ఐదేళ్ల నిర్లక్ష్యం.. చుక్కనీరు కనం..
రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీలు ఇచ్చిన వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో వారని గాలికొదిలేసింది. కనీసం సాగునీటి కాలువల నిర్వహణను సైతం పట్టించుకోక పోవడంతో నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.
చెవ్వాకులపేట వద్ద అధ్వానంగా పురుషోత్తపురం- నైరా ఛానల్
ఆమదాలవలస గ్రామీణం, న్యూస్టుడే: రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీలు ఇచ్చిన వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో వారని గాలికొదిలేసింది. కనీసం సాగునీటి కాలువల నిర్వహణను సైతం పట్టించుకోక పోవడంతో నీరందక అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. తెదేపా హయాంలో యరగాం-పురుషోత్తపురం, పురుషోత్తపురం- నైరా ఛానల్ను సుమారు 40 కి.మీ. పొడవునా బాగుచేసి రైతులకు పూర్తి స్థాయిలో 20 వేల ఎకరాలకు సాగునీరందేలా చర్యలు తీసుకున్నారు. అప్పటి ప్రభుత్వ విప్ కూన రవికుమార్ నీరు- చెట్టు పనులు ద్వారా రూ.6 కోట్లతో కాలువలో పూర్తిగా పూడికలు తొలగించి మరమ్మతులు చేయించారు. 4 ఏళ్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులు పంటలు పండించుకున్నారు. అనంతరం వైకాపా అధికారంలోకి వచ్చాక ఐదేళ్లుగా కనీసం అటువైపు చూడక పోవడంతో పూర్తిగా పనికిరాని మొక్కలు, పూడికలతో ఛానల్ నిండిపోయింది. దీంతో సాగునీరందక రైతులు వర్షాధారంగానే పంటలు పండించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఛానల్ గట్టు, కల్వర్టులు మరమ్మతులకు గురవడంతో ఏ క్షణంలో కూలిపోతాయో అని రైతులు భయాందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.
అడుగడుగునా గండ్లు
కాలువ 40 కి.మీ. పొడవునా నిర్వహణను పట్టించుకోక పోవడంతో వర్షాలు కురిసినపుడు ఎక్కడికక్కడ గండ్లు పడటంతో పొలాలు ముంపునకు గురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఛానల్ గట్లుపై పనికిరాని మొక్కలు ఏపుగా పెరగడంతో గండ్లు పడే సమయంలో పంటలను కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం ఛానల్ గురించి పట్టించుకోలేదని పలువురు మండిపడుతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని చెవ్వాకులపేట, ఆనందపురం, రామచంద్రాపురం, పొన్నాంపేట, పురుషోత్తపురం, పకీర్సాహెబ్పేట, అమ్మాజీపేట, పాలవలస,యరగాం, మూలసవలపురం, పొన్నాం, కనకముడిపేట గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వేసవిలో పనులు చేపడతాం.. యరగాం-పురుషోత్తపురం, పురుషోత్తపురం- నైర ఛానల్లో పూడికలు పేరుకుపోయిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారి ఆదేశాల మేరకు సమస్య పరిష్కారానికి చర్యలు చేపడుతున్నాం. వేసవిలో పూర్తిస్థాయిలో పనులు చేపట్టి రైతులకు సాగునీరందే విధంగా కృషి చేస్తాం. - సరస్వతి, జేఈ, నీటి పారుదల శాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న మాయ‘దారి’ పాలన..!
[ 29-04-2024]
వైకాపా పాలకులు అయిదేళ్ల పాటు కళ్లకు గంతలు కట్టుకున్నారేమో.. అందుకే రోడ్లపై అడుగడుగునా ఏర్పడిన గుంతలు వారికి కనిపించలేదు. పల్లెదారులు రాళ్లు తేలినా పట్టించుకోలేదు. -
తెదేపాలోకి వరం కుటుంబం
[ 29-04-2024]
-
ఐదేళ్లలో జిల్లాకు ఏం చేశారు..
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో జిల్లాకు ఏం చేసిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. టెక్కలి ఇందిరా కూడలిలో ఆదివారం నిర్వహించిన న్యాయయాత్ర సభలో ఆమె మాట్లాడారు. -
పచ్చదనం గాలికొదిలేశారు.. ప్రజాధనం వృథా చేశారు..!
[ 29-04-2024]
జగనన్న ఏలుబడిలో మొక్కలకూ రక్షణ కరవైంది. పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘జగనన్న హరిత నగరాలు-గ్రీన్ సీటీ ఛాలెంజ్’ కార్యక్రమం ఆదిలోనే తుస్సుమంది. -
ఉద్దానం రైతులను ఏం ఉద్ధరించారు..
[ 29-04-2024]
ఉద్దానం ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది పలాస ప్రాంతం. ఉద్యాన పంటలకు పేరు పొందిన ఈ ప్రాంతంలో వర్షాభావంతో రైతులు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. -
తెదేపా, భాజపాలోకి భారీగా చేరికలు
[ 29-04-2024]
జి.సిగడాం మండలంలో వైకాపాకు కంచుకోటగా ఉన్న వాండ్రంగి గ్రామంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. -
మాజీ సైనికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్
[ 29-04-2024]
జిల్లాలోని మాజీ సైనికోద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎంపీ కింజరాపు రామ్మెహన్నాయుడు ప్రకటించారు. -
సీఎం సభలో విద్యుత్తు స్తంభాలు పడి ఇద్దరికి గాయాలు
[ 29-04-2024]
ఈ నెల 24న టెక్కలి సమీపంలో జరిగిన సిద్ధం బహిరంగ సభలో లైటింగ్ పోల్స్ మీద పడి ఇద్దరు గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
పిల్లల చదువులపై పక్షపాతమెందుకు..?
[ 29-04-2024]
విద్యా వ్యవస్థను మెరుగుపర్చేందుకు, పాఠశాల భవనాలను బాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ నాడు- నేడు పథకం ద్వారా నిధులు మంజూరు చేసింది. -
అడ్డదారిలో అద్దెకు..!
[ 29-04-2024]
కాశీబుగ్గ నడిబొడ్డున రూ.కోట్లు విలువ చేసే స్థలమది. గతంలో గ్రామ పరిపాలనాధికారుల (వీఆర్వో) సంఘానికి కేటాయించారు.
తాజా వార్తలు (Latest News)
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?
-
ఏటీఎం చోరీకి యత్నం.. షార్ట్ సర్క్యూట్తో నగదు దగ్ధం