Dharmana: వచ్చే ఎన్నికల్లో మీకు నచ్చిన వారికి ఓటేసుకోండి..: మంత్రి ధర్మాన
‘నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీకు చెప్పేందుకు ఇక్కడకు వచ్చాం. ఇప్పుడు ఎన్నికలు రావడం లేదు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిందేమీ లేదు.
మాట్లాడుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం నగరం, న్యూస్టుడే: ‘నాలుగేళ్లలో ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీకు చెప్పేందుకు ఇక్కడకు వచ్చాం. ఇప్పుడు ఎన్నికలు రావడం లేదు. 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు చేసిందేమీ లేదు. వచ్చే ఎన్నికల్లో మీకు నచ్చిన పార్టీకి ఓటేసుకోండి.. కానీ ఓటేసే ముందుకు ఆలోచించుకుని మంచి చేసేవారికి ఓటేయండి’ అని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని కత్తెరవీధిలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఆదాయం కోసం తాను చట్టపరిధిలో, న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తుంటే, కొందరు తప్పు చేస్తున్నట్లు చూపిస్తున్నారని తెలిపారు. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు వైకాపా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. కళింగ వైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ ఎ.సూరిబాబు, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్ఈఆర్ ప్రచారంలో ఉద్రిక్తత..!
[ 09-05-2024]
వైకాపా శ్రేణులు రోజురోజుకు ఉక్రోశాన్ని వెల్లగక్కుతున్నాయి. కూటమి అభ్యర్థులకు వస్తున్న ఆదరణ జీర్ణించుకోలేకపోతున్నాయి. -
మాటల్లో తీపి.. చేతల్లో ఏది జగన్..?
[ 09-05-2024]
మాటలతో మాయ చేయడంలో సిద్ధహస్తుడైన వైకాపా అధినేత జగన్ ఆమదాలవలసకు తీరని అన్యాయం చేశారు. అలవాటు ప్రకారం.. చక్కెర కర్మాగారం అందుబాటులోకి తీసుకొస్తానని ఇచ్చిన హామీని గాలికొదిలేశారు. -
అభివృద్ధి అన్నారు.. అ‘శాంతి’ మిగిల్చారు..!
[ 09-05-2024]
ఉత్తరాంధ్రలో పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని గత ఎన్నికల ముందు ఊదరగొట్టారు. శాంతమ్మ చెబితే శాసనమేనని ప్రజలూ నమ్మారు. -
కూటమి గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం
[ 09-05-2024]
వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని ఎంపీˆ రామ్మోహన్నాయుడు అన్నారు. -
దువ్వాడకు ఓటేస్తే చెత్తబుట్టలో వేసినట్లే
[ 09-05-2024]
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్కు వచ్చే ఎన్నికల్లో ఓటేస్తే అది చెత్తబుట్టలో వేసినట్లేనని వైకాపా మండల మాజీ అధ్యక్షుడు, తెదేపా నేత బగాది హరి అన్నారు. -
తెదేపాలో చేరితే ఇంట్లో సామగ్రి కాల్చేశారు
[ 09-05-2024]
హనుమంతునాయుడుపేట పంచాయతీ పోతునాయుడుపేట కాలనీలో నివాసముంటున్న బేతాల ఈశ్వరరావు, కవిత దంపతుల ఇంటి సామగ్రిని గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం రాత్రి దహనం చేశారు. -
ట్రబుల్ ఐటీ..!
[ 09-05-2024]
అన్ని బ్యాచ్లను తీసుకొచ్చి పూర్తిస్థాయి మౌలిక వసతులతో స్థానికంగా తరగతులు నిర్వహిస్తామని ట్రిపుల్ ఐటీలో భవనాల ప్రారంభం సందర్భంగా 2020లో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. -
అన్న పాలనలో ‘సుజల’ సమాధి
[ 09-05-2024]
ఉద్దానం కిడ్నీ ఇబ్బందుల నేపథ్యంలో తెదేపా హయాంలో రూ.కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజలధార యూనిట్లపై వైకాపా నిర్లక్ష్యం వహించింది. కిడ్నీ వ్యాధి గ్రస్థులకు శుద్ధ జలం అందించాలన్న బృహత్తర లక్ష్యంతో ఏర్పాటు చేస్తే దానిని ప్రస్తుత పాలకులు తుంగలో తొక్కారు -
తెదేపాలో పలువురి చేరికలు
[ 09-05-2024]
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సమక్షంలో కోటబొమ్మాళి మండలంలోని నిమ్మాడలో బుధవారం కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లోని పలు గ్రామాల వైకాపా కుటుంబాలు తెదేపాలో చేరాయి
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్