వ్యాధుల కాలం.. సేవలు కనం
జిల్లా వ్యాప్తంగా జ్వర బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వర్షాలతో నీటి నిల్వలు పెరిగి దోమలు, ఈగలు వృద్ధిచెందుతున్నాయి. ప్రజలు జ్వరాల బారిన పడి ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు, రోగుల ఇబ్బందులపై శుక్రవారం ‘న్యూస్టుడే’ పరిశీలించింది. పలు ఆరోగ్య కేంద్రాల్లో మందులు
మహబూబాబాద్, న్యూస్టుడే:
జిల్లా వ్యాప్తంగా జ్వర బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వర్షాలతో నీటి నిల్వలు పెరిగి దోమలు, ఈగలు వృద్ధిచెందుతున్నాయి. ప్రజలు జ్వరాల బారిన పడి ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు, రోగుల ఇబ్బందులపై శుక్రవారం ‘న్యూస్టుడే’ పరిశీలించింది. పలు ఆరోగ్య కేంద్రాల్లో మందులు, సిబ్బంది, సౌకర్యాల కొరత కనిపించింది. ఆసుపత్రులలో జ్వరబాధితులకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించి మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది.
అరకొర వైద్యం
టీకా వేస్తున్న ఏఎన్ఎం
దంతాలపల్లి: దంతాలపల్లి పీహెచ్సీలో వైద్య సేవలు అరకొరగా అందుతున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. ఇద్దరు వైద్యులకు కేవలం ఒక్కరే ఉన్నారు. మరొకరిని తాత్కాలింగా కేటాయించారు. శుక్రవారం ఇద్దరు వైద్యులు విధులకు హాజరుకాలేదు. స్టాఫ్నర్సులు, ఏఎన్ఎంలే సేవలందించారు. సుమారు 15 మంది రోగులు వచ్చారు. వైద్యురాలిని కేటాయించినట్లయితే గర్భిణులకు అనువుగా ఉంటుందని మహిళలు కోరుతున్నారు. మాస్కులు, పీపీఈ కిట్లు, మందుల కొరత ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. వైద్యాధికారి వేదకిరణ్తో మాట్లాడగా జిల్లా కేంద్రంలో సమావేశం ఉన్నందున పీహెచ్సీకి రాలేకపోయినట్లు చెప్పారు.
తెరచుకోని ఉపకేంద్రం
పెద్దవంగర: మండల కేంద్రంలోని ఆరోగ్య ఉపకేంద్రానికి ఉదయం నుంచి సాయంత్రం వరకు తాళం వేసి ఉంది. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండి దుర్వాసన వస్తోంది. ప్రహరీ లేకపోవడంతో వీధికుక్కలు, పాములు సంచరిస్తున్నాయని, మూడు రోజులుగా కేంద్రాన్ని తెరవడం లేదని స్థానికులు చెప్పారు. ఏఎన్ఎం హరితను వివరణ కోరగా.. డివిజన్ కేంద్రంలోని పీహెచ్సీలో మీటింగ్కు వెళ్లామని, ఇంటింటా జ్వర సర్వేలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
సదుపాయాలు లేక ఇబ్బందులు
రోగులకు సూచనలిస్తున్న వైద్యులు
తొర్రూరు టౌన్: తొర్రూరులో ప్రభుత్వాసుపత్రి లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అత్యవసర, మెరుగైన వైద్యంకోసం పట్టణాలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. శుక్రవారం స్థానిక ఆసుపత్రిని పరిశీలించగా వైద్యుల కొరత ప్రధానంగా కన్పించింది. డాక్టర్ పోస్టులు 5 ఖాళీగా ఉన్నాయి. డాక్టర్ మీరజ్తో పాటు ఇటీవల పల్లె దవాఖానాకు నియమించిన నలుగురు వైద్యులతో వైద్యం కొనసాగిస్తున్నారు. మందుల కొరత లేదన్నారు.
సమయపాలన పాటించక నిరీక్షణ
గార్ల: గార్ల సీహెచ్సీలో వైద్యాధికారి శుక్రవారం రెండు గంటలు ఆలస్యంగా వచ్చారు. వైద్యాధికారి వచ్చేదాకా స్టాఫ్నర్సు వైద్యపరీక్షలు నిర్వహించారు. 66మంది వైద్యం కోసం రాగా 10 మందికి జ్వరాలు, ఆరుగురు విరేచనాలతో బాధపడుతూ చికిత్సపొందారు. ముల్కనూరు పీహెచ్సీలో 56 మందికి వైద్యసేవలందించారు. ముగ్గురికి జ్వరాలు, నలుగురు కుక్కకాటుతో వైద్యసహాయం పొందారు.
మందులు అంతంత మాత్రమే..
డోర్నకల్: డోర్నకల్లోని పీహెచ్సీలో ఓపీ 70-90 మధ్య ఉంటుంది. శుక్రవారం మలేరియా, టైఫాయిడ్, డెంగీ లక్షణాలతో కూడిన రోగులెవరూ రాలేదు. యాంటీబయాటిక్ ఇంజక్షన్లు లేవు. అరకొర మందులే అందుబాటులో ఉన్నాయి. మూడు నెలల నుంచి బెటాడిన్ ఆయింట్మెంటు సరఫరా నిలిచింది. బయట మార్కెట్లో కొనుగోలు చేసుకోవాల్సిందే. లేకపోతే మహబూబాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో పొందేలా సిఫారసు చేస్తున్నారు.
పెరుగుతున్న జ్వరబాధితులు
బయ్యారం: వర్షాలు, దోమ విజృంభణతో పీహెచ్సీలకు వచ్చే జ్వరపీడితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైద్యం అందించేందుకు సరిపడా వైద్య సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారు. బయ్యారం పీహెచ్సీలో ముగ్గురు స్టాఫ్నర్స్లు విధులు నిర్వర్తించాల్సి ఉండగా ఒక్కరే ఉన్నారు. యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు లేకపోవడంతో కేవలం మందుగోళీలు ఇచ్చి పంపుతున్నారు. నిత్యం 50 నుంచి 80 మంది రోగులు వస్తుంటారు. వైద్యాధికారి కోడిపుంజులతండాలో వైద్యశిభిరం ఏర్పాటుచేయడంతో సబ్సెంటర్ వైద్యులు ఇక్కడ వైద్యం అందించారు.
మహబూబాబాద్ రూరల్: మల్యాల పీహెచ్సీలో జర్వబాధితుల సంఖ్య పెరుగుతుంది. సీజనల్ వ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులతో పాటు పాము, కుక్క కాటు ఔషధాలు కూడా ఉన్నాయని వైద్యుడు విజయ్ తెలిపారు.
కొత్తగూడ: మండలంలో కొవిడ్ వ్యాప్తి పెరిగింది. వసతిగృహాల్లోని విద్యార్థులకు వైరస్ సోకగా చికిత్స పొందుతున్నారు. మలేరియా పాజిటివ్లు పెరుగుతున్నాయి. కొత్తగూడ పీహెచ్సీలో ప్రతిరోజు 60 నుంచి 80 మంది రోగులు వస్తున్నారు. ఇక్కడి ఫార్మసిస్టు డిప్యుటేషన్పై వెళ్లడంతో స్టాఫ్నర్సులు మందులు పంపిణీ చేస్తున్నారు. యాంటీబాయటిక్ మందుల కొరత ఉంది. మండలంలో ఇప్పటి వరకు 49 మందికి కొవిడ్ పాజిటివ్ నమోదైనట్లు వైద్యాధికారి సరోజ తెలిపారు.
మరిపెడ: మరిపెడ, చిన్నగూడూరు పీహెచ్సీల్లో సీజనల్ జ్వరాలు, ఒంటి నొప్పుల బాధితులు అధికంగా వస్తున్నట్లు సిబ్బంది పేర్కొన్నారు. శుక్రవారం మరిపెడ పీహెచ్సీ వైద్యాధికారి అరుణాదేవిని సస్పెండ్ చేయగా ఉపకేంద్రం వైద్యాధికారి సతీష్ రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి పీహెచ్సీ వైద్యాధికారి రవి సెలవులో ఉండటంతో సిబ్బంది సేవలందించారు. మందులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు