్రమార్కులు ఆమదాలవలస, సరుబుజ్జిలి మండలాల్లోని కొండలను తవ్వేసి కంకరను యథేచ్ఛగా తరలిస్తున్నారు.. అయినా రెవెన్యూ, పంచాయతీ, సచివాలయాల అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.. పెద్దఎత్తున కంకర నిత్యం తరలిపోతున్నా.. ప్రభుత్వాదాయానికి గండి పడుతున్నా పట్టించుకోవడం లేదు. స్థానిక నాయకుల అండదండలతోనే ఈ అక్రమార్కుల దందా కొనసాగుతోంది.
దొరికితే వదలరు..:
ఆమదాలవలస మండలం సైలాడ రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 183లో సంగమేశ్వరస్వామి కొండ 230 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఈ కొండ సైలాడ, దివంజిపేట, జగ్గుశాస్త్రులపేట, గాజులకొల్లివలస, చిట్టివలస ప్రాంతాల వరకూ ఉంది. జగ్గుశాస్త్రులపేట, చిట్టివలస వద్ద ఎర్ర కంకరను గుత్తేదారులు అక్రమంగా తవ్వేస్తున్నారు. ఈ కొండ గాజులకొల్లివలస జగనన్న కాలనీ వెనుక భాగంలో ఉండటం, కాలనీకి నేరుగా సీసీరోడ్డును అధికారులు నిర్మించడంతో నేరుగా కొండ వద్దకు జేసీబీలతో వెళ్లి తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. సరుబుజ్జిలి మండలం పెద్దపాలెం పంచాయతీలోని దంతవరపుకోట కొండ సరుబుజ్జిలి పంచాయతీ నందికొండ కాలనీ పరిధి రిజర్వు ఫారెస్టులో ఉంది. అటవీశాఖ అధికారుల అనుమతులు లేకుండా ఇక్కడి నుంచి కూడా పెద్దఎత్తున కంకరను గుత్తేదారులు ఇష్టానుసారంగా తొలిచేసి ట్రాక్టర్లతో తరలిస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
చిట్టివలస ఎర్రకొండ నుంచి కంకర తరలించేందుకు సిద్ధంగా ఉన్న ట్రాక్టర్
మంచి గిరాకీ: ప్రస్తుతం రహదారులు, జగనన్న ఇళ్లు, ఇతరుల సొంత ఇళ్ల నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతుండటంతో ఈ కంకరకు మంచి గిరాకీ ఉంది. దీంతో గుత్తేదారులు ఇదే అదనుగా ఈ కొండలను తొలిచేసి రోజూ సుమారు 60 నుంచి 80 ట్రాక్టర్ల వరకూ తరలిస్తున్నారు. తరలించే దూరాన్ని బట్టి ట్రాక్టర్ లోడు విలువ రూ.1,500 నుంచి రూ.2,000 వరకూ పలుకుతోంది. దీంతో కొందరు అక్రమార్కులు కొండలను తొలిచి కంకరని తరలిస్తున్నారు. తవ్వకాలను నిలుపుదల చేయాలని పలువురు కోరుతున్నారు.
చర్యలు చేపడతాం: కొండలను తవ్వి ఎర్రకంకరను తరలిస్తున్న వారిపై చర్యలు చేపడతాం. వీటి తవ్వకాలకు ఎటువంటి అనుమతులూ ఇవ్వలేదు. అక్రమంగా కొండలను తవ్వేస్తున్న ప్రాంతాల్లో పరిశీలిస్తాం. ట్రాక్టర్లను పట్టుకొని సీజ్ చేస్తాం.
వై.వి.పద్మావతి, బి.రమేష్కుమార్, ఆమదాలవలస, సరుబుజ్జిలి తహసీల్దార్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
కనికరం లేని మావయ్యా.. కనీస వసతులేవయ్యా..!
[ 26-04-2024]
అంగన్వాడీ కేంద్రాలు.. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసే ఆలయాలు. అలాంటి వాటిని అభివృద్ధి చేయకుండా వైకాపా నేతలు ఐదేళ్లపాటు గాలికొదిలేశారు. కార్పొరేట్ ప్రీ స్కూళ్లకు దీటుగా తయారుచేస్తామని జగన్ చెప్పిన మాటలు ప్రసంగాలకే పరిమితమయ్యాయి. -
ఎండప్రచండం
[ 26-04-2024]
జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రంగా ఉంటోంది. అత్యవసర సమయంలో తప్ప మిగిలిన వేళల్లో బయటకు వచ్చేందుకు జనాలు సాహసించడం లేదు. -
శెభాష్.. సతీష్..
[ 26-04-2024]
జేఈఈ మెయిన్-2024 (సెషన్-2) ఫలితాల్లో సిక్కోలు విద్యార్థి సత్తా చాటాడు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం విడుదల చేసిన ఫలితాల్లో జలుమూరు మండలం కరవంజ గ్రామానికి చెందిన చింతు సతీష్కుమార్ అదరగొట్టాడు. -
నామినేషన్ల ఘట్టానికి తెర
[ 26-04-2024]
జిల్లా వ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన 175 మంది అభ్యర్థులు 223 నామినేషన్లు వేశారు. వాటిల్లో రెండుసార్లు వచ్చిన వాటిని తీసివేయగా 123 మంది అభ్యర్థులు మిగిలారు. -
వైకాపా స్థావరాలపై పసుపు జెండా..!
[ 26-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టెక్కలి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ముఖ్యమంత్రి వచ్చి వెళ్లిన మరుసటి రోజే ఆయువుపట్టు లాంటి వైకాపా స్థావరాల్లో పసుపు జెండా ఎగురవేశారు. -
జేఈఈలో సిక్కోలు సత్తా..
[ 26-04-2024]
జాతీయస్థాయిలో ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజినీరింగ్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షలో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధించారు. -
ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణం
[ 26-04-2024]
కోటబొమ్మాళి- సంతబొమ్మాళి రహదారిలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీను అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవరు మృతి
[ 26-04-2024]
జాతీయ రహదారిపై ఎచ్చెర్ల గ్రామం వద్ద ఫ్లైఓవర్ వంతెనపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పొందూరు మండలం లోలుగు గ్రామానికి చెందిన మజ్జి అచ్చెప్పడు (38) అనే ఆటో డ్రైవర్ మృతిచెందాడు. -
27న పాలిసెట్-2024
[ 26-04-2024]
పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తోన్న ఏపీ పాలిసెట్-2024 ప్రవేశ పరీక్ష ఈ నెల 27న నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
గొంతు తడవాలంటే.. సొమ్ము పెట్టాల్సిందే
[ 26-04-2024]
ప్రతి ఇంటికి తాగునీరు అత్యవసరం. తొలి ప్రాధాన్యత ఇవ్వాల్సిన మౌలిక సౌకర్యం. అది కల్పించకుండా అంత చేశాం.. ఇంత చేశామని పాలకులు ఊదరగొడితే సమస్యలు పరిష్కారమైపోవు. పలాస, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో దాహం కేకలు మిన్నంటుతున్నాయి. -
మలుపులు.. మృత్యులోగిళ్లు
[ 26-04-2024]
పలు గ్రామాల్లోని మలుపుల వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యమైపోయాయి. ఆయా ఘటనల్లో మృతులు, గాయాల పాలైన వారూ ఉన్నారు. -
దారికి రాని విస్తరణ
[ 26-04-2024]
నిత్యం అత్యంత రద్దీగా ఉండే కళింగపట్నం- పార్వతీపురం రహదారిని శ్రీకాకుళం నగరంలో విస్తరణ పనులు చేపడతామని ప్రకటించిన వైకాపా ప్రభుత్వం ఈ విషయాన్ని విస్మరించింది.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్