జగనన్నా.. చెబుతాం వినుకో!
ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా సీఎంకి తెలిపేలా జగనన్నకు చెబుదాం.. కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1902 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేస్తే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ప్రచారం చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలో సమస్యలపై విన్నపాలు
తాగునీటిని పట్టుకుంటున్న మహిళలు
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే : ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా సీఎంకి తెలిపేలా జగనన్నకు చెబుదాం.. కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 1902 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేస్తే వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ప్రచారం చేస్తున్నారు. పింఛన్ అందలేదనో.. ఇల్లు మంజూరు కాలేదనో వంటి వ్యక్తిగత సమస్యలు సరే.. మరి సామాజిక సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణాన్ని వేధిస్తున్న పలు అంశాలు జగనన్నకు చెబుదాంతోనైనా పరిష్కారం అవుతాయా అని ఎదురుచూస్తున్నారు.
జీవీఎంసీ పరిధిలోని అన్ని జోన్లకు రక్షిత తాగునీటిని కుళాయిల ద్వారా అందిస్తున్నారు. అనకాపల్లి మున్సిపాలిటీని 2012లో జీవీఎంసీలో విలీనం చేశారు. స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని పట్టణవాసులు ఎదురుచూశారు. 2019లో సీఎం జగన్మోహన్రెడ్డి విశాఖపట్నం పర్యటనలో భాగంగా అగనంపూడి నుంచి అనకాపల్లికి పైప్లైన్ ఏర్పాటు వేసిశుద్ధి చేసిన తాగునీటిని అందించేందుకు రూ. 32 కోట్లతో శంకుస్థాపన చేశారు. నాలుగేళ్లవుతున్నా పైప్లైన్ పనులు సగం కూడా పూర్తికాలేదు. ఎప్పటిలాగానే నలకలతో కూడిన తాగునీటిని అనకాపల్లి వాసులు తాగాల్సి వస్తోంది. పైప్లైన్ల పనుల్లో జాప్యం స్థానికులకు శాపంగా మారింది.
సాగునీటి కాలువలు శుభ్రం చేయక ఇబ్బందులు
అనకాపల్లి మండల సాగునీటి అవసరాలు తీర్చే నాగులాపల్లి, చెర్లోపల, ఎల్లయ్య కాలువలపై నిర్లక్ష్యం అలముకుంది. శారదానది నుంచి రైతులకు సాగునీరు అందించేలా కాలువ పూడికతీత పనులను పట్టించుకోవడం లేదు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఒక్కసారి కూడా సాగునీటి కాలువలో పూడికతీత చేపట్టలేదు. జలవనరుల శాఖ ఆధీనంలో ఉన్న కాలువ అనకాపల్లి పట్టణ ప్రాంతం మీదుగా చెర్లోపల ఖండంలోకి చేరుతుంది. పట్టణ పరిధిలో ప్రవహిస్తున్న సాగునీటి కాలువకు పక్కగా నిర్మాణాలు చేపట్టారు. కాలువలను శుభ్రం చేయాల్సిన బాధ్యత జీవీఎంసీపై ఉంది. గతంలో వేసవి కాలంలోనే కాలువ పూడికతీత పనులు చేపట్టారు. కరోనా అనంతరం ఈ పనులు నిలిచిపోయాయి. దీంతో రైతులకు సాగునీరు అందకపోగా పట్టణ వాసులకు దోమల బెడద పెరిగింది.
మూలకు చేరి నాలుగేళ్లు..
ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో సీటీ స్కానింగ్ పరికరం మూలకు చేరింది. గత నాలుగేళ్లగా ఇదే పరిస్థితి నెలకొంది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఈ పరికరాన్ని బాగుచేయించలేదు. దీనికి చెందిన సామాన్లు దొరకడం లేదని దీంతో బాగుచేయించలేక పోతున్నామని వైద్యాధికారులు చెబుతున్నారు. ఆసుపత్రిలో ఎంఆర్ఐ, సీటీ స్కానింగ్ పరికరాన్ని ఏర్పాటు చేస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెబుతూ వచ్చారు. నేటికీ ఇది ఆచరణలోకి రాలేదు. దీంతో స్కానింగ్ చేయించుకోవాల్సిన రోగులు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
అనకాపల్లిలో కంపు కంపు..
ఎక్కడైనా డంపింగ్ యార్డు ఊరికి చివర ఉంటుంది. అనకాపల్లిలో పట్టణ నడిబొడ్డున అదీ జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఆవరణలో చెత్తను నిల్వ చేస్తున్నారు. ఊరంతా తిరిగి సేకరించిన చెత్తను ఇక్కడి నుంచి కాపులుప్పాడ తరలిస్తున్నారు. దీనికి ఏడాదికి సుమారు రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. చెత్తను ఒక్కోసారి రెండు నుంచి మూడు రోజులు ఇక్కడే నిల్వ చేయడంతో పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేలా డంపింగ్ యార్డుకు జనావాసాలకు దూరంగా మారుస్తామని చెప్పినా అమలుకు నోచుకోలేదు.
జీవీఎంసీ కార్యాలయంలోనే డంపింగ్ యార్డు
పేద రోగులకు ఇబ్బందులు
జిల్లా ఆసుపత్రిలో స్కానింగ్ పరికరం గత నాలుగేళ్లుగా పనిచేయడం లేదని ‘జగనన్నకు చెబుదాం’కు కాల్ చేసి చెప్పాం. సరైన స్పందన లేదు. స్కానింగ్ పరికరం అందుబాటులో లేక పేద రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. టోల్ ఫ్రీ నంబరు 1902కి ఫోన్ చేస్తే వివరాలు ఇంకా చెప్పండి అంటున్నారు. నాలుగేళ్లుగా పరికరం పనిచేయడం లేదని, ప్రైవేటుగా స్కానింగ్కి డబ్బులు ఖర్చుచేయాల్సి వస్తోందని చెప్పాం. సమస్య పరిష్కారం అవుతుందని అన్నా ఇంకా కాలేదు.
ఎస్.చినబాబు, తుమ్మపాల
పరిష్కరించామని మాటలే చెబుతున్నారు.
అనకాపల్లి పట్టణం నుంచి ప్రవహిస్తున్న ఎల్లయ్యకాలువలో పూడిక తొలగించక పడుతున్న ఇబ్బందులను ‘జగనన్నకు చెబుదాం’కి కాల్ చేసి చెప్పాం. వివరాలన్నీ అడిగారు. ఈ కాలువ జీవీఎంసీ పరిధిలో ఉందని వారే చేయాలని జలవనరుల శాఖ ఏఈ నుంచి సమాధానం వచ్చింది. సమాధానం సంతృప్తిగా లేదని జగనన్నకు చెబుదాంలో దృష్టికి తీసుకువస్తే తిరిగి ఫిర్యాదు చేయమన్నారు. ఈ సమస్యపై మళ్లీ ఫిర్యాదు చేశాం. నేటికీ పరిష్కారం కాలేదు.
భీశెట్టి కృష్ణ అప్పారావు, అనకాపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చింది.. ఆటో డ్రైవర్లను జగన్ ఆదుకుంటాడని అంతా ఊహించారు. రూ.పది వేల సాయం చేశాడని సంబరపడిపోయారు. ఆటోల మీద పన్నుల బాదుడు మొదలైన తరువాత కొద్ది రోజులకే పరిస్థితి వారికి అర్థమైంది. -
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడాశాఖను నిర్వీర్యం చేసింది. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. -
పేట వైకాపాలో రోజుకో వికెట్
[ 27-04-2024]
వైకాపా నుంచి రోజుకో వికెట్ పడుతోంది. తెదేపాలోకి చేరేందుకు నాయకులు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు శిరోభారం తప్పడం లేదు. -
ఎన్నికల వేళ..‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
విశాఖ లోక్సభ స్థానానికి 33 నామపత్రాల ఆమోదం
[ 27-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి దాఖలైన 39 నామపత్రాల్లో 33 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆమోదించారు. -
‘విశాఖ - మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు. -
ఎంపీ అభ్యర్థుల నామినేషన్లలో 22 ఆమోదం
[ 27-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థుల నామినేషన్లలో మూడింటిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి తిరస్కరించారు. -
జగన్ వాహన మిత్రద్రోహి
[ 27-04-2024]
ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు నడుపుతూ జీవనం సాగించే వారికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిస్తూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన మిత్ర పథకం.. వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. -
అనువుగాని ప్రాంగణం.. ఆడేందుకు అవస్థలు
[ 27-04-2024]
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. -
రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు
[ 27-04-2024]
కూటమి విజయంతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ పేర్కొన్నారు. -
కూటమితోనే అన్ని వర్గాలకు న్యాయం
[ 27-04-2024]
ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని పెందుర్తి తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు ధ్వజమెత్తారు. -
కూటమితోనే బంగారు భవిష్యత్తు
[ 27-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బంగారు భవిష్యత్తు సాధ్యమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
[ 27-04-2024]
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో అనుమానపు బీజం పడింది. -
వైకాపా నాయకులు దోచుకున్న నగదే పంచి పెడుతున్నారు
[ 27-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని భాజపా (కూటమి) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు అన్నారు. -
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి
[ 27-04-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు. -
ఎంవీవీ నామపత్రం ఆమోదంలో ఉత్కంఠ
[ 27-04-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ నామపత్రం ఆమోదించే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
సుప్రభాత సేవ టికెట్ల పునః ప్రారంభం
[ 27-04-2024]
శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. -
డీఎల్ఈడీలో ప్రవేశాలకు ఆహ్వానం
[ 27-04-2024]
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?