తెదేపాలోకి భారీగా చేరికలు
పొందూరు మేజర్ పంచాయతీలో రోజురోజుకు వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు పెరుగుతున్నాయి. మంగళవారం రాత్రి పొందూరు పంచాయతీ జోగెన్నపేట ఎస్సీకాలనీ నుంచి 50 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలోకి చేరాయి.
పొందూరు, న్యూస్టుడే: పొందూరు మేజర్ పంచాయతీలో రోజురోజుకు వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు పెరుగుతున్నాయి. మంగళవారం రాత్రి పొందూరు పంచాయతీ జోగెన్నపేట ఎస్సీకాలనీ నుంచి 50 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలోకి చేరాయి. వీరికి ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్ కండువాలు వేసి పార్టీలో ఆహ్వానించారు. జోగెన్నపేట ఎస్సీ కాలనీకి చెందిన బలగ అసిరియ్య, చందక వెంకటరావు, ఎన్.పైడిరాజు, చంద్రశేఖర్, వై.ఆదినారాయణ, బగల శివ, చందక శివ, శ్రీను, పి.మోహన్, పోలా కృష్ణ, రాంబిల్లి వెంకటరావు, గంటా పాపామ్మ, చందక పుష్ప తదితరులు వైకాపా నుంచి తెదేపాలోకి చేరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సీహెచ్.రామ్మోహన్, శంకర్భాస్కర్, అనకాపల్లి చినరంగ, అన్నెపురాము, అనకాపల్లి వాణి, బాడాన హారిక, విజయలక్ష్మి, వండాన మురళీ, కాలెపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పాతపట్నం, న్యూస్టుడే: పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామానికి చెందిన పలువురు వైకాపా నాయకులు మంగళవారం తెదేపాలో చేరారు. స్థానిక నాయకుడు కొంచాడ వీరభద్రరావు కుమారుడు కొంచాడ జగన్నాథరావుతో పాటు పంచాయతీకి చెందిన సుమారు 200 కుటుంబాలు పాతపట్నం పార్టీ కార్యాలయంలో తెదేపాలో చేరాయి. నాయకులు శివ్వాల చిన్నయ్య, కరకవలస మన్మధరావు, విశ్వనాథం, డొక్క ధనుంజయ సంతలక్ష్మీపురం మాజీ సర్పంచి, గిరిజన సంఘ నాయకుడు సవర కన్నయ్యతో పాటు పలువురు తెదేపాలో చేరారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీˆనియర్ నాయకుడు సలాన మోహనరావు, తూలుగు తిరుపతిరావు, జనసేన, భాజపా నాయకుడు గేదెల చైతన్య, సలాన రాఘవరావు, మండల తెదేపా అధ్యక్షుడు పైల బాబ్జితో తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవ్వాతాతల.. ఉసురు పోసుకుంటారా?
[ 30-04-2024]
ఓ వైపు ఠారెత్తిస్తున్న ఎండలు.. మరోవైపు ఇళ్లకు ఎక్కడో దూరాన ఉన్న బ్యాంకులు.. ఇవేమీ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదు. ఎన్నికల వేళ పింఛన్ల పంపిణీ పేరుతో అధికార పక్షానికి మేలు చేసేందుకు అష్టకష్టాలు పడుతోంది. -
లెక్క తేలింది
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం సోమవారంతో ముగిసింది. గడువు పూర్తవ్వడంతో బరిలో నిలిచే రేసుగుర్రాల లెక్క తేలింది. -
ఖాకీలకు జగనన్న కుచ్చుటోపీ
[ 30-04-2024]
ప్రజల ధన, మాన, ప్రాణాల పరిరక్షణకు పోలీసులు నిత్యం శ్రమిస్తుంటారు. కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉంటూ అహర్నిశలు విధిలో నిర్వహణలో ఉంటారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -
పాలకుల పక్షపాతం.. మారని పల్లెచిత్రం..!
[ 30-04-2024]
జిల్లాలోని గ్రామీణ ప్రాంత ప్రజలు మట్టి రహదారులతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తెదేపా హయాంలో బీటీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంది. -
జెండా మారుతోంది..
[ 30-04-2024]
లావేరు మండలం సహపురం పంచాయతీ హనుమంతపురం నుంచి వైకాపాకు చెందిన 50 కుటుంబాలు సోమవారం కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు సమక్షంలో కూటమిలో చేరాయి. -
శ్రీకాకుళాన్ని మోడల్ నగరంగా అభివృద్ధి చేస్తాం
[ 30-04-2024]
శ్రీకాకుళాన్ని మోడల్ నగరంగా అభివృద్ధి చేస్తామని ఎంపీ రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకరరావు, మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ జయంతి పేర్కొన్నారు. -
బాబు సీఎం కావాలని దివ్యాంగుడి ప్రచారం
[ 30-04-2024]
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ ఓ దివ్యాంగుడు ఇచ్ఛాపురం నుంచి రాజమహేంద్రవరం వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు. -
రూ.25 వేల కోట్లు దారి మళ్లించారు
[ 30-04-2024]
రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం మాదిగలు, మాదిగ ఉప కులాల వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికే కూటమికి మద్దతు తెలుపుతున్నట్లు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు ఆర్జే ప్రకాష్ వెల్లడించారు. -
అక్రమ మద్యం నిల్వలపై దృష్టి సారించాలి
[ 30-04-2024]
ఎన్నికల ప్రచారం వేళ అక్రమ మద్యం నిల్వలపై దృష్టి సారించాలని ఎస్ఈబీ డీసీ డి.శ్రీరామచంద్రమూర్తి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా ఎస్ఈబీ కార్యాలయంలో ఎస్ఈబీ ఏఎస్పీ డి.గంగాధరం అధ్యక్షతన సోమవారం ఎస్ఈబీ, ఎక్సైజ్ అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించారు. -
రూ.29.5 లక్షల నగదు స్వాధీనం
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో సోమవారం భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. విశాఖపట్నం నుంచి మెళియాపుట్టికి ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.29.5 లక్షల నగదును శ్రీకాకుళం