ముగిసిన వణంగాన్ చిత్రీకరణ
బాలా దర్శకత్వంలో రూపొందుతున్న ‘వణంగాన్’ చిత్రంలో అరుణ్ విజయ్ నటించారు. సురేశ్ కామాట్చి నిర్మాణంలోని ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం సమకూర్చారు.
చిత్రబృందం
చెన్నై, న్యూస్టుడే: బాలా దర్శకత్వంలో రూపొందుతున్న ‘వణంగాన్’ చిత్రంలో అరుణ్ విజయ్ నటించారు. సురేశ్ కామాట్చి నిర్మాణంలోని ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం సమకూర్చారు. చిత్రీకరణ ముగిసినట్లు నిర్మాత తన ఎక్స్ పేజీలో ఫొటోలు పోస్టు చేశారు. దర్శకుడు, నటుడు, ఇతర నటీనటులు, టెక్నీషియన్లకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చేవారం టీజర్ విడుదల కానుందని సమాచారం.
‘అరబిక్ కుత్తు’ని అధిగమించిన ‘విజిల్ పోడు’
పాటలోని సన్నివేశం
చెన్నై, న్యూస్టుడే: విజయ్ నటిస్తున్న ‘గోట్’ చిత్రంలోని ‘విజిల్ పోడు’ పాట లిరిక్ వీడియోను తమిళ నూతన సంవత్సరాది సందర్భంగా చిత్రబృందం ఆదివారం విడుదల చేసిన విషయం తెలిసిందే. విజయ్ పాడిన ఈ పాటలోని భావం ఆయన రాజకీయ ప్రవేశానికి సంబంధించినట్లు ఉందనే అభిప్రాయాలను నెటిజన్లు వినిపించారు. వీడియో విడుదలైన 24 గంటల్లో యూట్యూబ్లో 25.5 మిలియన్ వ్యూస్లను దాటింది. గతంలో దక్షిణభారత సినిమాల్లో 24 గంటల్లోపు అత్యధిక వీక్షణలు కలిగిన పాటగా విజయ్ నటించిన ‘బీస్ట్’ చిత్రంలోని ‘అరబిక్ కుత్తు’ పాట ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆ రికార్డును ‘విజిల్ పోడు’ అధిగమించింది.
ఎన్నికల తర్వాత థగ్ లైఫ్లో కమల్
‘థగ్ లైఫ్’ పోస్టర్
చెన్నై, న్యూస్టుడే: దర్శకుడు మణిరత్నం, నటుడు కమలహాసన్ కాంబోలో ‘థగ్ లైఫ్’ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. రాజ్కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తోంది. చిత్రీకరణ జనవరిలో ప్రారంభమైంది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పనుల్లో బిజీగా ఉండటంతో తనకు సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణను కమలహాసన్ వాయిదా వేశారు. 19న పోలింగ్ తర్వాత ఆయన కెమెరా ముందుకు వెళ్లనున్నారు. సైబీరియాలో క్లైమాక్స్ సన్నివేశాలు, దిల్లీ, చెన్నైలో మిగతా సన్నివేశాల చిత్రీకరణ చేపట్టాలని చిత్రబృందం నిర్ణయించింది.
త్వరలో దివ్యాంగులతో సినిమా: లారెన్స్
చెన్నై, న్యూస్టుడే: దివ్యాంగులతో త్వరలో ఓ సినిమాను తీయనున్నట్లు నటుడు, నృత్యదర్శకుడు రాఘవా లారెన్స్ తెలిపారు. తమిళ సంవత్సరాది సందర్భంగా తనకు చెందిన ‘కై కొడుక్కుం కై’ దివ్యాంగుల బృందం తరఫున ‘మల్లర్ కంబం’(మల్ల కంబ్) విన్యాసాలను ప్రదర్శన నగరంలో నిర్వహించారు. మల్లర్ కంబం నేర్చుకున్న దివ్యాంగులకు తనవంతు సాయాన్ని చేస్తానని తెలిపారు. వారితో త్వరలో ఓ చిత్రాన్ని తీయనున్నట్టు, దాని ద్వారా వచ్చే ఆదాయంతో వారికి ఇళ్లు నిర్మించి ఇస్తానని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూపీఎస్సీ ఫలితాల్లో టీ మాస్టర్ కుమారుడి సత్తా
[ 29-04-2024]
నెల్లై జిల్లా కల్లిడైకురిచ్చికి చెందిన వేల్మురుగన్ టీ దుకాణం నడుపుతున్నాడు. ఇతని కుమారుడు పేచ్చి ఇటీవల విడుదలైన యూపీఎస్సీ పరీక్షల ఫలితాల్లో 567వ స్థానంలో నిలిచి ప్రతిభ కనబర్చాడు. -
వరాలిచ్చినా వనితల ఓటు పడలేదు!
[ 29-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తలపడిన మూడు ప్రధాన కూటములు ప్రత్యేకించి మహిళా ఓటర్ల మీద పెద్ద ఆశలే పెట్టుకున్నాయి. -
గుకేశ్కు రూ.75 లక్షల ప్రోత్సాహక నగదు
[ 29-04-2024]
రాష్ట్రానికి చెందిన భారత గ్రాండ్మాస్టర్ గుకేశ్కు రూ.75 లక్షల ప్రోత్సాహక నగదును ముఖ్యమంత్రి అందించారు. -
తాగునీటి సమస్య తలెత్తదు
[ 29-04-2024]
చెన్నై మహానగరంలో సెప్టెంబర్ వరకు తాగునీటి సమస్య తలెత్తే అవకాశం లేదని చెన్నై తాగునీటి బోర్డు తెలిపింది. -
ఈవీఎంలను సక్రమంగా పర్యవేక్షించాలి
[ 29-04-2024]
ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల్లో ఓట్లు పోలైన ఈవీఎంలను సక్రమంగా పర్యవేక్షించాలని కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ తెలిపారు. -
పనిలేక పస్తులు
[ 29-04-2024]
జాలర్లు సంద్రంలోకి వెళ్లి చేపలు పట్టడంపై ప్రస్తుతం ప్రభుత్వం నిషేధం విధించింది. -
విజయ్ పుట్టినరోజున గోట్ రెండో సింగిల్
[ 29-04-2024]
విజయ్ 68వ చిత్రంగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘గోట్’ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్) రూపొందుతున్న విషయం తెలిసిందే. -
ఐఎస్ఐ మద్దతుదారుడి అరెస్టుకు ప్రతీకారంగానే కోయంబత్తూరులో బాంబు పేలుళ్లకు కుట్ర
[ 29-04-2024]
ఐఎస్ఐ మద్దతుదారుడిని అరెస్టు చేసినందుకే కోయంబత్తూరులో బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు తెలిసింది. -
వాహనాలపై స్టిక్కర్లు అంటించడంపై నిషేధం
[ 29-04-2024]
ప్రజలు తమ వాహనాలపై మీడియా, పోలీసు, న్యాయశాఖ, ఆర్మీ అని పలు శాఖలు, సంస్థల పేర్లను అతికించడానికి గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు నిషేధం విధించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!