అంబరాన్నంటిన ఆదివాసీ సంబరం
ఐటీడీఏ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా ఘనంగా నిర్వహించారు. ఆదివాసీలు, వివిధ ఆదివాసీ ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో వైజంక్షన్ నుంచి
మాట్లాడుతున్న పీవో అంకిత్, చిత్రంలో గిరిజన నాయకులు
ఏటూరునాగారం, న్యూస్టుడే: ఐటీడీఏ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని అధికారికంగా ఘనంగా నిర్వహించారు. ఆదివాసీలు, వివిధ ఆదివాసీ ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో వైజంక్షన్ నుంచి బయలుదేరి నాయకపోడుల ఆరాధ్య దైవాలైన లక్ష్మీదేవరతో, మేళ తాళాలతో ఆదివాసీ సంప్రదాయ నృత్యాలతో ఐటీడీఏ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఐటీడీఏ పీవో అంకిత్ హాజరయ్యారు. పీసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్ అధ్యక్షతన కుమురం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీల జెండాను తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆదివాసీ ప్రజా సంఘాల ప్రతినిధి పొడెం రత్నం మాట్లాడుతూ.. రాజ్యాంగం కల్పించిన హక్కులు, చట్టాలు అమలయ్యేలా సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. పోడు భూములపై అటవీ అధికారుల దాడులు ఆపాలన్నారు. సర్పంచి రామ్మూర్తి, ఏపీవో వసంతరావు, వివిధ సంఘాల నాయకులు కృష్ణప్రసాద్, రాంబాబు, ధర్మయ్య, రవి, సంతోష్, రవి, ఆరజు, మహేష్, నర్సయ్య, లక్ష్మీకాంత, సులోచన, చంద్రకళ, కోటయ్య, సారయ్య తదితర రెండు వందల మంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండుటెండల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు..!
[ 05-05-2024]
ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండవేడిమి, వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
అదనపు కట్నం వేధింపులు.. ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్య
[ 05-05-2024]
వరకట్నం వేధింపులు, కుటుంబ కలహాలతో ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ నగరంలో చోటుచేసుకొంది. -
పేదలకు ఉచితంగా న్యాయ సేవలు
[ 05-05-2024]
జిల్లా కేంద్రంలోని సఖి వన్స్టాప్ సెంటర్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీˆనియర్ సివిల్ న్యాయమూర్తి టి.కన్నయ్యలాల్ శనివారం సందర్శించారు. -
వారధి నిర్మాణ పనులు వేగవంతం
[ 05-05-2024]
ఏటూరునాగారం మండలంలోని బూటారం గ్రామం నుంచి ఎలిశెట్టిపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో మాటొర్రెపై నిర్మిస్తున్న వారధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. -
పీఎంశ్రీ పాఠశాలలకు సిరి!
[ 05-05-2024]
పాఠశాలల్లో పలు వసతులను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పేరుతో కొత్త పథకానికి గతేడాది శ్రీకారం చుట్టింది. -
‘భాజపాకు ఎన్నికల్లో గుణపాఠం తప్పదు’
[ 05-05-2024]
గత పదేళ్ల పాలనలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా నిరంకుశ పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తున్న భాజపాకు లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. -
ఇంటి వద్దే.. ఓటేశారు!
[ 05-05-2024]
ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించగా భూపాలపల్లి నియోజకవర్గంలో తొలిరోజు శనివారం 42 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
పురపాలిక స్థలాలు.. ఆక్రమణల పర్వం
[ 05-05-2024]
పాలకవర్గం పట్టింపు లేమి, అధికారుల ఉదాసీనత, అక్రమాలకు అండగా నిలుస్తున్న కొందరు ప్రజాప్రతినిధుల కారణంగా జనగామ పురపాలికకు చెందిన విలువైన ఆస్తులు, ఖాళీ స్థలాలు చేజారుతున్నాయి. -
ఆర్టీసీ కార్గో సేవలు అధ్వానం
[ 05-05-2024]
హనుమకొండలోని ఆర్టీసీ కార్గో సేవలపై వినియోగదారులు మండిపడుతున్నారు. నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో పాటు వినియోగదారులే చరవాణికి ఫోన్ చేసినా స్పందించకపోవడం, పార్శిల్ వస్తే సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇవ్వకపోవడం, -
ప్రజాస్వామ్య పండగకు ఆహ్వానం..!
[ 05-05-2024]
ఒక శుభకార్యానికి ఆహ్వానించినట్లుగా ఓటు వేయడానికి రమ్మనే పిలుపుతో ముద్రించిన ఈ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. -
పోలింగ్ కేంద్రాల్లోకి పోలీసులకు అనుమతి ఉండదు
[ 05-05-2024]
ఎన్నికల నిర్వహణలో పోలీసులది కీలక పాత్ర. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో వారి బాధ్యత చెప్పదగినది. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు మాత్రం వారికి అనుమతి ఉండదు.