అదను చూసి అక్రమ ‘అంతస్తులు’!
ఎన్నికల వేళ జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అదను చూసి వైకాపా నాయకుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులు నిర్మిస్తున్నారు.
ఎన్నికల వేళ అనధికార నిర్మాణాల జోరు
మంత్రి ఆదిమూలపు సురేష్ పేరుతో హడావుడి!
జోన్-4 29వ వార్డు పరిధిలో అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న అదనపు అంతస్తులు
ఎన్నికల వేళ జీవీఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయి. అదను చూసి వైకాపా నాయకుల అండదండలతో నిబంధనలకు విరుద్ధంగా అంతస్తులు నిర్మిస్తున్నారు.
ఎన్నికల విధుల్లో ఉన్నామంటూ పట్టణ ప్రణాళిక అధికారులు కళ్లు మూసుకున్నారు. కొందరు అధికారులు అక్రమార్కులతో జతకట్టి జేబులు నింపేసుకుంటున్నారు. గట్టిగా ఎవరైనా ప్రశ్నిస్తే వైకాపా కార్పొరేటర్లు రంగంలోకి దిగుతున్నారు. నిర్మాణాల వద్దకు ఎవరైనా వెళితే అనుచరగణంతో హడలెత్తిస్తున్నారు
బహిరంగంగానే..
.మద్దిలపాలెంకు చెందిన ఓ భవన నిర్మాణదారు (బిల్డర్) పరిసర ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు చేపడుతూ, పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సిఫారసు చేశారంటూ బహిరంగంగానే చెప్పుకొస్తున్నారు. ప్రణాళిక విభాగంలోని కీలక అధికారికి మధ్యవర్తుల ద్వారా డబ్బులు అందజేసి, యథేచ్ఛగా నిర్మాణాలు చేస్తున్నారు. 23వ వార్డు చైతన్యనగర్ డోర్ నెంబరు 53-20-31లో జరుగుతున్న నిర్మాణానికి సింగిల్ యూనిటగా ప్లాను పొంది, ఏకంగా నాలుగు ఫ్లోర్లు నిర్మించారు. ఒక్కో ఫ్లోర్లో నాలుగు వాణిజ్య, నివాస సముదాయాలుగా విభజించారు. నిర్మాణం జరుగుతున్న సందర్భంగా పోస్ట్ వెరిఫికేషన్ చేయాల్సిన ప్రణాళికాధికారులు కాసులు తీసుకుని, చర్యలు చేపట్టలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రూ.20లక్షలు వరకు ఈ వ్యవహారంలో చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. ఇదే ప్రాంతంలో కనీసం ద్విచక్రవాహనం కూడా వెళ్లని ప్రాంతాల్లో భారీ భవంతులు నిర్మిస్తున్నారు. శివాజీపాలెంలో ఓ భవనంపై అదనపు అంతస్తుకు బేరం కుదరగా, ఇప్పటి వరకు సగం పైకప్పు పూర్తి చేసిన నిర్మాణదారు, త్వరలో మిగతాది ఎన్నికల వేళ హడావుడిగా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మేం బేరం కుదురుస్తాం..: జీవీఎంసీ పట్టణ ప్రణాళికలో వార్డు ప్లానింగ్ సెక్రటరీ నుంచి అన్ని స్థాయిల్లోనూ అవినీతి పెచ్చుమీరింది. అక్రమ నిర్మాణాలను నియంత్రించాల్సిన కొందరు తమ వాటాలను తీసుకోవడమే కాకుండా, మధ్యవర్తిత్వం వహిస్తుండటం గమనార్హం. గత నెల రోజులుగా నగరంలో అక్రమ నిర్మాణాలపై ఎవరైనా వివరాలు అడిగితే.. వాటిని సీఎం పేషీ నుంచి సిఫారసు చేశారని, మున్సిపల్శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారంటూ ప్రశ్నించినవారికి, నిర్మాణదారులకు మధ్య బేరం కుదురుస్తుండటం కొసమెరుపు. ‘మీరు ఫలానా బిల్డరును కలవండి’ అంటూ నేరుగా కొందరు ప్రణాళికాధికారులే చెబుతుండటం కమీషన్ల తీవ్రతకు అద్దం పడుతోంది. జీవీఎంసీ కమిషనర్ ప్రత్యేకంగా అక్రమ నిర్మాణాలపై చర్యలకు బృందాలను ఏర్పాటు చేయగా, వార్డు కార్పొరేటర్లకు, టౌన్ ప్లానింగ్ అధికారులకు డబ్బులు ముట్టజెప్పని వారి భవనాలనే లక్ష్యంగా చేసుకున్నారనే విమర్శలున్నాయి.
రెండంతస్తులు..రూ.1.10కోట్ల నష్టం..
నగరంలోని జోన్-4 పరిధిలోని 29వ వార్డు సెంచురిక్లబ్ సమీపంలోని పాత పల్లవి ఆసుపత్రి రహదారిలో ఓ భారీ భవనం నిర్మిస్తున్నారు. జి+ప్లస్-3 తరహా అనుమతులు తీసుకుని రెండు అంతస్తులు అదనంగా నిర్మిస్తున్నారు. పూర్తిగా నిబంధనలను పక్కనపెట్టి, కనీసం సెట్ బ్యాక్లను విడిచిపెట్టకుండా చేపట్టిన నిర్మాణం వల్ల జీవీఎంసీకి సుమారు రూ.1.10కోట్లు మేర నష్టం వాటిల్లింది. రెండు అదనపు అంతస్తులకు టీడీఆర్ (ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్ రైట్) పత్రాలు కొనుగోలు చేయడానికి వ్యయం చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణానికి వార్డు సచివాలయానికి 100 మీటర్ల దూరంలోపే ఉంది. కళ్ల ముందే అక్రమ నిర్మాణం జరుగుతున్నా, వార్డు ప్లానింగ్ కార్యదర్శి పట్టించుకోకపోవడం, నిర్మాణ విషయాన్ని అధికారులకు తెలియజేయకపోవడం గమనార్హం. సంబంధిత భవన నిర్మాణ వివరాలు తెలియజేయాలని వార్డు ప్రణాళిక కార్యదర్శిని కోరగా, వివరాలు అధికారులు గోప్యంగా ఉంచాలని సూచించారని, ఎవరికీ సమాచారం ఇవ్వవద్దని పేర్కొనడం విశేషం. దీనిపై సహాయ ప్రణాళికాధికారిణిని వివరణ కోరగా.. ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. నిర్మాణం వ్యవహారంలో ప్రణాళిక కార్యదర్శి కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారినట్లు సమాచారం. ప్లానింగ్ కార్యదర్శి నుంచి ఉన్నత స్థాయి వరకు నిధులు వెళ్లినట్లు సమాచారం. భవన నిర్మాణం పూర్తయిన తరువాత పార్కింగ్కు ఇబ్బందులు కలిగే అవకాశాలున్నా నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చింది.. ఆటో డ్రైవర్లను జగన్ ఆదుకుంటాడని అంతా ఊహించారు. రూ.పది వేల సాయం చేశాడని సంబరపడిపోయారు. ఆటోల మీద పన్నుల బాదుడు మొదలైన తరువాత కొద్ది రోజులకే పరిస్థితి వారికి అర్థమైంది. -
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
[ 27-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడాశాఖను నిర్వీర్యం చేసింది. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. -
పేట వైకాపాలో రోజుకో వికెట్
[ 27-04-2024]
వైకాపా నుంచి రోజుకో వికెట్ పడుతోంది. తెదేపాలోకి చేరేందుకు నాయకులు క్యూ కడుతుండటంతో ఆ పార్టీ నాయకులకు శిరోభారం తప్పడం లేదు. -
ఎన్నికల వేళ..‘కూపన్ల’ ఎర..!
[ 27-04-2024]
ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. -
విశాఖ లోక్సభ స్థానానికి 33 నామపత్రాల ఆమోదం
[ 27-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి దాఖలైన 39 నామపత్రాల్లో 33 నామపత్రాలను రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ), కలెక్టర్ ఎ.మల్లికార్జున ఆమోదించారు. -
‘విశాఖ - మలేసియా’ విమాన సర్వీసు ప్రారంభం
[ 27-04-2024]
విమాన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తామని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.రాజారెడ్డి తెలిపారు. -
ఎంపీ అభ్యర్థుల నామినేషన్లలో 22 ఆమోదం
[ 27-04-2024]
అనకాపల్లి ఎంపీ స్థానానికి 25 మంది అభ్యర్థుల నామినేషన్లలో మూడింటిని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రవి తిరస్కరించారు. -
జగన్ వాహన మిత్రద్రోహి
[ 27-04-2024]
ఆటోలు, టాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు నడుపుతూ జీవనం సాగించే వారికి ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటిస్తూ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వాహన మిత్ర పథకం.. వాహన చోదకుల పాలిట శాపంగా మారింది. -
అనువుగాని ప్రాంగణం.. ఆడేందుకు అవస్థలు
[ 27-04-2024]
క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయి. నేటి సమాజంలో పిల్లల నుంచి పెద్దల వరకు క్రీడలను జీవనశైలిలో భాగం చేసుకోవాలని వైద్యులు సైతం చెబుతున్నారు. -
రాష్ట్రానికి త్వరలోనే మంచి రోజులు
[ 27-04-2024]
కూటమి విజయంతోనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కూటమి అభ్యర్థి సుందరపు విజయ్కుమార్ పేర్కొన్నారు. -
కూటమితోనే అన్ని వర్గాలకు న్యాయం
[ 27-04-2024]
ఒక్క అవకాశమంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి చివరికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశారని పెందుర్తి తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి పంచకర్ల రమేశ్బాబు ధ్వజమెత్తారు. -
కూటమితోనే బంగారు భవిష్యత్తు
[ 27-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే బంగారు భవిష్యత్తు సాధ్యమని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు. -
అనుమానం పెనుభూతమై..
[ 27-04-2024]
కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించే కుటుంబంలో అనుమానపు బీజం పడింది. -
వైకాపా నాయకులు దోచుకున్న నగదే పంచి పెడుతున్నారు
[ 27-04-2024]
విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైకాపా నాయకులు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారని, దాన్ని ప్రజలు తిప్పికొట్టాలని భాజపా (కూటమి) అభ్యర్థి పి.విష్ణుకుమార్రాజు అన్నారు. -
జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి
[ 27-04-2024]
వైకాపా పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండిబాబ్జీ అన్నారు. -
ఎంవీవీ నామపత్రం ఆమోదంలో ఉత్కంఠ
[ 27-04-2024]
విశాఖ తూర్పు నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ నామపత్రం ఆమోదించే విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
సుప్రభాత సేవ టికెట్ల పునః ప్రారంభం
[ 27-04-2024]
శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని రద్దు చేసిన సుప్రభాత సేవ, ఉదయం, సాయంత్రం ఆరాధన సేవల టికెట్లను శుక్రవారం నుంచి పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. -
డీఎల్ఈడీలో ప్రవేశాలకు ఆహ్వానం
[ 27-04-2024]
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్ఈడీ)లో ప్రవేశాల కోసం మే 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. -
పింఛనుదారులకు జగన్ వంచన
[ 27-04-2024]
మలివయసులో కృష్ణా, రామా అనుకుంటూ ప్రశాంతంగా గడపాల్సిన పింఛన్దారులకు హక్కుగా రావాల్సిన భత్యాలతోపాటు పెన్షన్ సొమ్ములూ సకాలంలో ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారు. -
పరిశోధనల సిరికి జగన్ ఉరి
[ 27-04-2024]
వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉంటారు. వాటిలో కొన్ని విజయవంతం అవుతుంటాయి. అవి రైతుల దరికి చేరితే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడం వీలవుతుంది. -
శ్రీకాకుళం రోడ్- తిరుపతి ప్రత్యేక రైళ్లు
[ 27-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పలు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్