logo

ఇద్దరు విద్యార్థుల అదృశ్యం

ఇద్దరు పదో తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఎంపీవీ స్టేషన్‌ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కె.ఆర్‌.ఎం కాలనీలో నివాసముంటున్న కార్తీక్‌ వర్థన్‌ (15),....

Published : 23 Jan 2022 05:37 IST

పెదవాల్తేరు, న్యూస్‌టుడే : ఇద్దరు పదో తరగతి విద్యార్థులు అదృశ్యమయ్యారు. ఎంపీవీ స్టేషన్‌ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కె.ఆర్‌.ఎం కాలనీలో నివాసముంటున్న కార్తీక్‌ వర్థన్‌ (15), దిలీప్‌కుమార్‌ (15) స్నేహితులు. 21వ తేదీ వీరిద్దరూ ట్యూషన్‌కు వెళ్తామని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయారు. తిరిగి ఇంటికి రాలేదు. అయితే కుటుంబ సభ్యుల ఫోన్‌ నుంచి రాజోలుకు బస్సు టిక్కెట్లు బుక్‌ చేసి ఉన్నట్లు గుర్తించారు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సి.ఐ పి.రమణయ్య ఆధ్వర్యంలో ఎస్‌.ఐ భాస్కరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని