logo

Dharmana: వచ్చే ఎన్నికల్లో మీకు నచ్చిన వారికి ఓటేసుకోండి..: మంత్రి ధర్మాన

‘నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీకు చెప్పేందుకు ఇక్కడకు వచ్చాం. ఇప్పుడు ఎన్నికలు రావడం లేదు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిందేమీ లేదు.

Updated : 27 Aug 2023 08:53 IST

  మాట్లాడుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు

శ్రీకాకుళం నగరం, న్యూస్‌టుడే: ‘నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీకు చెప్పేందుకు ఇక్కడకు వచ్చాం. ఇప్పుడు ఎన్నికలు రావడం లేదు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిందేమీ లేదు. వచ్చే ఎన్నికల్లో మీకు నచ్చిన పార్టీకి ఓటేసుకోండి.. కానీ ఓటేసే ముందుకు ఆలోచించుకుని మంచి చేసేవారికి ఓటేయండి’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని కత్తెరవీధిలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఆదాయం కోసం తాను చట్టపరిధిలో, న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తుంటే, కొందరు తప్పు చేస్తున్నట్లు చూపిస్తున్నారని తెలిపారు. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు వైకాపా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. కళింగ వైశ్య కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఎ.సూరిబాబు, నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని