logo

సీఎం నోరు తెరిస్తే అబద్ధాలే!

ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్‌కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ ఆరోపించారు.

Published : 26 Apr 2024 03:35 IST

జనసేనలో చేరిన వైకాపా నాయకులతో సుందరపు విజయ్‌కుమార్‌, శ్రీవేణి

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసగించడంలో జగన్‌కు మించిన నాయకుడు దేశంలోనే లేరని జనసేన అసెంబ్లీ అభ్యర్థి సుందరపు విజయ్‌కుమార్‌ ఆరోపించారు. మడుతూరు, చీమలాపల్లికి చెందిన వైకాపా నాయకులు జనసేన ఉమ్మడి విశాఖ జిల్లా కార్యదర్శి మోటూరు శ్రీవేణి ఆధ్వర్యంలో గురువారం అచ్యుతాపురంలో జనసేన గూటికి చేరారు. వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఆయన మాట్లాడుతూ బాబాయి హత్య కేసులో అడ్డంగా దొరికిపోయి కూడా ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. బాబాయిని హత్య చేశారని సీబీఐ, సొంత చెల్లెల్లే చెబుతుండగా జగన్‌ బుకాయించడానికి ప్రయత్నించడం చూస్తే సిగ్గుగా ఉందన్నారు. వైకాపా పతనం ఎలమంచిలి నుంచి ప్రారంభమవుతుందన్నారు. నీరుకొండ సతీష్‌, బలిరెడ్డి చిన్న శ్రీనివాసరావు, నందారపు నారాయణరావు, యర్రంశెట్టి రాజు, మాసారవపు శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని