logo

ఉత్తమ శకటంగా నారీశక్తి

గణతంత్ర దినోత్సవంలో సాయుధ బలగాల్లో మహిళల సత్తా చాటిచెప్పేలా ప్రదర్శించిన నారీశక్తి శకటానికి అత్యుత్తమ ప్రజాధరణ కలిగిన శకటంగా పురస్కారం లభించింది.

Published : 02 Feb 2023 05:38 IST

కేంద్ర మంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకుంటున్న పారామిలటరీ

బలగాల ఉన్నతాధికారులు. చిత్రంలో కోమల్‌ప్రీత్‌కౌర్‌ (వృత్తంలో)

కాటారం, న్యూస్‌టుడే: గణతంత్ర దినోత్సవంలో సాయుధ బలగాల్లో మహిళల సత్తా చాటిచెప్పేలా ప్రదర్శించిన నారీశక్తి శకటానికి అత్యుత్తమ ప్రజాధరణ కలిగిన శకటంగా పురస్కారం లభించింది. ఈ శకటం బృందానికి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం సీఆర్పీఎఫ్‌ 58వ బెటాలియన్‌కు చెందిన అసిస్టెంట్‌ కమాండెంట్‌ కోమల్‌ ప్రీత్‌కౌర్‌ నేతృత్వం వహించారు. దీని రూపకల్పనలోనూ ఆమె కీలక పాత్ర పోషించారు. దిల్లీలో బుధవారం కేంద్ర రక్షణశాఖ సహాయమంత్రి అజయ్‌భట్‌ చేతుల మీదుగా జరిగిన పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో పారామిలటరీ బలగాల ఉన్నతాధికారులతో కలిసి కోమల్‌ప్రీత్‌కౌర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని