సైనికుల త్యాగాలను స్మరించుకోవాలి
అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ తరఫున గణతంత్ర దిన వేడుకలు అమరజీవి స్మారక భవన ప్రాంగణంలో గురువారం జరిగాయి.
గేయ రచయిత భువనచంద్ర
పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పిస్తున్న దృశ్యం
ప్యారిస్, న్యూస్టుడే: అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక భవన నిర్వాహక కమిటీ తరఫున గణతంత్ర దిన వేడుకలు అమరజీవి స్మారక భవన ప్రాంగణంలో గురువారం జరిగాయి. ముందుగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఛైర్మన్ అనిల్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత భవన ప్రాంగణంలో ప్రముఖ గేయ రచయిత, కమిటీ సభ్యులు భువనచంద్ర జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ....ఈ ఏడాది జరిగే వేడుకలకు ఓ ప్రత్యేకత ఉందని, సొంత సాంకేతిక పరిజ్ఞానంతో మనదేశ రక్షణ శాఖ తయారుచేసిన ఆయుధాలను దిల్లీలో జరుగుతున్న గణతంత్ర దిన వేడుకల్లో ప్రదర్శించారని కొనియాడారు. దేశ రక్షణలో భాగంగా ప్రాణత్యాగం చేసిన త్రివిధ దళాల సైనికులను పౌరులందరూ స్మరించుకోవాలన్నారు. కమిటీ కార్యదర్శి, కోశాధికారి కృష్ణారావు, సంయుక్త కార్యదర్శి ఊరా శశికళ, కమిటీ సభ్యులు డాక్టర్ విస్తాలి శంకరరావు, డాక్టర్ ఎం.వి.నారాయణ గుప్తా, జేఎం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Navjot Singh Sidhu: జైలునుంచి విడుదలైన సిద్ధూ.. రాహుల్ గాంధీ ఓ విప్లవమని వ్యాఖ్య!
-
Movies News
అల్లు అర్జున్తో మురుగదాస్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు
-
Sports News
LSG vs DC: లఖ్నవూ సూపర్ జెయింట్స్ X దిల్లీ క్యాపిటల్స్.. బోణీ కొట్టే జట్టేది?
-
General News
SRH vs RR: ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సంఖ్య పెంపు
-
India News
Delhi Airport: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ