logo

చంద్రబాబు మేనిఫెస్టోను స్వాగతిస్తున్నాం

రాష్ట్రంలోని నిరుపేదలను ధనికులుగా చేయాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మేనిఫెస్టో మొదటి విడతలో పేర్కొన్న ‘పూర్‌ టు రిచ్‌’ను స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అన్నారు.

Published : 30 May 2023 04:38 IST

అరసవల్లిలో భవిష్యత్తుకు గ్యారెంటీ గోడపత్రిక ఆవిష్కరిస్తున్న గుండ అప్పలసూర్యనారాయణ, లక్ష్మీదేవి

గుజరాతీపేట(శ్రీకాకుళం), కలెక్టరేట్(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: రాష్ట్రంలోని నిరుపేదలను ధనికులుగా చేయాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు మేనిఫెస్టో మొదటి విడతలో పేర్కొన్న ‘పూర్‌ టు రిచ్‌’ను స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అన్నారు. శ్రీకాకుళం నగరం అరసవల్లిలోని స్వగృహంలో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదరిక నిర్మూలనే తెదేపా ప్రధాన ధ్యేయమన్నారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ చంద్రబాబుని సీఎం చేయడానికి ప్రతి ఒక్కరు మరింత కష్టపడి పనిచేయాలని కోరారు. అనంతరం భవిష్యత్తుకు గ్యారంటీ గోడపత్రిక ఆవిష్కరించారు.
* చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా నాయకులు గొండు శంకరరావు పేర్కొన్నారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం కిష్టప్పేటలో సోమవారం రాత్రి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం అనుభవం ఉన్న చంద్రబాబును గెలిపించాలన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని