నేటితో ప్రచారానికి తెర
లోక్సభ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం 6 గంటలతో తెర పడనుందని, ఆ తర్వాత అనుమతిలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు తెలిపారు. విలేకర్లతో ఆయన మాట్లాడుతూ.
చెన్నై, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికల ప్రచారానికి బుధవారం సాయంత్రం 6 గంటలతో తెర పడనుందని, ఆ తర్వాత అనుమతిలేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సత్యప్రద సాహు తెలిపారు. విలేకర్లతో ఆయన మాట్లాడుతూ... తక్కువ సంఖ్యలో ప్రభుత్వ అధికారులు ఉన్న జిల్లాల్లోని పోలింగ్ బూత్లలో ప్రధాన అధికారి, ఇద్దరు అధికారులను మాత్రం విధుల్లో నియమించడానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిందన్నారు. ఆ మేరకు చెంగల్పట్టు జిల్లా, విళవంగోడు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలు కారణంగా కన్నియాకుమరి జిల్లాలోని పోలింగ్ బూత్లలో ఓ ప్రధాన అధికారి, ఇద్దరు అధికారులను విధుల్లో నియమించనున్నట్లు తెలిపారు. ఇతర జిల్లాల్లో అదనంగా ఓ అధికారిని నియమించనున్నట్టు పేర్కొన్నారు. పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వని ప్రైవేటు సంస్థలపై సంబంధిత జిల్లా ఎస్డీడీ కోడ్తో 1950 అనే నంబరుకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. విక్రవాండి ఎమ్మెల్యే మృతితో ఆ నియోజకవర్గం ఖాళీ అయినట్లు ఎన్నికల కమిషన్కు తెలిపామని, ఉప ఎన్నికపై ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. జూన్ 4లోపు ఉప ఎన్నిక ప్రకటించినా అవసరమైన ఈవీఎంలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. నియోజకవర్గంతో సంబంధంలేనివారు బుధవారం సాయంత్రం 6 గంటలు తర్వాత ఆ స్థానాన్ని విడిచి వెళ్లిపోవాలని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
[ 29-04-2024]
నెల్లై జిల్లా కల్లిడైకురిచ్చికి చెందిన వేల్మురుగన్ టీ దుకాణం నడుపుతున్నాడు. ఇతని కుమారుడు పేచ్చి ఇటీవల విడుదలైన యూపీఎస్సీ పరీక్షల ఫలితాల్లో 567వ స్థానంలో నిలిచి ప్రతిభ కనబర్చాడు. -
వరాలిచ్చినా వనితల ఓటు పడలేదు!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తలపడిన మూడు ప్రధాన కూటములు ప్రత్యేకించి మహిళా ఓటర్ల మీద పెద్ద ఆశలే పెట్టుకున్నాయి. -
గుకేశ్కు రూ.75 లక్షల ప్రోత్సాహక నగదు
[ 29-04-2024]
రాష్ట్రానికి చెందిన భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్కు రూ.75 లక్షల ప్రోత్సాహక నగదును ముఖ్యమంత్రి అందించారు. -
తాగునీటి సమస్య తలెత్తదు
[ 29-04-2024]
చెన్నై మహానగరంలో సెప్టెంబర్ వరకు తాగునీటి సమస్య తలెత్తే అవకాశం లేదని చెన్నై తాగునీటి బోర్డు తెలిపింది. -
ఈవీఎంలను సక్రమంగా పర్యవేక్షించాలి
[ 29-04-2024]
ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల్లో ఓట్లు పోలైన ఈవీఎంలను సక్రమంగా పర్యవేక్షించాలని కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ తెలిపారు. -
పనిలేక పస్తులు
[ 29-04-2024]
జాలర్లు సంద్రంలోకి వెళ్లి చేపలు పట్టడంపై ప్రస్తుతం ప్రభుత్వం నిషేధం విధించింది. -
విజయ్ పుట్టినరోజున గోట్ రెండో సింగిల్
[ 29-04-2024]
విజయ్ 68వ చిత్రంగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్) రూపొందుతున్న విషయం తెలిసిందే. -
ఐఎస్ఐ మద్దతుదారుడి అరెస్టుకు ప్రతీకారంగానే కోయంబత్తూరులో బాంబు పేలుళ్లకు కుట్ర
[ 29-04-2024]
ఐఎస్ఐ మద్దతుదారుడిని అరెస్టు చేసినందుకే కోయంబత్తూరులో బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు తెలిసింది. -
వాహనాలపై స్టిక్కర్లు అంటించడంపై నిషేధం
[ 29-04-2024]
ప్రజలు తమ వాహనాలపై మీడియా, పోలీసు, న్యాయశాఖ, ఆర్మీ అని పలు శాఖలు, సంస్థల పేర్లను అతికించడానికి గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు నిషేధం విధించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!
-
ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్ వైరల్
-
ఇజ్రాయెల్ అధికారుల్లో.. ‘ఐసీసీ’ అరెస్టు వారెంట్ల గుబులు!
-
బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు?