logo

తెదేపాలోకి భారీగా చేరికలు

పొందూరు మేజర్‌ పంచాయతీలో రోజురోజుకు వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు పెరుగుతున్నాయి. మంగళవారం రాత్రి పొందూరు పంచాయతీ జోగెన్నపేట ఎస్సీకాలనీ నుంచి 50 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలోకి చేరాయి.

Published : 17 Apr 2024 04:45 IST

పొందూరు, న్యూస్‌టుడే: పొందూరు మేజర్‌ పంచాయతీలో రోజురోజుకు వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు పెరుగుతున్నాయి. మంగళవారం రాత్రి పొందూరు పంచాయతీ జోగెన్నపేట ఎస్సీకాలనీ నుంచి 50 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలోకి చేరాయి. వీరికి ఆమదాలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కూన రవికుమార్‌ కండువాలు వేసి పార్టీలో ఆహ్వానించారు. జోగెన్నపేట ఎస్సీ కాలనీకి చెందిన బలగ అసిరియ్య, చందక వెంకటరావు, ఎన్‌.పైడిరాజు, చంద్రశేఖర్‌,  వై.ఆదినారాయణ, బగల  శివ, చందక శివ, శ్రీను, పి.మోహన్‌, పోలా కృష్ణ, రాంబిల్లి వెంకటరావు, గంటా పాపామ్మ, చందక పుష్ప తదితరులు వైకాపా నుంచి  తెదేపాలోకి చేరారు.  కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సీహెచ్‌.రామ్మోహన్‌, శంకర్‌భాస్కర్‌, అనకాపల్లి చినరంగ, అన్నెపురాము, అనకాపల్లి వాణి, బాడాన హారిక, విజయలక్ష్మి, వండాన మురళీ, కాలెపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పాతపట్నం, న్యూస్‌టుడే: పాతపట్నం మండలం తిడ్డిమి గ్రామానికి చెందిన పలువురు వైకాపా నాయకులు మంగళవారం తెదేపాలో చేరారు. స్థానిక నాయకుడు కొంచాడ వీరభద్రరావు కుమారుడు కొంచాడ జగన్నాథరావుతో పాటు పంచాయతీకి చెందిన సుమారు 200 కుటుంబాలు పాతపట్నం పార్టీ కార్యాలయంలో తెదేపాలో చేరాయి. నాయకులు శివ్వాల చిన్నయ్య, కరకవలస మన్మధరావు, విశ్వనాథం, డొక్క ధనుంజయ సంతలక్ష్మీపురం మాజీ సర్పంచి, గిరిజన సంఘ నాయకుడు సవర కన్నయ్యతో పాటు పలువురు తెదేపాలో చేరారు. ఈ కార్యక్రమంలో తెదేపా సీˆనియర్‌ నాయకుడు సలాన మోహనరావు, తూలుగు తిరుపతిరావు, జనసేన, భాజపా నాయకుడు గేదెల చైతన్య, సలాన రాఘవరావు, మండల తెదేపా అధ్యక్షుడు పైల బాబ్జితో తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని