యుద్ధం చూస్తారా!
బీచ్ రోడ్డులో సీహారియర్ యుద్ధ విమాన సందర్శనాలయం పనులు వడివడిగా సాగుతున్నాయి. ఇందుకు ‘రాజీవ్ స్మృతి భవనం’ను ఆధునికీకరిస్తున్నారు. దీన్నే మ్యూజియంగా మార్చనుండటంతో అందుకు అవసరమైన పనులు
సిద్ధమవుతున్న ‘సీ హారియర్’
భవనం లోపలికి విమానం తరలింపు
బయట నుంచి భవనంలోకి తీసుకువెళ్తూ
ఈనాడు, విశాఖపట్నం: బీచ్ రోడ్డులో సీహారియర్ యుద్ధ విమాన సందర్శనాలయం పనులు వడివడిగా సాగుతున్నాయి. ఇందుకు ‘రాజీవ్ స్మృతి భవనం’ను ఆధునికీకరిస్తున్నారు. దీన్నే మ్యూజియంగా మార్చనుండటంతో అందుకు అవసరమైన పనులు వీఎంఆర్డీఏ ఇంజినీరింగ్ విభాగం చేస్తోంది. ఇప్పటివరకు ఆరుబయట టీయూ-142 యుద్ధ విమాన పక్కన ఉంచిన ఈ యుద్ధ విమానాన్ని తాజాగా అక్కడి నుంచి భవనం లోపలకు చేర్చారు. భారీ క్రేన్ల సాయంతో ఈ ప్రక్రియ పూర్తి చేశారు. గాలిలో ఎగురుతున్నట్లు కనిపించేలా అత్యంత జాగ్రత్తగా భవనం లోపల వేలాడదీసే పనులు చేస్తున్నారు. ప్రస్తుతం క్రేన్లతోనే ఎత్తులో ఉంచి కొత్తగా రంగులద్దుతున్నారు.
ప్రదర్శనకు వీలుగా
ఈ మ్యూజియంలో సీహారియర్ యుద్ధ విమాన విడి భాగాలను కూడా ప్రదర్శించనున్నారు. ఇంజిన్ పరికరాలు, కాక్పిట్ లోపలి భాగాలు, పైలట్ గది, బాంబులు వదిలే పరికరాల గురించి అందరూ తెలుసుకునేలా అందుబాటులో ఉంచనున్నారు. వీటిని కేరళలోని కొచ్చిన్ నౌకాస్థావరం నుంచి తీసుకురావాల్సి ఉంది. ఇక్కడి నుంచి ప్రత్యేక బృందం త్వరలో బయలుదేరనుంది. ఈ మ్యూజియంలో ‘సిమ్యులేటర్’ విభాగం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. దీంతో నిజంగా యుద్ధవిమానంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. రక్షణ రంగం దీన్ని వీఎంఆర్డీఏకు అప్పగించాల్సి ఉంది. కొద్ది రోజుల్లో దీనిపై చర్చించనున్నారు.
భవనం లోపల ఎగిరేలా కనిపించేందుకు సిద్ధం చేస్తూ..
36 అడుగుల అద్దాలతో
గాలిలో ఎగురుతున్నట్లుండే ‘సీహారియర్’ బయటకు కనిపించేందుకు వీలుగా భవనం చుట్టుపక్కల భారీ గాజు గ్లాసులను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఒకవైపు ఫ్రేము ఏర్పాటు చేస్తున్నారు. ఈ విమానం ఒక భారీ గది కన్నా పెద్దదిగా ఉండడంతో అది కనిపించేందుకు వీలుగా ఒక్కో వైపు 36 అడుగుల ఎత్తు గ్లాసులు అమర్చనున్నారు.
రూ.40 కోట్లతో
సమీకృత తీర ప్రాంత ప్రాజెక్టులో భాగంగా సీహారియర్ యుద్ధ విమాన మ్యూజియాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దీని కోసం రూ.40 కోట్లు వెచ్చించాలని నిర్ణయించారు. మ్యూజియంతో పాటు ఫుడ్కోర్టులు, పార్కింగ్ స్థలాలు అభివృద్ధి చేయనున్నారు. గతంలో భూగర్భ పార్కింగ్ నిర్మాణాన్ని ప్రతిపాదించినప్పటికీ వ్యతిరేకత రావడంతో దానిపై వెనక్కి తగ్గారు. కురుసురా జలంతర్గామి, టీయూ-142 యుద్ధ విమానం, సీహారియర్ మ్యూజియం..ఈ మూడింటినీ కలిపి ‘సమీకృత ప్రాజెక్టు’గా తీసుకురావాలనేది లక్ష్యం. త్వరలో మ్యూజియం పూర్తవనున్న నేపథ్యంలో దానికో రూపు తేనున్నారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు పర్యాటకశాఖ, జీవీఎంసీ నిధులు సమకూర్చాలి. ప్రాథమికంగా జరిగే పనులకు మాత్రమే వీఎంఆర్డీఏ నిధులు ఖర్చు చేయాలి. మిగిలిన శాఖలు ఆసక్తి చూపక పోవడంతో వీఎంఆర్డీఏ ప్రస్తుతానికి నిధులు వెచ్చిస్తోంది.
వీక్షకులకు మరపురాని అనుభూతి: సీహారియర్ ప్రదర్శనశాల పనులు తుది దశకు చేరుకున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో యుద్ధ విమానాన్ని పూర్తిస్థాయిలో గాలిలో ఎగిరేలా అమర్చుతాం. దీని నిర్మాణ పనులు వచ్చే నెల పది నాటికి అవుతాయి. ఆ తరువాత మార్చి నెలాఖరు నాటికి విడి భాగాలను ప్రదర్శించే ప్రక్రియ పూర్తిచేస్తాం. దీనికి సంబంధిచిన పనులన్నీ చకచకా జరగుతున్నాయి. ఇది వీక్షకులకు గొప్ప అనుభూతిని ఇవ్వనుంది.
- భవానీశంకర్, ఎస్ఈ, వీఎంఆర్డీఏ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ రాజకీయ నియంత
[ 26-04-2024]
జగన్ రాజకీయ నియంత అని సినీనటుడు పృథ్వీరాజ్ అన్నారు. గురువారం అనకాపల్లి జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణతో కలిసి గాంధీనగరం, అంజయ్య కాలనీల్లో, రాత్రి కొత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
[ 26-04-2024]
రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ వైకాపా నాయకులను హెచ్చరించారు. -
వైకాపా ర్యాలీలో కార్యకర్తల ఘర్షణ
[ 26-04-2024]
తురువోలు సమీపంలో గురువారం సాయంత్రం వైకాపా కార్యకర్తలు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు కొట్టుకోవడంతో రోడ్డున పోయే వారు భయాందోళనకు గురయ్యారు. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
[ 26-04-2024]
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
రాష్ట్రాభివృద్ధే కూటమి ధ్యేయం
[ 26-04-2024]
నర్సీపట్నం తొమ్మిదో వార్డులో మాజీ మంత్రి అయ్యన్న సతీమణి, తెదేపా కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, కోడళ్లు సువర్ణ, దివ్య, జనసేన కౌన్సిలర్ అద్దేపల్లి సౌజన్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. -
పేట వైకాపాకు భారీ షాక్
[ 26-04-2024]
వైకాపాకు భారీ షాక్ తగిలింది. పాయకరావుపేట, నక్కపల్లి మండలానికి చెందిన అనేక మంది గురువారం తెదేపాలో చేరారు. ఇప్పటికే పాయకరావుపేట మండలం పాల్తేరు, పాల్మన్పేట తదితర గ్రామాల నుంచి పెద్దఎత్తున వైకాపా నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తెదేపాలో చేరిన విషయం తెల్సిందే. -
ఎంపీకి 25.. అసెంబ్లీకి 148 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 148 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. -
సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!
[ 26-04-2024]
ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ ఆరోపించారు. -
చెప్పింది ఘనం.. చేసింది శూన్యం
[ 26-04-2024]
రాష్ట్రంలో సులువైన పారిశ్రామిక విధానం ఉంది. పరిశ్రమల స్థాపనకు, వ్యాపార ప్రతిపాదనలతో వచ్చేవారికి అనువైన వాతావరణం కల్పించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. -
ఏడునియోజకవర్గాలకు 147 మంది నామపత్రాల దాఖలు
[ 26-04-2024]
నామపత్రాల స్వీకరణకు చివరి రోజైన గురువారం అసెంబ్లీ నియోజకవర్గాలకు భారీగా నామపత్రాలు దాఖలయ్యాయి. -
ఉక్కులో విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు : సిటూ
[ 26-04-2024]
ఉక్కునగరంలో నివాసం ఉండే కార్మికులపై విద్యుత్తు ఛార్జీల భారం పెంచేలా యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిటూ నాయకులు డిమాండ్ చేశారు. -
ఐదేళ్లూ మాటలే.. జనంతో ఆటలే!!
[ 26-04-2024]
రోడ్లు విస్తరణ, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టకుండా ముక్కుపిండి నగరవాసుల నుంచి పన్నులు వసూళ్లు చేశారు. జి-20 పుణ్యమా అని వచ్చిన నిధులను సైతం నాణ్యత లేకుండా సుందరీకరణ పనుల పేరుతో ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. -
పదో తరగతి ఫీజు 30లోగా చెల్లించాలి
[ 26-04-2024]
ఇటీవల విడుదల అయిన పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు ఏప్రిల్ 30వ తేదీలోపు ఫీజు చెల్లించుకోవచ్చని డీఈఓ ఎల్.చంద్రకళ తెలిపారు. -
న్యాయ కళాశాల విద్యార్థికి గాయాలు
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ న్యాయ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు నాలుగో పట్టణ పోలీస్ కానిస్టేబుల్పై నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలలో 983 మార్కులు
[ 26-04-2024]
తెలంగాణ ఇంటర్మీడియట ఫలితాలలో విశాఖకు చెందిన పూజారి సిద్విని 983 మార్కులు(హెచ్జీపీ) సాధించింది. ఆమె తండ్రి పూజారి రఘుప్రసాద్ ద్వారకా బస్స్టేషన్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. -
ప్రధాన దారులు.. నరకానికి నకళ్లు..
[ 26-04-2024]
సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు అని ప్రచారం చేసుకుంటున్న వైకాపా ప్రభుత్వం ఆ సిద్ధాంతాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో ఘోరంగా విఫలమైంది. జగన్ పాలనలో రాష్ట్రంలోని రోడ్లన్నీ అథోగతి పాలయ్యాయన్నది వాస్తవం. -
పారిశ్రామిక ప్రాంతాలు.. నిర్లక్ష్యానికి నిదర్శనాలు
[ 26-04-2024]
వైకాపా ముఖ్యమంత్రి జగన్ పాలనలో పారిశ్రామిక పురోగతి పూర్తిగా చతికిలపడింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్నవి మూతపడే పరిస్థితి నెలకొంది. -
మట్టి తవ్వకందారులకు వైకాపా అండదండలు..
[ 26-04-2024]
చెరువులు, కొండల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న అక్రమదారులకు వైకాపా ప్రజాప్రతినిధులు పుష్కలంగా అండదండలు అందిస్తున్నారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం