logo

పరిహారం డబ్బుల కోసం.. కూతురుకు ఎలుకల మందు తాగించిన తండ్రి

పెద్ద కూతురు విద్యుదాఘాతంతో మృతి చెందితే విద్యుత్తు శాఖ ఇచ్చిన పరిహారం కోసం చిన్న బిడ్డ, భార్యకు ఎలుకల మందు తాగించి హత్య చేసేందుకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. వరంగల్‌ జిల్లా సంగెం మండలం తిమ్మాపురం గ్రామంలో జరిగిన ఈ ఘటనపై ఆదివారం సంగెం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Published : 26 Sep 2022 04:53 IST

సంగెం, న్యూస్‌టుడే: పెద్ద కూతురు విద్యుదాఘాతంతో మృతి చెందితే విద్యుత్తు శాఖ ఇచ్చిన పరిహారం కోసం చిన్న బిడ్డ, భార్యకు ఎలుకల మందు తాగించి హత్య చేసేందుకు ప్రయత్నించాడు ఓ వ్యక్తి. వరంగల్‌ జిల్లా సంగెం మండలం తిమ్మాపురం గ్రామంలో జరిగిన ఈ ఘటనపై ఆదివారం సంగెం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సై దేవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం తిమ్మాపురం గ్రామానికి చెందిన లింగాల అనూష-సంతోష్‌కు ఇద్దరు కుమార్తెలు. ఆరో తరగతి చదువుతున్న పెద్ద కుమార్తె రాజేశ్వరి (11) రెండు నెలల కిందట పాఠశాల వద్ద విద్యుదాఘాతంతో మృతి చెందింది. విద్యుత్తుశాఖ బాధిత కుటుంబానికి రూ.4,50,000 నష్టపరిహారం అందించింది. భార్య పేరు మీద వచ్చిన డబ్బులపై భర్త సంతోష్‌ కన్నేశాడు. 15 రోజుల నుంచి డబ్బులు ఇవ్వాల్సిందిగా గొడవ పడుతున్నాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో భార్య, కుమార్తెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 22న మజా పానీయంలో ఎలుకల మందు కలిపి భార్యకు తాగించడానికి ప్రయత్నించగా ఆమె తాగలేదు. ఆరేళ్ల వయసున్న కుమార్తె అక్షయ తాగి కొద్దిసేపటికి అస్వస్థతకు గురైంది. దీంతో అనూష కుమార్తెను ఎంజీఎం ఆసుపత్రిలో చేర్పించి గ్రామంలోని తన తండ్రి కంకణాల స్వామికి విషయం చెప్పింది. అక్కడికి వచ్చిన స్వామిని సైతం సంతోష్‌ కర్రతో తలపై బాది గాయపరిచాడు. ఆయన్ను సైతం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్షయ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అనూష ఫిర్యాదు మేరకు సంతోష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని