పేరుకే పీఏ.. చేసేవన్నీ దందాలే..
‘ఎమ్మెల్యే పీఏ.. పవర్ అంతా తనదే’ అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. చివరకు అమ్మాయిలనూ లైంగికంగా లోబరచుకునేందుకు వెనకాడలేదు. అధికారం చేతిలో ఉందని ఆగడాలకు అంతులేకుండా పోవడంతో కటకటాలపాలయ్యారు.
ఈనాడు, వరంగల్, వరంగల్క్రైం, న్యూస్టుడే
శివ
‘ఎమ్మెల్యే పీఏ.. పవర్ అంతా తనదే’ అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. చివరకు అమ్మాయిలనూ లైంగికంగా లోబరచుకునేందుకు వెనకాడలేదు. అధికారం చేతిలో ఉందని ఆగడాలకు అంతులేకుండా పోవడంతో కటకటాలపాలయ్యారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వద్ద ప్రయివేటు పీఏగా పనిచేస్తున్న శివపై గత నెల 29న హనుమకొండ ఠాణాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారం కేసు నమోదు కావడం నగరంలో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంతో శివ చేసిన దందాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నరేందర్ మేయర్గా ఉన్నప్పటి నుంచీ ఆయనకు సన్నిహితుడిగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో అనేక రకాలుగా అధికారాలు చలాయిస్తూ దందాలకు తెరలేపాడు.
* తూర్పులో నిరుద్యోగుల కోసం గతంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఆ సమయంలో శివ పలువురు విద్యార్థినుల చరవాణి నెంబర్లు తీసుకొని వారిని వేధింపులకు గురిచేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగాల పేరుతో వారికి వలవేసి లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లు సమాచారం. మరికొందరి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు చెబుతున్నారు.
* పలు భూవివాదాల్లో తలదూర్చడంతో పాటు వరంగల్ డివిజన్లో పనిచేసే పలువురు పోలీసు అధికారులపై పెత్తనం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎక్కడికి వెళ్లినా పీఏ పేరుతో సకల మర్యాదలు శివ అందుకునేవాడు. మేయర్గా ఉన్నప్పుడు నరేందర్ జన్మదిన వేడుకలు నిర్వహించాలని పలువురు ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. నరేందర్ తూర్పు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆగడాలు మరింత శ్రుతిమించాయి. ఒక భూవివాదంలో పోలీసుల పేరు చెప్పి బాధితుడి నుంచి రూ.4 లక్షలు తీసుకున్నాడు. చివరకు భూవివాదం పరిష్కారం కాకపోవడంతో బాధితుడు నేరుగా పోలీసు అధికారి వద్దకు వెళ్లి చెప్పగా అసలు శివ తనకు డబ్బు ఇవ్వలేదని.. తాము చట్ట విరుద్ధంగా పనిచేయలేమని తేల్చి చెప్పారు. దీంతో బాధితుడు శివ వద్దకు వెళ్లి డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారు. శివపై ఆ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసే ఆలోచనలో ఉన్నారని తెలిసింది.
కేసు కాకుండా ఒత్తిడి
గత ఫిబ్రవరి నుంచి శివ తనపై తరచూ అత్యాచారానికి పాల్పడుతున్నట్లు ఓ న్యాయ విద్యార్థిని గత నెల 29న హనుమకొండ ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈమేరకు ఆయనపై ఎస్సీ, ఎస్టీ అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసు కాకుండా ఉండేందుకు శివ కుటుంబ సభ్యులు లాబీయింగ్ చేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థినితో సయోధ్య కుదుర్చుకునేందుకు ప్రయత్నించగా ఆమె కుటుంబసభ్యులు వినలేదు. దీంతో శివ పోలీసు ఉన్నతాధికారులను సైతం కలిసి కేసు నమోదు కాకుండా ఉండేందుకు ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. బాధిత మహిళ మాత్రం తనకు న్యాయం జరగాలని కోరడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు అరెస్టు కాగా.. బాధితురాలిపై మరో వ్యక్తి కూడా అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసులు తాజాగా గుర్తించారు. ప్రస్తుతం సదరు నిందితుడు విదేశాల్లో ఉన్నట్టు తెలిసింది. పోలీసులు దీనిపై కూడా సమగ్ర విచారణ జరుపుతున్నారు.
అనవసరంగా నాపై బురద చల్లుతున్నారు..
- నన్నపునేని నరేందర్, తూర్పు శాసనసభ్యుడు
నా రాజకీయ పలుకుబడిని దెబ్బకొట్టడానికి కొందరు పనిగట్టుకొని అనేక ఆరోపణలు చేస్తున్నారు. నా వద్ద సుమారు 40 మంది పని చేస్తారు. వాళ్లలో శివ ఒకరు. నా పేరు చెప్పి అతను ఏనాడూ వసూళ్లకు పాల్పడినట్లు నా దృష్టికి రాలేదు. అలా చేసినట్టు తెలిస్తే ఇప్పటికే తొలగించేవాడిని. తాజాగా శివపై నమోదైన కేసుతో నాకెలాంటి సంబంధం లేదు. నిజానిజాలు తేల్చడానికి పోలీసులు, న్యాయస్థానం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్