అనుమతి ఒక చోట.. తరగతులు ఇంకోచోట..!
ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒకచోట అనుమతి పొంది...వేరేచోట తరగతుల్ని నిర్వహిస్తున్నాయి. ఇంటర్మీడియేట్ బోర్డు నిబంధనలు పాటించకపోయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు రేగుతున్నాయి.
ఇంటర్లో ప్రైవేటు జూనియర్ కళాశాలల పరిస్థితి
విజయనగరం విద్యావిభాగం, న్యూస్టుడే: ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒకచోట అనుమతి పొంది...వేరేచోట తరగతుల్ని నిర్వహిస్తున్నాయి. ఇంటర్మీడియేట్ బోర్డు నిబంధనలు పాటించకపోయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు రేగుతున్నాయి. కళాశాలల వైఖరి వల్ల మరోవైపు ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇలాంటి కళాశాలలు 11 వరకూ ఉన్నాయని గుర్తించిన బోర్డు అధికారులు నోటీసులు జారీచేసినట్లు ధ్రువీకరించారు.
మండలం దాటి..: విజయనగరం, గరివిడి, చీపురుపల్లి, ఎస్.కోట, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఇలా నిబంధనలు పాటించకపోవడంతో నోటీసులు అందుకున్న కళాశాలలు చాలానే ఉన్నాయి. ఎక్కువగా జిల్లా కేంద్రమైన విజయనగరంలోనే ఉండడం గమనార్హం. గరివిడిలో అనుమతి పొందిన ఓ కళాశాల చీపురుపల్లి శివరాం కూడలిలో నిర్వహిస్తున్నట్లు నోటీసు జారీతో వెలుగులోకి వచ్చింది. విజయనగరం లంకవీధిలో నిర్వహించిన ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల రెండుసార్లు పేర్లు మార్చుకొంది. ప్రస్తుతం అకాడమీగా నాయుడుతోటలో కొనసాగుతోంది. కె.ఎల్.పురంలో అనుమతి పొందిన మరొకటి ధనలక్ష్మి కాలనీ, నాయుడు కాలనీలో అనుమతిపొందినది తోటపాలెంలో తరగతుల్ని నిర్వహిస్తోంది. ఇటువంటి వాటికి నోటీసులు జారీచేశామని ఇంటర్మీడియేట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి సత్యనారాయణ ‘న్యూస్టుడే’కు తెలిపారు. తరలింపు అనుమతుల కోసం నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని సమాధానమిచ్చారు.
నిబంధనలు ఇలా...:
* ప్రభుత్వం కళాశాల మంజూరు చేసిన ఉత్తర్వు ఇవ్వాలి.
* అనుబంధ గుర్తింపు పొందిన పత్రం అందజేయాలి.
* కార్పస్ఫండ్ కాపీని ఇవ్వాలి.
* కళాశాలను తరలించేందుకు కారణాలు సూచిస్తూ కళాశాల గవర్నింగ్ బాడీ తీర్మానం ఉండాలి.
* తరలించేందుకు ఒక కళాశాలకు తనిఖీ నిమిత్తం రుసుం రూ.27 వేలు చెల్లించాలి. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10,500 ప్రభుత్వానికి చెల్లించాలి.
* భూమి, భవనాలకు సంబంధించిన రిజిస్టర్డ్ ప్రణాళిక ఉండాలి.
* మెడికల్ అధికారి జారీచేసిన శానిటరీ ధ్రువపత్రం, నిరభ్యంతర ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాలి.
* విజయనగరంలోని శ్రీరాంనగర్ కాలనీలో అనుమతి పొందిన ఓ ప్రైవేటు జూనియర్ కళాశాల నగరానికి నడిబొడ్డున పదేళ్లకు పైగా నడుస్తోంది. రోడ్లు విస్తరణ నేపథ్యంలో కళాశాలను ఆరేళ్ల కిందట సమీపంలోని వేరే చోటికి తరలించారు. బోర్డు నిబంధనల ప్రకారం తగిన రుసుం చెల్లించి, ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. ఇవేవీ చేయకపోవడంతో తాజాగా ఈ ఏడాదీ ఆ కళాశాలకు ఇంటర్మీడియేట్ బోర్డు నోటీసు జారీ చేసింది.
* విజయనగరం పీఎస్ఆర్ కాంప్లెక్స్లో అనుమతిపొందిన రెండు ప్రైవేటు జూనియర్ కళాశాలలు ప్రస్తుతం తోటపాలెం, రింగురోడ్డులో తరగతులు నిర్వహిస్తున్నాయి. అయిదేళ్లకుపైగా కొనసాగుతున్నాయి. ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించకపోవడంతో వాటికి నోటీసులు జారీ అయ్యాయి.
* పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం బైపాస్కాలనీలో ఉండాల్సిన ఒక కళాశాల ఉన్న చోట కాకుండా వేరే చోట తరగతుల్ని నిర్వహిస్తోంది. ఎస్.కోట విశాఖరోడ్లో నిర్వహించాల్సిన ఓ కళాశాల గాయత్రినగర్లో తరగతులు కొనసాగిస్తుండటం గమనార్హం.
* చీపురుపల్లిలో ఓ కళాశాల కాంప్లెక్స్ పరిసరాల్లో అనుమతి పొంది, శివరాంరోడ్డులో కొనసాగుతోంది. అదే ప్రాంతంలో అనుమతి పొందిన ఇంకో కళాశాల వేరోచోట తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబుతో రాష్ట్రం అభివృద్ధి సాధ్యం
[ 05-05-2024]
చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని సాలూరు నియోజకవర్గ తెదేపా ఉమ్మడి అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. -
నిజం చెప్పటమే నేరమా..? 572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
[ 05-05-2024]
ఉపాధ్యాయులు నిజం చెప్పడమే రాష్ట్రంలో నేరమైంది. అడ్డదారులు తొక్కకుండా తమ పాఠశాలల్లో సమస్యలను నమోదు చేసిన ఉపాధ్యాయులకు రాష్ట్ర ఉన్నతాధికారులు నోటీసులు పంపించడం చర్చనీయాంశమైంది. -
జనసేనలోకి చేరికలు
[ 05-05-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధోగతి పాల్జేశారని పాలకొండ కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు. -
జనం భూముల్లో జగన్ భూతం
[ 05-05-2024]
విజయనగరం జిల్లా గజపతినగరం మండలం మరుపల్లికి చెందిన ఈశ్వరరావుకు నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. రెవెన్యూ అధికారులు జారీ చేసిన పాస్బుక్, టైటిల్ పత్రాలు తన వద్దే ఉన్నాయి. -
నేటి నుంచి పోస్టల్ బ్యాలెట్
[ 05-05-2024]
జిల్లా వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గ కేంద్రాల్లో ఆదివారం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ప్రారంభంకానుంది. -
‘అమ్మేసిన స్థలంలో వైకాపా కార్యాలయమా?’
[ 05-05-2024]
విజయనగరం ఎమ్మెల్యే, ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి ఆక్రమణలతో పాటు ఆయన వద్ద స్థలాలు కొనుక్కున్నవారినీ వేధిస్తున్నారని వైకాపా నేత కాళ్ల గౌరీశంకర్ ఆరోపించారు -
40 ఏళ్ల నాటి ప్లాట్లు మాయం
[ 05-05-2024]
విజయనగరం జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇప్పటికే పెద్దఎత్తున చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
ఆగు..ఆగు..దేవుడి మాన్యం డబ్బులేవీ?
[ 05-05-2024]
అధికారం.. ఆపై ఎమ్మెల్యే.. ఇంకేముందు ఎక్కడ భూములు కనిపించినా కొనేస్తున్నారు బొత్స అప్పలనర్సయ్య. ఈ క్రమంలోనే దత్తిరాజేరు మండలం కె.కొత్తవలసలో దేవుడి మాన్యం కొన్నారు. -
అవ్వాతాతలతో సర్కారు చెలగాటం
[ 05-05-2024]
సామాజిక పింఛను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్లను జమ చేసి వైకాపా ప్రభుత్వం అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. -
జనం భూమిలో.. జగన్ చిచ్చు
[ 05-05-2024]
వైకాపా సర్కార్ కుట్రపూరితంగా తీసుకొస్తున్న ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం (టైటిలింగ్ యాక్ట్-2022) ప్రజల భూముల పాలిటి ముప్పులా మారింది. -
తెదేపా విజయం ఖాయం
[ 05-05-2024]
రానున్న ఎన్నికల్లో తెదేపా విజయం ఖాయమని గజపతినగరం నియోజకవర్గ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
-
హంతకులకు అడ్రస్ చెప్పిన ఇన్స్టా పోస్టు.. మోడల్ హత్యలో కీలక విషయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నమిత.. మమితగా మారిందిలా.. ‘ప్రేమలు’ హీరోయిన్ పేరు వెనుక కథేంటంటే?
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో