విన్నపాలు ఆలకించి.. పరిష్కారానికి ఆదేశించి!
జనగామ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పలు వినతులు వెల్లువెత్తాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలపై ఆర్జీలు అందజేశారు.
అర్జీని పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్ ప్రఫుల్దేశాయ్
జనగామ అర్బన్, న్యూస్టుడే: జనగామ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పలు వినతులు వెల్లువెత్తాయి. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సమస్యలపై ఆర్జీలు అందజేశారు. అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా న్యాయం జరగడం లేదని కొందరు, ఆసరా గుర్తింపు కార్డులున్నా పింఛన్ ఇవ్వడం లేదని మరికొందరు విన్నవించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్దేశాయ్ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. వినతిపత్రాలను సంబంధితశాఖల అధికారులకు బదిలీ చేశారు. మొత్తం 50 దరఖాస్తులు రాగా భూ సమస్యలే ఎక్కువగా ఉన్నాయి.
సొమ్ము వసూళ్లను నిలిపివేయాలని..
వీరంతా తరిగొప్పుల మండలంలోని అంకుషాపూర్, నర్సాపూర్, సోలిపూర్, అబ్దుల్నాగారం, బొంతగట్టు నాగారం పంచాయతీల్లో పని చేస్తున్న సిబ్బంది. పంచాయతీ సిబ్బందిగా కొనసాగుతూ ఉపాధిహామీ పథకంలో పని చేశారు. 2021లో జరిగిన ఉపాధిహామీ సామాజిక తనిఖీలో.. వీరి నుంచి సొమ్మును రికవరీ చేయాలని అధికారులు ఆదేశించారు. అవగాహన లేక పొరపాటు చేశామని, చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటామని, సొమ్ము రికవరీని ఎత్తి వేయాలని అభ్యర్థించారు.
రేడియో కేంద్రం ఏర్పాటు చేయండి..
చైతన్యానికి మారు పేరు అయిన జనగామ జిల్లాలో ఎఫ్.ఎం. రేడియో స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా కవులు, కళాకారుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. విద్య, వాణిజ్య, వ్యాపార, కళా, సాహిత్య రంగాల్లో బాసిల్లుతున్న ఈ జిల్లాలో రేడియో కేంద్రం ఏర్పాటు చేస్తే అన్ని వర్గాల వారికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.
ఇల్లు మంజూరు చేయండి..
వీరిది జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్ శివారులోని కొత్తతండా. ప్రభుత్వం మంజూరు చేసే రెండు పడకగదుల ఇల్లు మంజూరు చేయాలని అదనపు కలెక్టర్కు మొర పెట్టుకున్నారు. తన భర్తకు రెండు మూత్ర పిండాలు చెడిపోవడంతో ఏ పని చేయలేని స్థితిలో ఉన్నాడని, తమకు ఇద్దరు పిల్లలు ఉన్నారని, దీన స్థితిలో ఉన్న తమ కుటుంబానికి రెండు పడకగదుల ఇల్లు మంజూరు చేయాలని తేజావత్ దివ్య అర్జీ అందజేసింది.
ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షలు అందించాలని..
జనగామ మండలం యశ్వంతాపూర్కు చెందిన నిరుపేదలు వీరు. తమకు రెండు పడకగదుల ఇళ్లు ఇవ్వాలని, సొంత స్థలాలు ఉన్న వారికి వారికి రూ.3 లక్షల చొప్పున అందజేయాలంటూ అదనపు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. తమ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిలో నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చూడాలని కోరారు.
మరికొన్ని సమస్యలు ఇవి..
* తన తండ్రి పేరిట ఉన్న ఐదెకరాల భూమికి యాసంగి రైతుబంధు సొమ్ము ఇవ్వలేదని, అధికారుల చుట్టూ తిరిగినా ఎవరూ సరైన సమాధానం ఇవ్వడం లేదంటూ బచ్చన్నపేటకు చెందిన మార్క సందీప్ ఫిర్యాదు చేశారు.* లింగాలఘనపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన శనిగరం కావ్య తనకు ఆసరా గుర్తింపు కార్డు వచ్చినా పింఛన్ ఇవ్వడం లేదని అధికారుల ముందు వాపోయారు.* జనగామ మండలం యశ్వంతాపూర్కు చెందిన గడ్డం సుగుణ.. వితంతు పింఛన్ కోసం పంచాయతీ కార్యదర్శికి ధ్రువపత్రాలు సమర్పించినా పింఛన్ మంజూరు కాలేదని, అధికారులు చొరవ చూపి మంజూరు చేయాలని కోరింది.* వెంకిర్యాలకు చెందిన శైలజ.. తమ వ్యవసాయ భూమికి వెళ్లే నక్షాను కొందరు ఆక్రమించుకున్నారని గతంలో ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో తాజాగా మళ్లీ ప్రజావాణిని ఆశ్రయించింది.
వివిధ శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులివి..
తహసీల్దార్ల పరిధిలోనివి : 26
ఏరియా ఆసుపత్రి: 3
డీఆర్డీవో : 5
ఎస్సీ కార్పొరేషన్ : 2
విద్యుత్తుశాఖ : 4
ఇతర : 10
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
88 మంది అభ్యర్థులు..145 సెట్ల నామపత్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల నామపత్రాల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజైన గురువారం వరంగల్ స్థానానికి కొత్తవారు 24 మంది, మహబూబాబాద్ స్థానానికి తొమ్మిది మంది అభ్యర్థులు వాటిని దాఖలు చేశారు. -
మోదీ సాహసోపేత నిర్ణయాలతోనే పేదలకు మేలు
[ 26-04-2024]
గత పదేళ్లుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆయన అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని అనేక వర్గాలకు మేలు చేస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అన్నారు. -
భాజపా, కాంగ్రెస్ తోడు దొంగలు
[ 26-04-2024]
ఆరు గ్యారంటీలు, 13 హామీలను వందరోజుల్లో అమలు చేస్తామని మాయమాటలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేస్తోందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ధ్వజమెత్తారు. -
అవిశ్వాసం దిశగా అసంతృప్తి..
[ 26-04-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ సుధారాణి, ఉప మేయర్ రిజ్వానా షమీమ్లకు అవిశ్వాస గండం పొంచి ఉంది. -
ఓటు వేటలో నడక బాట!
[ 26-04-2024]
వరంగల్ లోక్సభ భాజపా అభ్యర్థి అరూరి రమేష్, భారాస అభ్యర్థి ఎం.సుధీర్కుమార్ వాకర్స్ మద్దతు కోరుతూ గురువారం ప్రచారం నిర్వహించారు. -
‘కాంగ్రెస్కు ఓటమి తప్పదు’
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వరంగల్ భారాస ఎంపీ అభ్యర్థి సుధీర్కుమార్కు మద్దతుగా తొర్రూరు మండలంలోని వెలికట్ట శివారులో గురువారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు హాజరై ప్రసంగించారు. -
పెద్దమ్మతల్లి వేడుకల్లో ఎమ్మెల్యే కడియం
[ 26-04-2024]
మండలంలోని ఇప్పగూడెం, చాగల్లు గ్రామాల్లో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఉత్సవాల్లో ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం పాల్గొన్నారు. -
అర్హత లేకుండా వైద్యం.. ప్రాణాలతో చెలగాటం
[ 26-04-2024]
రాష్ట్ర వైద్య మండలి ఛైర్మన్ డాక్టర్ మహేశ్కుమార్ ఆదేశాల మేరకు టీఎస్ఎంసీ సభ్యులు డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ నరేశ్కుమార్, ఐఎంఏ, తానా, భూపాలపల్లి డీఎంహెచ్వో సంయుక్తంగా గురువారం భూపాలపల్లి, కాటారంలో అనుమతులు లేని ఆసుపత్రులు, నకిలీ వైద్యులపై తనిఖీలు నిర్వహించారు. -
రెండు పడక గదుల ఇళ్లు అమ్మితే చర్యలు
[ 26-04-2024]
లబ్ధిదారులకు కేటాయించిన రెండు పడక గదుల ఇళ్లను ఎవరైనా అమ్మితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. -
ఓటు చైతన్యం..!
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదు కోసం ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు స్వీప్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ప్రదర్శనలు నిర్వహించారు. -
అటవీశాఖ ప్రత్యేక గస్తీ
[ 26-04-2024]
మండలంలోని నగరం, బాలాజీతండా, కోట్యానాయక్తండా, పోచారం పరిసరాల్లో ఉన్న బెరైటీస్ ఖనిజాల పరిరక్షణకు అటవీశాఖాధికారులు ప్రత్యేక గస్తీని ఏర్పాటు చేశారు. -
‘భయంతోనే ప్రతిపక్ష నాయకులపై కేసులు’
[ 26-04-2024]
దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. -
ఉత్తమ లోకోషెడ్ అవార్డు అందజేత
[ 26-04-2024]
దక్షిణ మధ్య రైల్వేలో లోకోల నిర్వహణలో కాజీపేట డీజిల్ లోకోషెడ్ అందుకున్న ఉత్తమ అవార్డును జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ చేతుల మీదుగా షెడ్ సీనియర్ డీఎంఈ స్వరాజ్కుమార్ గురువారం స్వీకరించారు. -
పేదింట మృత్యుఘోష
[ 26-04-2024]
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన నలుగురు యువకులవి పేద కుటుంబాలు.. తల్లిదండ్రులు ఏదో ఒక పని చేస్తేనే పూటగడిచేది. -
అక్రమ మద్యం నియంత్రణకు మొబైల్ తనిఖీ కేంద్రాలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ములుగు జిల్లాలో మత్తు, గంజాయి, అక్రమ మద్యం దిగుమతి కాకుండా ఏడు ప్రత్యేక మొబైల్ తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి వి.శ్రీనివాస్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల