logo

వైకాపా కొట్టుకుపోవడం ఖాయం

తెదేపా, జనసేన, భాజపా కూటమికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు.

Published : 29 Mar 2024 04:56 IST

పొందూరు: తెదేపాలో చేరిన వారితో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, కూన రవికుమార్‌

పొందూరు, న్యూస్‌టుడే: తెదేపా, జనసేన, భాజపా కూటమికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, తెదేపా శ్రీకాకుళం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. పొందూరు గాంధీనగర్‌ కాలనీ సమీపంలోని దళితవాడకు చెందిన కె.రాజేష్‌ ఆధ్వర్యంలో గురువారం వైకాపా నుంచి తెదేపాలోకి 60 కుటుంబాలు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను భారీ ఆధిక్యంతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎక్కడికి వెళ్లినా ఆదరణ అద్భుతంగా ఉందని.. వైకాపా కొట్టుకుపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. తెదేపా మండల అధ్యక్షుడు సీహెచ్‌ రామ్మోహన్‌, నాయకులు అన్నెపు రాము, సీపాన శ్రీరంగనాయకులు, బలగ శంకర్‌భాస్కర్‌, అనకాపల్లి చినరంగ, బాడాన గిరి, ఎ.వాణి, కె.శ్రీనివాసరావు, దాసునాయుడు, అప్పలస్వామి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని