Pushpa: కేశవుడు మనోడే.. మచ్చా!
పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. థియేటర్లలో ఈలలు, గోలలతో సందడి చేస్తోంది.. హీరో అల్లు అర్జున్ ఓ రేంజ్లో నటనని పండించారు.. ఆయన పక్కనే ఎప్పుడూ మచ్చా.. మచ్చా.. అంటూ ఉండే కేశవ ఎవరో కాదు
చిన్నకొడెపాక నుంచి సినిమాల వైపు..
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి
పుష్ప సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. థియేటర్లలో ఈలలు, గోలలతో సందడి చేస్తోంది.. హీరో అల్లు అర్జున్ ఓ రేంజ్లో నటనని పండించారు.. ఆయన పక్కనే ఎప్పుడూ మచ్చా.. మచ్చా.. అంటూ ఉండే కేశవ ఎవరో కాదు మనోడే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నకొడెపాకకు చెందిన బండారి జగదీశ్ ప్రతాప్. అనతి కాలంలో వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని స్టార్ హీరో పక్కన నటించి మంచి మార్కులు కొట్టేశాడు.
పుష్ప సినిమా షూటింగ్లో..
జగదీశ్ ప్రతాప్ తల్లిదండ్రులు బండారి చంద్రమౌళి-లలిత, అక్క ఝాన్సీరచన, చెల్లెలు దివ్య.. నాన్న పోస్ట్మాన్, అమ్మ ఇంటిపనితో పాటు వ్యవసాయ పనులు చూసుకుంటున్నారు. 1 నుంచి ఆరో తరగతి వరకు చిన్నకొడెపాకలో, ఇంటర్, డిగ్రీ(బీఎస్సీ పౌల్ట్రీ సైన్స్) హనుమకొండలో పూర్తి చేశారు. 2013లో డిగ్రీ పూర్తయింది. నటనపై ఉన్న మమకారంతో చిన్నచిన్న ప్రయత్నాలు మొదలెట్టారు. లఘు చిత్రాలకు దర్శకత్వం వహించేవారు.. ఇంటి వద్ద అమ్మతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లడం, ఖాళీ దొరికితే హనుమకొండ, వరంగల్కు వచ్చి సినిమాల్లో అవకాశాలు కోసం ప్రయత్నాలు చేశారు. ‘నిరుద్యోగ నటులు’ అనే వెబ్సిరీస్లో నటించి అందరి మన్ననలు పొందారు. తర్వాత ‘మల్లేశం’ సినిమాలో అవకాశం దక్కించుకున్నారు. తర్వాత పలాస 1978, జార్జిరెడ్డి, ఊరికి ఉత్తరాన సినిమాల్లో అవకాశం దక్కడంతో నటనలో తన మార్కు నిరూపించుకున్నారు.. కొత్తపోరడు, గాడ్స్ ఆఫ్ ధర్మపురి వెబ్ సిరీస్లో కూడా మెరిశారు. కడప యాసలో మాట్లాడి మెప్పించారు. ఆ యాసతోనే పుష్పలో అవకాశం దక్కింది.
ఇంట్లో ఇష్టం లేకున్నా..
సినిమాలు, నటన అని తిరుగుతుంటే ఇంట్లో వారు ఒప్పుకోలేదు. ఏదైనా సాధించాలనే తపనతో ప్రయత్నాలు చేశారు. తండ్రి చంద్రమౌళి చిందు యక్షగానం, నాటకాలు వేసేవారు. చిన్నప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలని తండ్రి ప్రోత్సహించారు. తండ్రి.. ప్రతాప్ను పోలీసుగా చూడాలని భావించి, కోచింగ్ సెంటర్లో చేర్పించారు. అయినా సినిమాలవైపే అడుగులు వేశారు.
అవకాశం వచ్చిందిలా..
పుష్ప కోసం మొదటిసారి ఆడిషన్ ఇచ్చి మెప్పించారు. 2019 డిసెంబర్లో రెండో ఆడిషన్లో డైరెక్టర్ సుకుమార్తో ఆరు గంటల పాటు ఆడిషన్ ఇచ్చి ఆయనను ఆకట్టుకున్నారు. కేశవ పాత్ర కోసం చిత్తూరు యాసలో మాట్లాడి అవకాశం దక్కించుకున్నారు. వారం రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్న తర్వాత హైదరాబాద్లోని రోడ్డు ప్రమాదంలో ప్రతాప్ తీవ్రంగా గాయపడగా చేయి విరిగింది. దీంతో ఇంత పెద్ద అవకాశం చేజారుతుందోమోనని భయపడ్డారు. చిత్ర యూనిట్కు సమాచారం ఇచ్చారు. అంతలోనే కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కొంతకాలం షూటింగ్ నిలిపివేశారు. ఆ తర్వాత కొనసాగిన షెడ్యూల్లో పాల్గొన్నారు.
కొత్త జీవితాన్ని ఇచ్చింది.. : బండారి జగదీశ్ ప్రతాప్(కేశవ)
అల్లు అర్జున్తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నా. నాకు మంచి పాత్ర లభించింది. పుష్ప కొత్త జీవితాన్ని ఇచ్చింది. ఊహ తెలిసినప్పటి నుంచి సినిమాలో చేయాలనే ఆలోచన ఉండేది. ఆ దిశగానే ప్రయత్నాలు చేశాను. దర్శకుడు సుకుమార్ నాకు జీవితంపై నమ్మకం కల్పించారు. అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం పుష్ప-2పై దృష్టి పెట్టాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు. -
గ్రేటర్ చుట్టూ రాజకీయం..!
[ 27-04-2024]
ఓవైపు వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచార హోరు.. మరోవైపు శుక్రవారం రాత్రి ఖిలావరంగల్ కోటలో కాంగ్రెస్, భారాస కార్పొరేటర్లు రహస్య సమావేశం. -
ఆమోదం 73 మంది.. తిరస్కరణ 15 మంది..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల పరిశీలన పూర్తయింది. వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాలకు జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 88 మంది 145 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు
[ 27-04-2024]
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బల్దియా పాలకులు చెబుతున్నారు. ఏడాదికోసారి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇచ్చే రేడియం స్టిక్కర్ ఉన్న ఆప్రాన్లు ఇవ్వడం లేదు. -
నకిలీ వైద్య కేంద్రాల్లో వైద్యమండలి తనిఖీలు
[ 27-04-2024]
హనుమకొండ జిల్లాలోని నకిలీ వైద్య కేంద్రాల్లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి రాష్ట్ర వైద్యమండలి సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ ఛైర్మన్ డాక్టర్ వి.నరేష్కుమార్ తెలిపారు. -
భానుడు భగభగ.. ప్రయాణికులు విలవిల
[ 27-04-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. దాదాపు 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చిన పలువురు ఎండ ధాటికి విలవిలలాడారు. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్చంద్ సంబంధిత అధికారులకు సూచించారు. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే అభివృద్ధి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనసును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగలాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తి గాంచిన భద్రాచలం రాములోరి ఆలయం. -
చాడా.. తొలి పోటీలోనే తిరుగులేని విజయం
[ 27-04-2024]
హనుమకొండకు చెందిన చాడా సురేష్రెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. బీఏ డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990 దశకంలో ప్రముఖ గుత్తేదారుగా గుర్తింపు కలిగి ఉన్నారు. -
ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలపై అధికారుల ఉదాసీనత
[ 27-04-2024]
జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు, గ్రామాల్లో క్లినిక్లు నిర్వహిస్తున్న వైద్యులు, ఆర్ఎంపీల ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేపట్టడానికి ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. -
కరవు కోరలు.. పశుగ్రాసానికి తంటాలు!
[ 27-04-2024]
వర్షాలు సరిగా లేక పంటలు వేసినా చాలా వరకు చేతికందలేదు.. దీంతో రైతన్నలు పశుగ్రాసానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మోరంచవాగుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది -
కక్షిదారులకు ఈ-న్యాయ సేవలు
[ 27-04-2024]
వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
పోలు చిట్టీలొచ్చాయ్..!
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు పోల్ చిట్టీలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
అనుమతి లేకుండా ల్యాబ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు
[ 27-04-2024]
అనుమతి, అర్హతలు లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి కళావతిబాయి హెచ్చరించారు. -
వంతెనల నిర్మాణాల్లో తేలిపోతున్న నాణ్యత లోపాలు..
[ 27-04-2024]
దశాబ్దాల పాటు మన్నికగా ఉండాల్సిన వంతెనలు ఉన్నఫలంగా కూలిపోతున్నాయి. ప్రజల రవాణా కష్టాలను మెరుగు పర్చేందుకు నిర్మిస్తున్న వారధుల జీవితకాలం కొద్ది రోజుల్లోనే ముగుస్తోంది. -
రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
[ 27-04-2024]
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు