ఆధునికీకరణ.. అటకెక్కించేశారు..!
వైకాపా అయిదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులను గాలికొదిలేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజాప్రయోజనార్థం రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన అనేక నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు.
మిర్తిబట్టి పనులు గాలికొదిలేసిన పాలకులు
డీసీసీబీ కాలనీలో అసంపూర్తిగా నిలిచిన మిర్తిబట్టి పనులు
వైకాపా అయిదేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి పనులను గాలికొదిలేశారు. గత ప్రభుత్వం హయాంలో ప్రజాప్రయోజనార్థం రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన అనేక నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు. బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం చేయడంతో పూర్తి చేసేందుకు గుత్తేదారులు సైతం ఆసక్తి చూపడం లేదు. ఇందుకు జిల్లా కేంద్రంలో చేపట్టిన మిర్తిబట్టి ఆధునికీకరణ పనులే నిదర్శనం.
న్యూస్టుడే, శ్రీకాకుళం నగరం: శ్రీకాకుళం నగరంలో కొత్త వంతెన రహదారి నుంచి పొన్నాడ వంతెన వద్ద నాగావళి నది వరకు సుమారు 10 కి.మీ. మేర మిర్తిబట్టి విస్తరించి ఉంది. ఒకప్పుడు విశాలంగా ఉండే ఈ పంట కాలువ చుట్టూ కాలనీలు ఏర్పడటంతో పలుచోట్ల ఆక్రమణలకు గురై ఆనవాళ్లు కోల్పోయింది. కాలువలో పూడిక, వ్యర్థాలతో పేరుకుపోవటంతో తెదేపా హయాంలో అమృత్ పథకంలో భాగంగా రూ.40.20 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని ఆధునికీకరించాలని నిర్ణయించారు. ఆ మేరకు పనులు ప్రారంభించారు. కాలువ పనులు పూర్తయ్యాక మురుగునీరు నేరుగా నదిలో కలవకుండా పొన్నాడ కొండ వద్ద శుద్ధి కేంద్రానికి అనుసంధానించాలని భావించారు. 2019 ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారడంతో పనులు పడకేశాయి.
అందని బిల్లులు.. ఆగిన పనులు..
ఇప్పటివరకు గుత్తేదారు రూ.5 కోట్ల మేర పనులు చేపట్టగా.. తెదేపా హయాంలో రూ.2.50 కోట్లు చెల్లించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం బకాయిలు సైతం చెల్లించలేదు. దీంతో పనులు నిలిచిపోయాయి. అయిదేళ్ల పాటు మిర్తిబట్టి ఆధునికీకరణను పట్టించుకోకపోవడంతో విశాఖ ఎ, బి కాలనీలు, మహాలక్ష్మీ నగర్ కాలనీ, కత్తెరవీధి, వంశధార నగర్, కొన్నావీధి, తిలక్ నగర్, రామలక్ష్మణ కూడలి, పెద్దపాడు రహదారి, రామ్నగర్, ఫ్రెండ్స్ కాలనీ, శ్రీలక్ష్మీనగర్, అరసవల్లి మిల్లు కూడలి, డీసీసీబీ కాలనీ, సానా వీధి, శ్రీనివాస నగర్, బాకర్సాహెబ్ పేట, బ్యాంకర్స్ కాలనీ వాసులకు ఇక్కట్లు తప్పడం లేదు.
ఎదురైన ఇబ్బందులివీ..
- ఆధునికీకరణ చేపట్టకపోవడంతో కాలువ వ్యర్థాలతో నిండి నీటి తరలింపు సామర్థ్యం కోల్పోతోంది.
- వర్షాకాలంలో నీరు నిలిచిపోతుండటంతో మిర్తిబట్టిని ఆనుకుని పలు కాలనీలు ముంపు బారినపడుతున్నాయి. గతంలో తిత్లీ, జల్, లైలా తదితర తుపాన్ల సమయంలోనూ ఆ కాలనీలు జలమయమయ్యాయి.
- నగరపాలక సంస్థ ఏటా రూ.లక్షలు వెచ్చించి పూడికతీత పనులు తాత్కాలిక ప్రాతిపదికన చేపట్టాల్సి వస్తోంది.
- అసంపూర్తిగా నిలిచిన సీసీ కాలువలో మురుగునీరు నిల్వ ఉండి స్థానికులు దుర్వాసన, దోమలతో ఇబ్బంది పడుతున్నారు.
ఉన్నతాధికారులకు నివేదించాం..
మిర్తిబట్టి ఆధునికీకరణకు సంబంధించి గతంలో చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాకపోవడంతో వాటిని ప్రభుత్వం రద్దు చేసింది. ఆ పనులను పునరుద్ధరించాలని ఉన్నతాధికారులకు పలుమార్లు నివేదికలు పంపించాం. వారి ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
పి.సుగుణాకరరావు, ప్రజారోగ్యశాఖ,శ్రీకాకుళం నగపాలక సంస్థ ఇన్ఛార్జి, ఈఈ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
[ 28-04-2024]
పలాస నియోజకవర్గంలోని కొండలు, చెరువులను మింగేస్తున్న మంత్రి అప్పలరాజును ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు పిలుపునిచ్చారు. -
అన్నొచ్చాడు.. అడ్డంగా బాదేశాడు..!
[ 28-04-2024]
‘అన్నొస్తున్నాడని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పిండి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్తు ఛార్జీలు తగ్గించేస్తామని కూడా గట్టిగా చెప్పండి’ అని సీఎం జగన్ ప్రతిపక్ష నేత హోదాలో ఊరూరా ఊదరగొట్టారు. -
మీరేం అభివృద్ధి చేశారు..?
[ 28-04-2024]
సంతబొమ్మాళి మండలం కూర్మనాథపురంలో గ్రామాభివృద్ధిపై ప్రశ్నించిన యువకులపై వైకాపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వైకాపా టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ శనివారం సాయంత్రం కూర్మనాథపురంలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. -
ఉప్పుగెడ్డపై వంతెన.. ఉత్తమాటేనా?
[ 28-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెదేపా హయాంలో ప్రారంభించిన పనులను ఎలాగో గాలికొదిలేసింది. కనీసం వారి పాలనలో చేపట్టిన పనులను సైతం పూర్తి చేయలేకపోయారు. -
మాకొద్దీ వైకాపా..!
[ 28-04-2024]
జిల్లాలో రాజకీయ ముఖచిత్రం మారుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చి అభ్యర్థుల్ని పరిచయం చేస్తూ మంచివారు.. సౌమ్యులు.. బాగా పనిచేస్తారు.. అంటూ కితాబిచ్చినా, మెచ్చుకున్నా ఆ పార్టీ శ్రేణుల్లో మాత్రం వారిపట్ల విశ్వసనీయత కనిపించడం లేదు.. -
తెదేపాలోకి జోరుగా చేరికలు
[ 28-04-2024]
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు కొనసాగుతున్నాయి. పొందూరు మేజర్ పంచాయతీ పరిధిలో లక్ష్మిపేటలో 50 కుటుంబాలు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ సమక్షంలో తేదేపాలో చేరాయి. -
సమన్వయంతో పని చేయండి
[ 28-04-2024]
జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు రానున్న రెండు వారాల పాటు సమన్వయంతో పని చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు శేఖర్ విద్యార్థి సూచించారు. -
సామూహిక నిర్లక్ష్యం
[ 28-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే లక్ష్యంతో గతంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి మరుగుదొడ్డు ఉండాలనే ఉద్దేశంతో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధులతో గ్రామాల్లో ఆరుబయట మలవిసర్జన నిర్మూలించేందుకు రూ.కోట్ల వ్యయంతో వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు నిర్మించారు. -
కన్నీటి శోకం..
[ 28-04-2024]
గార మండలం తూలుగు కూడలి సమీపంలో సీఎస్పీ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గార గ్రామానికి చెందిన మార్పు రమణమూర్తి కుమారుడు ఓందత్తకుమార్ (19) ద్విచక్రవాహనంపై శ్రీకాకుళం వెళ్తుండగా శ్రీకాకుళం నుంచి కొర్ని వస్తున్న మినీ లగేజి వాహనం బలంగా ఢీకొనడంతో తలకు తీవ్రగాయమై కాళ్లు, చేతులు విరిగిపోయాయి. -
ఛార్జీల పోటు.. అదే జగనన్న రూటు
[ 28-04-2024]
ఛార్జీల పేరిట జగనన్న ప్రభుత్వం ప్రజలతో ఆడుకుంటోంది. నిత్యావసరాలు, బస్సు ఛార్జీల పెరుగుదల ఇలా ఏది తీసుకున్నా.. ప్రజలకు షాక్ తప్పడం లేదు. విద్యుత్తు ఛార్జీల విషయంలోనూ అంతే. -
తెదేపాతోనే అభివృద్ధి
[ 28-04-2024]
ప్రజలు ఆలోచించి ఓటేయాలని తెదేపా నాయకులు ప్రజలకు సూచించారు. తెదేపా అధికారంలోకి వస్తే రాష్ట్రం బంగారుమయం అవుతుందన్నారు. అభివృద్ధి పరుగులు తీస్తుందని వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
టాలీవుడ్లో చరిత్ర లిఖించిన రోజు.. ఎన్ని బ్లాక్బస్టర్లు విడుదలయ్యాయంటే?
-
శంషాబాద్ ఎయిర్పోర్టు సమీపంలో చిరుత సంచారం!
-
రూ.49కే బీఎస్ఎన్ఎల్ సినిమాప్లస్ సబ్స్క్రిప్షన్
-
నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనమా?: రాహుల్పై మోదీ ధ్వజం
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..