ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి
లోక్సభ ఎన్నికల్లో ప్రజలు అశీర్వదించి గెలిపిస్తే ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డా.కడియం కావ్య అన్నారు.
మాట్లాడుతున్న ఎంపీ అభ్యర్థి కావ్య
నయీంనగర్, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికల్లో ప్రజలు అశీర్వదించి గెలిపిస్తే ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి డా.కడియం కావ్య అన్నారు. గురువారం హనుమకొండలోని ప్రెస్క్లబ్లో నిర్వహించిన ‘మీట్ ద ప్రెస్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కడియం ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు చెప్పారు. ఎక్కువ సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. రాజకీయ గురువు, తన తండ్రి శ్రీహరి ఇచ్చిన ధైర్యంతో ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. పుట్టింది పెరిగింది ఇక్కడేనంటూ ఉన్నత విద్యను అభ్యసించానని, ఉమ్మడి జిల్లా సమస్యలపై పూర్తి అవగాహన ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తూ మ్యానిఫెస్టో రూపొందించిందన్నారు. రాష్ట్ర రెండో రాజధానిగా ఓరుగల్లును విద్య, వైద్య, పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని, జిల్లా అభివృద్ధిలో తనదంటూ ఒక ప్రత్యేకత చూపిస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రెస్క్లబ్ అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి సదయ్య, కోశాధికారి అమర్, జర్నలిస్టు సంఘాల బాధ్యులు బీఆర్ లెనిన్, మెండు రవీందర్, వివిధ ఛానళ్ల ప్రతినిధులు, పాత్రికేయులు పాల్గొన్నారు.
ప్రజల గొంతుకనై ప్రశ్నిస్తా: కాజీపేట రూరల్, మడికొండ: వరంగల్ అభివృద్ధికి పార్లమెంట్లో ప్రజల గొంతుకనై ప్రశ్నించి రావాల్సిన నిధులు తీసుకొస్తానని కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. కాజీపేట మండలం కడిపికొండ, రాంపేట గ్రామాల్లో గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజుతో కలిసి కావ్య కార్నర్ సమావేశంలో ప్రసంగించారు. అంతకుముందు మంగళ హారతులతో స్వాగతం పలికి గొర్రెపిల్ల, గొంగళి అందజేసి మహిళలు మద్దతు పలికారు. కాషాయం కండువా కప్పుకుని వస్తున్న భూబకాసురుడు అరూరి రమేశ్ను రాజకీయాల్లో లేకుండా చేయాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మహ్మద్ రియాజ్, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కావ్యను గెలిపించాలని ఎమ్మెల్యే నాగరాజు గురువారం మడికొండలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు.
ధర్మసాగర్, వేలేరు: భారాస, కేసీఆర్ కుటుంబం అవినీతి అక్రమాల్లో కూరుకుపోవడం వల్ల, నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్లోకి వచ్చానని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కడియం కావ్యను గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే శ్రీహరి ధర్మసాగర్, వేలేరు మండలాల్లో గురువారం రాత్రి కార్నర్ సమావేశాలను నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రాజయ్యపై కడియం శ్రీహరి నిప్పులు కక్కారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేధింపులను అరికట్టేందుకు.. మహిళా కమిటీలు
[ 20-05-2024]
పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు అంతర్గత కమిటీలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్ కార్పొరేషన్, తొమ్మిది మున్సిపాలిటీల్లో కమిటీల ఏర్పాటుపై సంబంధిత అధికారులు దృష్టి సారించారు. -
నగరం.. చినుకులకే వణుకుతోంది..!
[ 20-05-2024]
‘ఇటీవల కురుస్తున్న చిన్నపాటి వర్షాలకే వరంగల్, హనుమకొండ ప్రధాన రహదారులు, కూడళ్లలో వరదనీరు ప్రవహించింది. అంతర్గత మురుగు కాలువలు పొంగిపొర్లాయి.’ -
కొలువు కల్ల.. జేబు గుల్ల!
[ 20-05-2024]
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నేరుగా లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ వచ్చిందంటే చాలు కొంత మంది దళారులకు కాసుల పంట పండుతోంది. వాటిని ఎరగా చేసుకుని అమాయక నిరుద్యోగులే లక్ష్యంగా గాలమేస్తున్నారు. -
ఆడిట్ విభాగంలో లెక్కలేనితనం
[ 20-05-2024]
గతేడాది సీనియర్ అసిస్టెంట్ బండా అన్వేష్ అభివృద్ధి పనుల పేరుతో సుమారు రూ.3.31 కోట్లు కొల్లగొట్టాడు. ఆడిట్, గణాంక విభాగాల అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యంతో ప్రజాధనాన్ని ప్రైవేటు ఖాతాల్లోకి మళ్లించారు. -
బాల చోదకులు.. ప్రమాద కారకులు
[ 20-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మైనర్లు వాహనాలు నడుపుతూ.. తరచూ ప్రమాదాలకు కారకులవుతున్నారు. ఏటా పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా.. పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టి జరిమానా లేదా జైలు శిక్ష విధిస్తున్నా.. తీరు మారడం లేదు. -
ఎమ్మెల్సీ ఎన్నికల భారాస సమన్వయకర్తలు వీరే
[ 20-05-2024]
వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగురవేసేందుకు భారాస ప్రత్యేక దృష్టి సారించింది. ఆ పార్టీ నుంచి పోటీ చేస్తున్న రాకేశ్రెడ్డిని గెలిపించాలనే ఉద్దేశంతో అసెంబ్లీ సెగ్మెంటు వారీగా సమన్వయకర్తలను నియమిస్తున్నారు. -
అతివలకు ఉపాధి వెలుగులు
[ 20-05-2024]
విద్యుత్తు వినియోగం పెరుగుతూనే ఉంది.. వేసవిలోనైతే మరీ ఎక్కువ అవుతోంది.. దేశ వ్యాప్తంగా జల, పవన, బొగ్గు ఆధారిత విద్యుత్తుపై ఆధారపడుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్తును ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తున్నారు. -
‘విద్యావంతుడైన రాకేశ్రెడ్డిని గెలిపించుకుందాం’
[ 20-05-2024]
-
పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే
[ 20-05-2024]
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రులు, మేధావుల మద్దతు భాజపాకే ఉందని, ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థినైన తనకు మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపిస్తారని గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. -
వ్యర్థాల వడపోతకు బయోమైనింగ్!
[ 20-05-2024]
పురపాలికల్లో ఏళ్లతరబడి డంపుయార్డుల్లో పేరుకున్న ఘన వ్యర్థాలను వేరు చేస్తారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సిమెంటు, విద్యుత్తు పరిశ్రమలకు విక్రయిస్తారు. మాగిన మట్టిని ఎరువుగా, రాళ్లు, పనికిరాని ఇతర వ్యర్థాలను లోతట్టు ప్రాంతాలు, భారీ గుంతలను నింపేందుకు ఉపయోగించవచ్చు. -
భారాస గెలుపునకు కృషి చేయాలి..
[ 20-05-2024]
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. -
కిసాన్ నిధి.. కొందరికేనా?
[ 20-05-2024]
రైతు సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను అమలు చేస్తున్నాయి. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేలా పెట్టుబడి సాయం అందించేలా ఏడాదికి మూడు పర్యాయాలు రూ.2 వేల చొప్పున సంవత్సరానికి రూ.6 వేలు రైతుల ఖాతాలో జమ చేసేలా కేంద్ర ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించారు. -
వరి వైపే మొగ్గు
[ 20-05-2024]
జిల్లాలో ఈసారి వానాకాలంలో 4,30,521 ఎకరాల్లో పంటల సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు సాగు అంచనా ప్రణాళికలను రూపొందించారు. ఇందులో సింహభాగం వరి సాగు వైపు మొగ్గు చూపుతారని నిర్ధారించారు. -
మోడికుంట.. కాలయాపన ఎందుకంట?
[ 20-05-2024]
సాగునీటి పథకాలలో ముంపు రహిత ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది వాజేడు మండలంలోని మోడికుంట మాత్రమే. తెలంగాణ- ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని భద్రాద్రి మన్యంలో వాజేడు మండలం కృష్ణాపురం సమీపాన అటవీ ప్రాంతం నుంచి వచ్చే వరదనీటికి అడ్డుకట్ట వేసి నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
-
అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్ తొలి ఓటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 pM
-
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు