కలకలం.. గాజు సీసాతో పొడిచేందుకు ఉపాధ్యాయులను వెంబడించిన విద్యార్థి
తల వెంట్రుకలకు రంగు వేసుకోకూడదని చెప్పినందుకే ఓ విద్యార్థి ఏకంగా ఉపాధ్యాయులను చంపుతానని వెంబడించడం కలకలం రేపింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సేలం జిల్లా ఆత్తూర్లోని ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న
సేలం, న్యూస్టుడే: తల వెంట్రుకలకు రంగు వేసుకోకూడదని చెప్పినందుకే ఓ విద్యార్థి ఏకంగా ఉపాధ్యాయులను చంపుతానని వెంబడించడం కలకలం రేపింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సేలం జిల్లా ఆత్తూర్లోని ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న పుంగవాడికి చెందిన విద్యార్థి తలకి రంగు వేసుకొని పాఠశాలకి వచ్చాడు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు మందలించారు. విద్యార్థి అనుచితంగా మాట్లాడాడు. వెంటనే అతని తల్లిదండ్రులను పాఠశాలకి రప్పించి వారు విషయం చెప్పారు. ఆ విద్యార్థి శనివారం అకస్మాత్తుగా ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులను గాజు సీసాతో పొడిచేస్తాడని పేర్కొంటూ వెంబడించాడు. వారు ఓ గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ సమయంలో విద్యార్థి మాట్లాడిన మాటలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
[ 29-04-2024]
నెల్లై జిల్లా కల్లిడైకురిచ్చికి చెందిన వేల్మురుగన్ టీ దుకాణం నడుపుతున్నాడు. ఇతని కుమారుడు పేచ్చి ఇటీవల విడుదలైన యూపీఎస్సీ పరీక్షల ఫలితాల్లో 567వ స్థానంలో నిలిచి ప్రతిభ కనబర్చాడు. -
వరాలిచ్చినా వనితల ఓటు పడలేదు!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తలపడిన మూడు ప్రధాన కూటములు ప్రత్యేకించి మహిళా ఓటర్ల మీద పెద్ద ఆశలే పెట్టుకున్నాయి. -
గుకేశ్కు రూ.75 లక్షల ప్రోత్సాహక నగదు
[ 29-04-2024]
రాష్ట్రానికి చెందిన భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్కు రూ.75 లక్షల ప్రోత్సాహక నగదును ముఖ్యమంత్రి అందించారు. -
తాగునీటి సమస్య తలెత్తదు
[ 29-04-2024]
చెన్నై మహానగరంలో సెప్టెంబర్ వరకు తాగునీటి సమస్య తలెత్తే అవకాశం లేదని చెన్నై తాగునీటి బోర్డు తెలిపింది. -
ఈవీఎంలను సక్రమంగా పర్యవేక్షించాలి
[ 29-04-2024]
ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల్లో ఓట్లు పోలైన ఈవీఎంలను సక్రమంగా పర్యవేక్షించాలని కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ తెలిపారు. -
పనిలేక పస్తులు
[ 29-04-2024]
జాలర్లు సంద్రంలోకి వెళ్లి చేపలు పట్టడంపై ప్రస్తుతం ప్రభుత్వం నిషేధం విధించింది. -
విజయ్ పుట్టినరోజున గోట్ రెండో సింగిల్
[ 29-04-2024]
విజయ్ 68వ చిత్రంగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్) రూపొందుతున్న విషయం తెలిసిందే. -
ఐఎస్ఐ మద్దతుదారుడి అరెస్టుకు ప్రతీకారంగానే కోయంబత్తూరులో బాంబు పేలుళ్లకు కుట్ర
[ 29-04-2024]
ఐఎస్ఐ మద్దతుదారుడిని అరెస్టు చేసినందుకే కోయంబత్తూరులో బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు తెలిసింది. -
వాహనాలపై స్టిక్కర్లు అంటించడంపై నిషేధం
[ 29-04-2024]
ప్రజలు తమ వాహనాలపై మీడియా, పోలీసు, న్యాయశాఖ, ఆర్మీ అని పలు శాఖలు, సంస్థల పేర్లను అతికించడానికి గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు నిషేధం విధించారు.
తాజా వార్తలు (Latest News)
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్