‘గొడ్డలి తిరగేసి రెండు సార్లు కొట్టా.. అనుమానంతో పెట్రోల్ పోసి నిప్పంటించా’
ఈ ఏడాది జనవరి 10న అర్ధరాత్రి దాటిన తర్వాత తెర్లాం మండలంలోని రాజయ్యపేటలో మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న గాడి గౌరమ్మ(67) సజీవ దహనమైంది. ఆమె అగ్నిప్రమాదంలో మృతి చెందిందని పోలీసులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు, గ్రామ
పోలీసుల అదుపులో సింహాచలం
తెర్లాం(విజయనగరం), న్యూస్టుడే: ఈ ఏడాది జనవరి 10న అర్ధరాత్రి దాటిన తర్వాత తెర్లాం మండలంలోని రాజయ్యపేటలో మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న గాడి గౌరమ్మ(67) సజీవ దహనమైంది. ఆమె అగ్నిప్రమాదంలో మృతి చెందిందని పోలీసులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కూడా ఆ విషయం మర్చిపోయారు.
సరిగా రెండు నెలలకు.. గౌరమ్మ ప్రమాదవశాత్తు కాలిపోలేదని, తానే హత్య చేసి చంపేశానంటూ అదే గ్రామానికి చెందిన ఆర్.సింహాచలం అనే యువకుడు పోలీసుల ఎదుట మంగళవారం లొంగిపోవడం చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి బొబ్బిలి సీఐ శోభన్బాబు, ఎస్ఐ సురేంద్రనాయుడు విచారించారు. ఈ సమయంలో సింహాచలం చెప్పిన వివరాలిలా ఉన్నాయి.
‘నాలుగేళ్ల క్రితం నా భార్య, పిల్లలకు గౌరమ్మ చేతబడి చేయడంతో అనారోగ్యం పాలయ్యారు. దీంతో భార్య పిల్లలతో సహా తన ఇంటికి వెళ్లిపోయింది. గత ఏడాది దసరాకు ముందు నా తండ్రికి చేతబడి చేయడంతో అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో గౌరమ్మను ఎలాగైనా చంపాలనుకున్నా.. పగలే హత్య చేసి పోలీసులకు లొంగిపోవాలి అనుకున్నా. జనవరి 10న ఓ ఇంటి నుంచి గొడ్డలి, పెట్రోల్ తీసుకొని అర్ధరాత్రి దాటిన తర్వాత గౌరమ్మ ఇంటికి వెళ్లా. నిద్రిస్తున్న ఆమె మెడపై గొడ్డలి తిరగేసి రెండు సార్లు బలంగా కొట్టాను. ఇంకా బతికే ఉందేమోనన్న అనుమానంతో పెట్రోల్ పోసి నిప్పంటించాను. చేతబడి చేసిందని తప్ప వేరే ఉద్దేశంతో చేయలేద’ని నిందితుడు తెలిపాడు.
ఎందుకు లొంగిపోయాడంటే..
ఈ నెల 13న అర్ధరాత్రి గ్రామంలోని పాతినవలస కనకరాజుకు చెందిన పశువులశాల కాలిపోయింది. ఆ సమయంలో సింహాచలం అటుగా వెళ్లడం గమనించిన బాధితులు ఆయన ఇంటికి వెళ్లి నిలదీశారు. పశువులశాలను తాను కాల్చలేదని, గౌరమ్మను కాల్చానని చెప్పడంతో అందరూ భయంతో పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడే తప్పు ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి, రిమాండ్ నిమిత్తం బొబ్బిలి ఏజేఎఫ్సీఎం కోర్టుకు తరలించినట్లు సీఐ శోభన్బాబు చెప్పారు.
గౌరమ్మ (పాతచిత్రం)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భూచోడి సర్వే మాయ
[ 06-05-2024]
అన్నదాతలకు మేలు చేకూర్చేదిగా జగన్ చెబుతున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాయ వెనుక అసలు కథకు మూలం.. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ఉద్దేశించిందన్న రీసర్వే. ఉమ్మడి జిల్లాలో 2020 డిసెంబరులో ఈ పన్నాగానికి తెరలేపారు. -
కర్కశ పాలనలో రక్కసి రోడ్లు
[ 06-05-2024]
ఎన్నికలకు ముందు దారులేస్తామని మాటిచ్చిన పాలకులు.. అధికారంలోకి రాగానే వారి జగనన్న పాలనను చూసి.. అన్నీ వదిలేశారు.. అభివృద్ధి మాటే మరిచారు. ప్రజాందోళనలతో కొన్నిచోట్ల పనులు ప్రారంభించేందుకు అధికారులు ముందుకు రాగా.. -
పునరావాసంలో జగన్మోసం
[ 06-05-2024]
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన నిర్వాసితుల బాగోగులు పాలకులకు పట్టడం లేదు. పుట్టినగడ్డ నుంచి పునరావాస కాలనీలకు తరలించినా.. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదు. -
ఆశలు అడియాసలు చేశావ్ జగనన్న
[ 06-05-2024]
ఆశలు అడియాసలు చేశావ్ జగనన్న -
జగన్ మళ్లీ వస్తే మీ భూములు మాయం
[ 06-05-2024]
జగన్కు మరొక అవకాశం ఇస్తే భూములన్నీ మాయమవుతాయని, ప్రజల ఆస్తులు, పత్రాలు ఆయన దగ్గరే పెట్టుకుంటారని కేంద్ర మాజీ మంత్రి, తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు ఆరోపించారు. -
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్
[ 06-05-2024]
జిల్లా వ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా జరిగింది. విజయనగరం, గజపతినగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, బొబ్బిలి, రాజాం, ఎస్.కోట నియోజకవర్గ కేంద్రాల్లో ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
రాక్షస పాలన వారంలో ముగుస్తుంది
[ 06-05-2024]
రానున్న మరో వారం రోజుల్లో రాక్షస పాలన ముగుస్తుందని, ప్రజలంతా ఓటు అనే బలమైన ఆయుధంతో గద్దె దింపుతారని మాజీ మంత్రి, చీపురుపల్లి ఎన్డీయే కూటమి అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. -
చేనేత కార్మికులకు తెదేపాతోనే భవిత
[ 06-05-2024]
చేనేత కార్మిక కుటుంబాలకు కూటమి అండగా ఉంటుందని రాజాం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ అన్నారు. పట్టణానికి చెందిన చేనేత కార్మికుల నాయకుడు నల్లశ్రీను ఆధ్వర్యంలో లచ్చయ్యపేట, -
ఇండియా కూటమితోనే గిరిజనులకు న్యాయం
[ 06-05-2024]
నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సీపీఎంకు గిరిజన సమస్యలు తెలుసునని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారట్ పేర్కొన్నారు. -
ప్రజల ఆస్తులు కొల్లగొట్టేందుకు టైటిలింగ్ చట్టం
[ 06-05-2024]
ల్యాండ్ టైటిలింగ్ చట్టం ముసుగులో పట్టపగలు దోపిడీకి జగన్మోహన్రెడ్డి తెరలేపారని మాజీ ఎంపీ, అరకు కూటమి ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత విమర్శించారు.