సిక్కోలు కుర్రోడి సత్తా..!
మారుమూల పల్లెటూరు.. రైతు కుటుంబంలో జన్మించిన యువకుడు సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటాడు. పట్టుదలతో చదివి సిక్కోలు ఖ్యాతిని ఇనుమడింపజేశాడు. ఉన్నత చదువులు పూర్తి కాగానే కొంత కాలం ఉద్యోగం చేశాడు.
సివిల్స్లో 467వ ర్యాంకు సాధించిన అల్లాడపేట వాసి
న్యూస్టుడే, జలుమూరు
మారుమూల పల్లెటూరు.. రైతు కుటుంబంలో జన్మించిన యువకుడు సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటాడు. పట్టుదలతో చదివి సిక్కోలు ఖ్యాతిని ఇనుమడింపజేశాడు. ఉన్నత చదువులు పూర్తి కాగానే కొంత కాలం ఉద్యోగం చేశాడు. అనంతరం సివిల్స్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగి.. రెండో ప్రయత్నంలోనే మంచి ర్యాంకు సాధించాడు.
జలుమూరు మండలంలోని అల్లాడపేట గ్రామానికి చెందిన బాన్న వెంకటేష్ సివిల్స్లో 467 ర్యాంకు కైవసం చేసుకున్నారు. తండ్రి చంద్రరావు రైతు.. తల్లి రోహిణి గృహిణి. వీరికి ఇద్దరు కుమారులు. మొదటి సంతానం వెంకటేష్, రెండో సంతానం వంశీ. వ్యవసాయం చేసుకుంటూ గ్రామంలోనే చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదాయం తక్కువగానే ఉన్నప్పటికీ కష్టాలను దిగమింగి పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. వెంకటేష్ 1 నుంచి 3వ తరగతి వరకు స్వగ్రామంలో చదువుకున్నాడు. 4 నుంచి 9 వరకు మునసబుపేటలోని ప్రైవేటు పాఠశాలలో, పదో తరగతి ప్రైవేటు పాఠశాలలోను చదువుకున్నారు. ఇంటర్మీడియట్ విశాఖపట్నంలో పూర్తి చేశారు. తిరుచానూరులోని ఎన్ఐటీలో ఇంజినీరింగ్ డిగ్రీ పట్టా పొందారు.. ఆ తర్వాత రెండేళ్ల పాటు ఓ ప్రైవేటు సంస్థలో పని చేశాడు. అనంతరం సివిల్స్ శిక్షణ తీసుకొని రెండో ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించాడు. రెండో కుమారుడు బాన్న వంశీ ప్రస్తుతం శ్రీహరికోటలో శాస్త్రవేత్తగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ను జడ్పీటీసీ సభ్యురాలు మెండ విజయశాంతి, మెండ రాంబాబు, బంధువులు అభినందించారు.
ఉద్యోగం చేసినా సంతృప్తి లేక..
- వెంకటేష్
ఎన్ఐటీలో చదివేందుకు మొదట్లో ఇబ్బందులు పడ్డాను. నిరంతరం చదువుపై దృష్టి పెట్టడంతో పాటు ఇంజినీరింగ్ చివరి ఏడాదిలో ప్రాంగణ ఎంపికల్లో ఓ ప్రైవేటు సంస్థకు ఎంపికయ్యాను. రెండేళ్లు ఉద్యోగం చేసినా సంతృప్తి అనిపించలేదు. ఐఏఎస్ అధికారిగా ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగాను. శిక్షణ తీసుకుని ఈ ర్యాంకు సాధించాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనన్న మాయ‘దారి’ పాలన..!
[ 29-04-2024]
వైకాపా పాలకులు అయిదేళ్ల పాటు కళ్లకు గంతలు కట్టుకున్నారేమో.. అందుకే రోడ్లపై అడుగడుగునా ఏర్పడిన గుంతలు వారికి కనిపించలేదు. పల్లెదారులు రాళ్లు తేలినా పట్టించుకోలేదు. -
తెదేపాలోకి వరం కుటుంబం
[ 29-04-2024]
-
ఐదేళ్లలో జిల్లాకు ఏం చేశారు..
[ 29-04-2024]
వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో జిల్లాకు ఏం చేసిందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. టెక్కలి ఇందిరా కూడలిలో ఆదివారం నిర్వహించిన న్యాయయాత్ర సభలో ఆమె మాట్లాడారు. -
పచ్చదనం గాలికొదిలేశారు.. ప్రజాధనం వృథా చేశారు..!
[ 29-04-2024]
జగనన్న ఏలుబడిలో మొక్కలకూ రక్షణ కరవైంది. పచ్చదనాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘జగనన్న హరిత నగరాలు-గ్రీన్ సీటీ ఛాలెంజ్’ కార్యక్రమం ఆదిలోనే తుస్సుమంది. -
ఉద్దానం రైతులను ఏం ఉద్ధరించారు..
[ 29-04-2024]
ఉద్దానం ఈ పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది పలాస ప్రాంతం. ఉద్యాన పంటలకు పేరు పొందిన ఈ ప్రాంతంలో వర్షాభావంతో రైతులు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. -
తెదేపా, భాజపాలోకి భారీగా చేరికలు
[ 29-04-2024]
జి.సిగడాం మండలంలో వైకాపాకు కంచుకోటగా ఉన్న వాండ్రంగి గ్రామంలో వైకాపాకు ఎదురుదెబ్బ తగిలింది. -
మాజీ సైనికుల కోసం ప్రత్యేక కార్పొరేషన్
[ 29-04-2024]
జిల్లాలోని మాజీ సైనికోద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎంపీ కింజరాపు రామ్మెహన్నాయుడు ప్రకటించారు. -
సీఎం సభలో విద్యుత్తు స్తంభాలు పడి ఇద్దరికి గాయాలు
[ 29-04-2024]
ఈ నెల 24న టెక్కలి సమీపంలో జరిగిన సిద్ధం బహిరంగ సభలో లైటింగ్ పోల్స్ మీద పడి ఇద్దరు గాయపడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
పిల్లల చదువులపై పక్షపాతమెందుకు..?
[ 29-04-2024]
విద్యా వ్యవస్థను మెరుగుపర్చేందుకు, పాఠశాల భవనాలను బాగు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ నాడు- నేడు పథకం ద్వారా నిధులు మంజూరు చేసింది. -
అడ్డదారిలో అద్దెకు..!
[ 29-04-2024]
కాశీబుగ్గ నడిబొడ్డున రూ.కోట్లు విలువ చేసే స్థలమది. గతంలో గ్రామ పరిపాలనాధికారుల (వీఆర్వో) సంఘానికి కేటాయించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
పాఠ్య పుస్తకాల అప్డేషన్పై NCERTకి కేంద్రం కీలక సూచన!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట