హామీల సంగతేంటి జగనన్నా..?
అంగన్వాడీ కార్యకర్తలు సమస్యలతో సతమతమవుతున్నారు. 42 రోజుల పాటు సమ్మె చేసినా ప్రభుత్వం డిమాండ్లను నేటికీ నెరవేర్చలేదు.
అంగన్వాడీలపై మరింత పనిభారం
సమస్యలు పట్టించుకోలేదేని ఆవేదన
వైఎస్సార్ సంపూర్ణ పోషణ యాప్లో కొత్తగా తీసుకొచ్చిన కుటుంబ సర్వే ఆప్షన్
అంగన్వాడీ కార్యకర్తలు సమస్యలతో సతమతమవుతున్నారు. 42 రోజుల పాటు సమ్మె చేసినా ప్రభుత్వం డిమాండ్లను నేటికీ నెరవేర్చలేదు. న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా అమలు కాలేదు. ఇప్పటికీ పని భారం తగ్గించలేదని.. అదనంగా మరికొన్ని బాధ్యతలు అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమ్మె కాలం వేతనాలు సైతం ఇవ్వలేదని చెబుతున్నారు. ఎవరికి మొర పెట్టుకున్నా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు.
న్యూస్టుడే, బలగ(శ్రీకాకుళం)
అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు మెరుగైన సేవలందించాలనే ఉద్దేశంతో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రక్రియ అంతా ఆన్లైన్ చేసింది. కాగిత రహిత పాలనకు చరమగీతం పాడాలని సిబ్బందికి స్మార్ట్ఫోన్లు పంపిణీ చేసింది. అవి కొంతకాలం పని చేసిన తర్వాత తరచూ మొరాయిస్తుండటంతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే పోషణ్ ట్రాకర్, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, తదితర యాప్లలో వివిధ వివరాలను పొందుపరుస్తున్నారు. లబ్ధిదారులకు పోషకాహారం పంపిణీ సమాచారంతో పాటు చిన్నారుల ఎత్తు, బరువు వంటివి సైతం కొలిచి నమోదు చేస్తున్నారు. కొందరు సొంత చరవాణులను వినియోగిస్తున్నారు. యాప్ల భారం తగ్గించాలని చెబుతున్నా పట్టించుకోలేదు. మూలిగే నక్కపై తాటి పండు పడిన చందాన తాజాగా వారికి మరో బాధ్యతను అప్పగించారు. కుటుంబ సర్వే చేసి యాప్లో పొందుపరచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. తమ ఇబ్బందులు పరిగణనలోకి తీసుకుని అధికారులు పని భారం తగ్గించాలని సిబ్బంది కోరుతున్నారు.
వేతనాల మాటేంటి..!
అంగన్వాడీలు పనిభారంతో సతమతమవుతుండంతో పాటు సకాలంలో జీతాలందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. కార్యకర్తలకు నెలకు రూ.11,500, సహాయకులకు రూ.7 వేలు చొప్పున ప్రభుత్వం వేతనం చెల్లించాలి. అవి రెండు, మూడు నెలలకోసారి జమవుతున్నాయి. ఇదిలా ఉండగా తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ గతేడాది డిసెంబరు 12 నుంచి ఈ ఏడాది జనవరి 22 వరకు సమ్మె బాట పట్టారు. ఆ రోజులకు సంబంధించి జిల్లాలో సిబ్బందికి సుమారుగా రూ.6 కోట్లకుపైగా చెల్లించాల్సి ఉంది. ఆ వేతనాలు అందిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చి 15 రోజులు గడిచినా ఇంతవరకు ఖాతాల్లో నగదు జమ కాలేదు.
భారం తగ్గించాలి
ఇప్పటికే పని భారంతో ఇబ్బందులు పడుతున్నాం. తాజాగా కుటుంబ సర్వే చేయాలని సూచిస్తున్నారు. సమ్మె కాలానికి చెల్లించాల్సిన వేతనాలు ఇప్పటి వరకు ఖాతాల్లో జమ చేయలేదు. అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నాం.
కె.కల్యాణి, అధ్యక్షురాలు, జిల్లా అంగన్ వాడీ కార్యకర్తల సంఘం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దూసుకొస్తున్నాయ్.. మృత్యు వాహనాలు..!
[ 21-05-2024]
మూలపేట పోర్టుతో అందరి బతుకుల్లో మార్పు వస్తుందని భావించిన అక్కడి ప్రజలకు తీరని శోకం మిగులుతోంది.. పోర్టు నిర్మాణానికి చేపడుతున్న కార్యకలాపాలు పరిసర గ్రామాల వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. -
వేట లేదు.. భృతి అందలేదు
[ 21-05-2024]
సముద్రంలో మర బోట్లతో చేపల వేట నిషేధం విధించి నెల రోజులు దాటినా ప్రభుత్వం నుంచి సాయం అందక మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధి లేక జీవనం భారమై నరకయాతన అనుభవిస్తున్నామని వాపోతున్నారు. -
రేవుల్లోకి అధికారుల బృందం
[ 21-05-2024]
రాష్ట్రంలో ఇసుక తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఇటీవల ఆదేశించడంతో జిల్లా అధికారులు ఎట్టకేలకు కదిలారు. కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, కమిటీ సభ్యులు సోమవారం రెండు రీచ్లను పరిశీలించారు. -
వెంకన్న దర్శనం.. భక్తజన పారవశ్యం..
[ 21-05-2024]
నరసన్నపేట వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 21-05-2024]
జిల్లాలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ అధికారులను ఆదేశించారు. -
ఆశలు నీరుగార్చేశారు..!
[ 21-05-2024]
రైతు ప్రభుత్వమని చెప్పుకోవడం తప్ప, అన్నదాతల మేలు కోసం ఒరగబెట్టిందేమీ లేదనేందుకు నారాయణపురం కుడి కాలువ పరిస్థితి చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. -
పట్టణంలో దాహం కేకలు
[ 21-05-2024]
ఇచ్ఛాపురం పురపాలకసంఘ పరిధిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. నాలుగు ట్యాంకర్లతో నీరు అవసరమైన చోటుకు తరలించాల్సిన అధికారులు రెండింటితోనే సరిపెడుతున్నారు. -
29 కేంద్రాల్లో 50 శాతం లోపే..!
[ 21-05-2024]
శ్రీకాకుళం నియోజకవర్గంలో కీలకమైన నగరంలో పోలింగ్ శాతం ఆశించిన స్థాయిలో లేదు. మొత్తం 279 పోలింగ్ కేంద్రాలు ఉండగా కొన్ని చోట్ల 50 శాతం కంటే తక్కువ నమోదైంది. -
పార్టీ మారారని నీటి సరఫరా నిలిపివేత
[ 21-05-2024]
వైకాపా నుంచి తెదేపాలోకి మారామని కక్ష గట్టి పైపులైన్ మరమ్మతుల పేరిట నీటి సరఫరాను నిలిపేశారంటూ గ్రామానికి చెందిన వజ్జ లోకేశ్వరరావు ఎంపీడీవో జి.భాస్కరరావుకు ఫిర్యాదు చేశారు. -
వైకాపా ఎంపీ అభ్యర్థి గృహ నిర్బంధం
[ 21-05-2024]
వైకాపా శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ను నందిగాం పోలీసులు సోమవారం ఆయన స్వగ్రామం కణితివూరులో గృహ నిర్బంధం చేశారు. -
మహేంద్రతనయ నదిలో దిగి కొసమాల వాసి జలసమాధి
[ 21-05-2024]
గజపతి జిల్లా గోసాని బ్లాక్లోని బాగుసాల పంచాయతీ సదర్ మహకుమా గ్రామం గుండా ప్రవహించే మహేంద్రతనయ నదిలో పడి ఓ యువకుడు సోమవారం మృతి చెందాడు. -
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
[ 21-05-2024]
పాతపట్నం మండలం కోదూరు గ్రామానికి చెందిన ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.