రూ.49.36 కోట్లతో కన్యాకుమారి స్టేషను పునరుద్ధరణ
కన్యాకుమారి రైల్వే స్టేషను పునరాభివృద్ధికి దక్షిణ రైల్వే టెంటర్లను ఆహ్వానించింది.
స్టేషను నమూనా
వడపళని, న్యూస్టుడే: కన్యాకుమారి రైల్వే స్టేషను పునరాభివృద్ధికి దక్షిణ రైల్వే టెంటర్లను ఆహ్వానించింది. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడానికి రూ.49.36 కోట్లతో పునరాభివృద్ధి పనులు చేపట్టినట్లు దక్షిణ రైల్వే గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. టెండరుకు సంబంధించిన ‘లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్’ (ఎల్ఓఏ) బుధవారం అందజేసినట్టు తెలిపారు. ప్రయాణికులు లోపలికి వెళ్లేందుకు, బయటికి వచ్చేందుకు ప్రత్యేక ద్వారాలు, అధునాతన విద్యుద్దీపాలు, అన్ని రకాల వాహనాలు పార్కింగు చేసుకునేందుకు వీలుగా, ప్లాట్ఫారాలు చేరుకోవడానికి వీలుగా ఎస్కలేటర్లు, లిఫ్టులు, కాలినడక పైవంతెనలు నిర్మించనున్నారు. కన్యాకుమారితో పాటు చెన్నై ఎగ్మూరు, కాట్పాడి జంక్షన్, మదురై జంక్షన్, రామేశ్వరం, కేరళలోని ఎర్నాకులం జంక్షన్, ఎర్నాకులం టౌన్, కొల్లం, పుదుచ్చేరి, కన్యాకుమారితో కలిపి మొత్తం తొమ్మిది స్టేషన్లను అభివృద్ధి చేయడానికి టెండర్లను అందజేశారు. కుంభకోణం, తిరునెల్వేలి, చెంగనూరు, త్రిసూరు స్టేషన్లను కూడా అభివృద్ధి చేసేందుకు సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదిక సమర్పించేందుకు అధ్యయనాలు ప్రారంభించారు. చెన్నై సెంట్రల్, తాంబరం, ఆవడి, కోయంబత్తూరు, తిరువనంతపురం సెంట్రల్, వర్కాల, కోజికోడ్, మంగళూరు స్టేషన్లలో కూడా అధ్యయనాలు చేపట్టారు. ఇవి కాకుండా మరో 38 స్టేషన్లను అభివృద్ధి చేసేందుకు గుర్తించామని, రైల్వే బోర్డు నుంచి అనుమతి రాగానే టెక్నో ఎకనమిక్ ఫీజిబులిటీపై అధ్యయనం చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
8 ఏళ్ల ప్రేమ.. వివాహమైన వెంటనే పారిపోయిన భర్త
[ 07-05-2024]
కళ్లకురిచ్చి జిల్లా ఉళుందూర్పేట సమీపం సిరుత్తనూర్ గ్రామానికి చెందిన గోవిందస్వామి ఏసు కుమార్తె రోస్లిన్ మేరీ (25) చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు. -
అమ్మాయిలు అదరగొట్టారు
[ 07-05-2024]
ప్లస్టూ పబ్లిక్ పరీక్షల్లో అమ్మాయిలు అదరగొట్టారు. అబ్బాయిల కన్నా ఎక్కువ ఉత్తీర్ణతశాతం సాధించారు. -
చిన్నారిపై పెంపుడు కుక్కల దాడి
[ 07-05-2024]
పార్కులో ఐదేళ్ల చిన్నారిపై రెండు పెంపుడు కుక్కలు దారుణంగా దాడిచేసిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. -
ఠారెత్తిస్తున్న ఎండలు!
[ 07-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు బాగా పెరిగాయి. చాలా జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలూ జారీ చేసింది. -
అంధ పాఠకులకు ప్రత్యేక యాప్
[ 07-05-2024]
సభ్యత్వం ఉన్న వారికి పుస్తకాలను అద్దెకిచ్చే పద్ధతిని ఇటీవల అన్నా సెంటినరీ గ్రంథాలయం ప్రారంభించిన విషయం తెలిసిందే. -
ప్లస్టూ ఫలితాల విడుదల
[ 07-05-2024]
మహానగర చెన్నై కార్పొరేషన్ పాఠశాల విద్యార్థులు 12వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 87.13 శాతం ఉత్తీర్ణత సాధించారని కమిషనర్ డాక్టర్ జె.రాధాకృష్ణన్ వెల్లడించారు. -
చర్చనీయంగా ఏ.ఆర్.రెహమాన్ పోస్టు
[ 07-05-2024]
దివంగత హాస్యనటుడు కుమరిముత్తు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ తన ఎక్స్ పేజీలో షేర్ చేశారు. -
వైద్య విద్యార్థుల మృతికి సీఎం సంతాపం
[ 07-05-2024]
కన్నియాకుమరి జిల్లా రాజాక్కమంగలంలోని సముద్రంలో మునిగి మృతి చెందిన వైద్య విద్యార్థుల ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
విక్రవాండి ఉప ఎన్నికకు రంగం సిద్ధం!
[ 07-05-2024]
విళుపురం జిల్లా విక్రవాండి ఎమ్మెల్యే (డీఎంకే) మృతితో ఆ నియోజకవర్గం ఖాళీగా ఉందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. -
ఇండియా కూటమిలో డీఎంకే ఉండి ప్రయోజనమేంటి?
[ 07-05-2024]
డీఎంకే ఇండియా కూటమిలో ఉన్నా రాష్ట్రానికి ప్రయోజనమేమి లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి అన్నారు. -
జయకుమార్ మృతిపై దర్యాప్తు ముమ్మరం
[ 07-05-2024]
తిరునెల్వేలి కాంగ్రెస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు జయకుమార్ ధనసింగ్ మృతి వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దయచేసి మా దేశానికి రండి’.. భారతీయులను వేడుకుంటున్న మాల్దీవులు
-
రూ.10వేల లంచం కేసును లాగితే.. బయటపడిన నోట్ల గుట్టలు..!
-
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
-
వైఎస్ షర్మిలపై కేసు నమోదు
-
పన్నూ కేసులో అమెరికా ఆశలపై నీళ్లుజల్లిన చెక్ రిపబ్లిక్ కోర్టు..!
-
ఆ హీరోని అనుకున్నారు.. అల్లు అర్జున్ను ఫైనల్ చేశారు: 20 ఏళ్ల ‘ఆర్య’ విశేషాలివీ..