ఆటలకేది ప్రోత్సాహం..?
ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. పాఠశాల స్థాయిలో రాణించిన క్రీడాకారులు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదువుతున్నపుడు విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలనే ఆకాంక్ష ఉన్నా ఆ దిశగా ప్రోత్సాహం కరవైంది.
శిక్షణ శిబిరాలు నిర్వహించని వైనం
అంబేడ్కర్ వర్సిటీ పరిధిలో క్రీడాకారులకు అన్యాయం
అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో వ్యాయామ విద్య విభాగం
ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులు క్రీడలకు దూరమవుతున్నారు. పాఠశాల స్థాయిలో రాణించిన క్రీడాకారులు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ చదువుతున్నపుడు విశ్వవిద్యాలయాల స్థాయిలోనూ గుర్తింపు
తెచ్చుకోవాలనే ఆకాంక్ష ఉన్నా ఆ దిశగా ప్రోత్సాహం కరవైంది. అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో యువత రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే ఆటలకు హాజరుకాలేని పరిస్థితి నెలకొంది.
న్యూస్టుడే, ఎచ్చెర్ల, శ్రీకాకుళం అర్బన్
విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విశ్వవిద్యాలయ స్థాయిలో స్పోర్ట్స్ బోర్డు మీటింగ్ నిర్వహించాలి. ఏయే క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు? సౌత్ జోన్, అఖిల భారత అంతర్ వర్సిటీ క్రీడా పోటీలకు ఎవరిని పంపాలి? వారికి కల్పించాల్సిన సౌకర్యాలు, శిక్షణ ఎంత ఖర్చు చేయాలనే అంశాలపై చర్చించాలి. ఒక నిర్ణయానికి వచ్చి క్రీడా ప్రణాళిక రూపొందించాలి. ఈ సమాచారం అన్ని కళాశాలలకు తెలియజేసి క్రీడలపై ఆసక్తి ఉన్న విద్యార్థులను ప్రోత్సహించాలి. అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో మూడేళ్ల నుంచి వర్సిటీ స్థాయిలో స్పోర్ట్స్ బోర్డు సమావేశాలు జరగడం లేదని, క్రీడా క్యాలెండర్ రూపొందించడం లేదనే విమర్శలు ఉన్నాయి. అనుబంధ కళాశాల విద్యార్థులకు అంతర్ కళాశాలల పోటీలు నిర్వహించి ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసి శిక్షణ శిబిరాలు నిర్వహించాలి. వర్సిటీలో ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. సౌత్ జోన్ పోటీలకు వెళ్లే రెండు మూడు రోజుల ముందు ఎంపికలు నిర్వహించి విద్యార్థులకు పోటీలకు పంపుతున్నారు. ఆయా పోటీల సమాచారం ఆసక్తి గల క్రీడాకారులకు సకాలంలో తెలియక, సరైన ప్రోత్సాహం లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇదీ పరిస్థితి
వర్సిటీ పోటీల్లో ఆడటానికి క్రీడాకారులు అవస్థలు పడుతున్నారు. బెల్గావి వీటీయూ ఆధ్వర్యంలో పీఈఎస్ ఇంజినీరింగ్ కళాశాల మాండ్యాలో డిసెంబరు 22 నుంచి 25 వరకు సౌత్జోన్ వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ముందస్తుగా జట్టు ఎంపికలు చేపట్టకపోవడం, క్రీడాకారులకు వేదిక సమాచారం అందించకపోవడంతో మాండ్యాకు వెళ్లాల్సిన క్రీడాకారులు బెల్గావికి చేరుకున్నారు. తిరిగి వేదిక వద్దకు వచ్చేసరికి వీరి ఆట ముగిసి ప్రత్యర్థులు జట్టుకు క్రాస్ చేసి విజేతలుగా ప్రకటించారు. దీంతో క్రీడాకారులు ఆడకుండానే వెనుదిరిగారు.
- కబడ్డీ, యోగా, వాలీబాల్, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు మహిళలు, పురుషులను బాక్సింగ్, హాకీ, క్రికెట్ సౌత్ జోన్ విశ్వవిద్యాలయ పోటీలకు ఎంపిక చేసి పంపారు. బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో సత్తా చాటి అంతర్ విశ్వవిద్యాలయ పోటీలకు ఎంపికయ్యారు.
- ఆర్చరీ, బ్యాడ్మింటన్, బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, చెస్, ఫుట్బాల్, కరాటే, తైక్వాండో, వుషూ, ఖోఖో తదితర క్రీడల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు అత్యధికంగా ఉన్నారు. ఈ ఏడాది అంతర్ వర్సిటీ పోటీలకు క్రీడాకారులను పంపే ప్రయత్నం జరగలేదు.
- తమిళనాడులో అన్నా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 22 నుంచి 25 వరకు జరిగిన బాల్బ్యాడ్మింటన్ పోటీలకు బి.ఆర్.అంబేడ్కర్ విశ్వవిద్యాలయం జట్టును ఎంపిక చేయకపోవడంతో పోటీల్లో పాల్గొనే అవకాశం కోల్పోయామని అనుబంధ కశాశాలలకు చెందిన క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది పోటీల్లో పాల్గొన్నా ధ్రువపత్రాలు కళాశాలలకు పంపుతామని వర్సిటీ అధికారులు, శిక్షకులు చెప్పినా రాలేదని వాపోతున్నారు.
సమస్య తలెత్తకుండా చర్యలు..
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే స్పోర్ట్స్ బోర్డు సమావేశం నిర్వహించి క్యాలెండర్ రూపొందిస్తాం. క్రీడల సమాచారం అన్ని అనుబంధ కళాశాలలకు తెలియజేస్తాం. విశ్వవిద్యాలయ స్థాయిలో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వివరాలు తెలిసేలా పర్యవేక్షిస్తాం. అంతర్ వర్సిటీ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఇబ్బంది పడుకుండా రూ. 8 లక్షలు విడదల చేశాం.
యు.కావ్య జోత్స్న, స్పోర్ట్స్ డీన్, అంబేడ్కర్ విశ్వవిద్యాలయం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
[ 28-04-2024]
పలాస నియోజకవర్గంలోని కొండలు, చెరువులను మింగేస్తున్న మంత్రి అప్పలరాజును ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు పిలుపునిచ్చారు. -
అన్నొచ్చాడు.. అడ్డంగా బాదేశాడు..!
[ 28-04-2024]
‘అన్నొస్తున్నాడని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పిండి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్తు ఛార్జీలు తగ్గించేస్తామని కూడా గట్టిగా చెప్పండి’ అని సీఎం జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఊరూరా ఊదరగొట్టారు. -
మీరేం అభివృద్ధి చేశారు..?
[ 28-04-2024]
సంతబొమ్మాళి మండలం కూర్మనాథపురంలో గ్రామాభివృద్ధిపై ప్రశ్నించిన యువకులపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వైకాపా టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శనివారం సాయంత్రం కూర్మనాథపురంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. -
ఉప్పుగెడ్డపై వంతెన.. ఉత్తమాటేనా?
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెదేపా హయాంలో ప్రారంభించిన పనులను ఎలాగో గాలికొదిలేసింది. కనీసం వారి పాలనలో చేపట్టిన పనులను సైతం పూర్తి చేయలేకపోయారు. -
మాకొద్దీ వైకాపా..!
[ 28-04-2024]
జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి అభ్యర్థుల్ని పరిచయం చేస్తూ మంచివారు.. సౌమ్యులు.. బాగా పనిచేస్తారు.. అంటూ కితాబిచ్చినా, మెచ్చుకున్నా ఆ పార్టీ శ్రేణుల్లో మాత్రం వారిపట్ల విశ్వసనీయత కనిపించడం లేదు.. -
తెదేపాలోకి జోరుగా చేరికలు
[ 28-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పొందూరు మేజర్ పంచాయతీ పరిధిలో లక్ష్మిపేటలో 50 కుటుంబాలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ సమక్షంలో తేదేపాలో చేరాయి. -
సమన్వయంతో పని చేయండి
[ 28-04-2024]
జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు రానున్న రెండు వారాల పాటు సమన్వయంతో పని చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్ విద్యార్థి సూచించారు. -
సామూహిక నిర్లక్ష్యం
[ 28-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో గతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులతో గ్రామాల్లో ఆరుబయట మలవిసర్జన నిర్మూలించేందుకు రూ.కోట్ల వ్యయంతో వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. -
కన్నీటి శోకం..
[ 28-04-2024]
గార మండలం తూలుగు కూడలి సమీపంలో సీఎస్పీ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గార గ్రామానికి చెందిన మార్పు రమణమూర్తి కుమారుడు ఓందత్తకుమార్ (19) ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం వెళ్తుండగా శ్రీకాకుళం నుంచి కొర్ని వస్తున్న మినీ లగేజి వాహనం బలంగా ఢీకొనడంతో తలకు తీవ్రగాయమై కాళ్లు, చేతులు విరిగిపోయాయి. -
ఛార్జీల పోటు.. అదే జగనన్న రూటు
[ 28-04-2024]
ఛార్జీల పేరిట జగనన్న ప్రభుత్వం ప్రజలతో ఆడుకుంటోంది. నిత్యావసరాలు, బస్సు ఛార్జీల పెరుగుదల ఇలా ఏది తీసుకున్నా.. ప్రజలకు షాక్ తప్పడం లేదు. విద్యుత్తు ఛార్జీల విషయంలోనూ అంతే. -
తెదేపాతోనే అభివృద్ధి
[ 28-04-2024]
ప్రజలు ఆలోచించి ఓటేయాలని తెదేపా నాయకులు ప్రజలకు సూచించారు. తెదేపా అధికారంలోకి వస్తే రాష్ట్రం బంగారుమయం అవుతుందన్నారు. అభివృద్ధి పరుగులు తీస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?