దొరికిన దొంగల ముఠా
ప్రకాశం జిల్లాలోని పలుచోట్ల దేవాలయాలు, తాళం వేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న అయిదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రం ఒంగోలులోని పోలీసు కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో
స్వాధీనం చేసుకున్న సొత్తును పరిశీలిస్తున్న ఎస్పీ మలికా గార్గ్
కారాగారంలో పరిచయంతో మకాం...: వడ్డే మోషేది పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని సత్యనారాయణపేట. అతను ఏలూరు, విశాఖపట్నంలోని పలు చోరీ కేసుల్లో నిందితుడు. నేరాలకు పాల్పడి శిక్ష అనుభవిస్తున్న సమయంలో.. ప్రకాశం జిల్లా ఒంగోలు ఇందుర్తినగర్కు చెందిన కోట బంగారయ్యతో అతనికి పరిచయం ఏర్పడింది. 2019 డిసెంబరులో జైలు నుంచి బయటకు వచ్చిన మోషే.. ఏడాది క్రితం ఒంగోలుకు మకాం మార్చాడు. ఇందిరానగర్కు చెందిన కసుకుర్తి అభినవ్, కుర్రా శివశంకర్, పాములపాటి దుర్గాప్రసాద్లతో కలిసి ఒక ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. వీరంతా పగటి వేళల్లో ఒంగోలులో ఆటో నడుపుకొంటూ రాత్రివేళల్లో దేవాలయాల్లో హుండీలు చోరీ చేసేవారు. పలుచోట్ల తాళం వేసిన ఇళ్లలోనూ దొంగతనాలకు పాల్పడ్డారు. గుంటూరులోని కొత్తపేటలో ఇటీవల ఆటోను అపహరించారు. అందులో సంచరిస్తూ చోరీలు చేస్తున్నారు. ఇంకొల్లు మండలం కొణికిలోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో అనుమానాస్పదంగా ఉన్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. జిల్లాలో సుమారు 14 వరకు నేరాలకు పాల్పడినట్టు విచారణలో వెల్లడించినట్టు ఎస్పీ తెలిపారు.
రూ.5 లక్షల సొత్తు
నిందితుల నుంచి చోరీలకు వినియోగిస్తున్న ఆటో, 56 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒక సీసీ కెమెరా, మానిటర్, రూ.1.45 లక్షల నగదు సహా మొత్తం రూ.అయిదు లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల అరెస్టు, చోరీ సొత్తు రికవరీకి కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ గార్గ్ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగాలు కావాలంటే తెదేపా రావాలి
[ 06-05-2024]
‘జాబ్ క్యాలెండర్ పేరుచెప్పి జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చి యువతను జగన్ నిండా ముంచారు. వైకాపా పాలనకు యువతే చరమగీతం పాడాలి’ అంటూ తెదేపా నేత నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఏలూరులో ఆదివారం నిర్వహించిన యువగళం సభలో విద్యార్థులు, యువతతో ముఖాముఖీ నిర్వహించారు. -
జగన్ జమానాలో నిధులు దోచేసి... అభివృద్ధి ఆపేసి!
[ 06-05-2024]
దేశానికి పల్లెలు పట్టుగొమ్మలు... వైకాపా అధికారంలోకి వచ్చాక... ఆ పట్టుగొమ్మలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొడలిపోటు వేశారు. అయిదేళ్ల జగన్ జమానాలో గ్రామ పంచాయతీలు నిర్వీర్యమయ్యాయి. ఏటా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర సర్కారు దారి మళ్లించింది. -
జాగాలపై జగన్ మూకలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో ఊరూరా ఆక్రమణలపర్వం
[ 06-05-2024]
‘జాగా కనిపిస్తే..పాగా వేసేయడమే’ అన్నట్లు జగన్ అనుచరగణం ఊరూరా చెలరేగిపోయింది. అయిదేళ్ల జమానాలో మమ్మల్ని ఎవర్రా ఆపేది అన్నట్లు ఆక్రమణల పర్వం సాగింది. ప్రజల సామూహిక అవసరాలకు వినియోగించాల్సిన స్థలాలు వైకాపా నేతల కబంధ హస్తాల్లోకి వెళ్లిపోయాయి. -
కక్ష సాధింపుల్లో.. అధినేతకు పెద్దన్న
[ 06-05-2024]
జిల్లాలో సంపన్న ప్రాంతంగా గుర్తింపు పొందిన కీలక కేంద్రమది. తొలి నుంచి ప్రశాంత వాతావరణానికి నిలయం. జాతరలైనా, పండుగలైనా లౌకికత గోచరిస్తుంది. ఇలాంటి ప్రాంతం వైకాపా జమానాలో అరాచక పాలనకు, కక్ష సాధింపులకు వేదికైంది. -
బటన్ నొక్కుడు.. వట్టిదేనా జగన్?
[ 06-05-2024]
‘మహిళల సంక్షేమమే నా లక్ష్యం.. అతివల ఆర్థిక స్వావలంబనే నా ధ్యేయం’ అంటూ సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ వేదికలపై ఉపన్యాసాలు ఇస్తుంటారు. అమలు చేసే విషయంలో మాత్రం ఆయనకు చిత్తశుద్ధి కొరవడింది. దీనికి నిదర్శనమే వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం. అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సహాయం అందించేందుకు దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. -
నీట్కు 43 మంది గైర్హాజరు
[ 06-05-2024]
జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్షకు 43 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 1361 మంది హాజరు కావాల్సి ఉండగా 1318 మంది హాజరయ్యారు. -
రంగులు మారలే... ప్రలోభాలు తగ్గలే!
[ 06-05-2024]
నరసాపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు పట్టణంలోని ఎండీయూ ఆపరేటర్. ఆయన నిత్యం ప్రజాప్రతినిధులతో సన్నిహితంగా ఉంటారు. ఎన్నికల ప్రచారంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. -
చీకటి పాలన నుంచి త్వరలో విముక్తి : నారా రోహిత్
[ 06-05-2024]
అయిదేళ్ల చీకటి పాలన నుంచి త్వరలోనే విముక్తి పొందుతామని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. తెదేపా యువ నాయకుడు ఆరిమిల్లి నిఖిల్రత్న ఆధ్వర్యంలో స్థానిక భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కమ్మ కల్యాణ మండపంలో ఆదివారం రాత్రి నిర్వహించిన యువ గళం... -
తపాలా బ్యాలెట్ ఓటింగ్లో ఇంకా ఇబ్బందులు
[ 06-05-2024]
తపాలా బ్యాలెట్ వినియోగంలో ఉద్యోగులకు రెండో రోజూ స్వల్ప ఇబ్బందులు ఎదురయ్యాయి. శనివారం ఫెసిలిటేషన్ కేంద్రాలకు వెళ్లిన అనేక మంది ఉద్యోగులకు వారి ఓట్లు లేవని తెలుసుకుని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. -
అసభ్యకర పోస్టింగులు పెడుతున్న వైకాపా సోషల్ మీడియా ఖాతాదారులపై కేసు
[ 06-05-2024]
ఓ తెదేపా మహిళా నాయకురాలిపై అసభ్యకరంగా పోస్టింగులు పెడుతున్న వైకాపా సోషల్ మీడియా ఖాతాదారులపై ఏలూరు టూటౌన్ పోలీసు స్టేషన్లో ఆదివారం రాత్రి కేసు నమోదైంది. -
తపాలా ఓట్ల కోసం పోటా పోటీ
[ 06-05-2024]
ప్రస్తుత ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకం కానుండటంతో తపాలా ఓట్లను దక్కించుకొనేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. జిల్లాలో ఈ నెల 6, 7 తేదీల్లో తపాలా బ్యాలెట్ ఓటింగ్ జరగనుంది. -
ఇటు భోజనాలు... అటు సొమ్ములు
[ 06-05-2024]
పోలింగ్ తేదీ సమీపిస్తున్న తరుణంలో గ్రామాల్లో అధికార పార్టీ ప్రలోభాలకు తెరలేపింది. సామాన్య ప్రజలతోపాటు వివిధ వర్గాలను ప్రభావితం చేసేలా చిరుదోగ్యులపై దృష్టి సారించింది.
తాజా వార్తలు (Latest News)
-
IPL 2024: ‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
-
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్కు బెయిల్
-
ఈ ధైర్యం పేరు జస్ప్రీత్.. వివరాలు చెప్పండి ప్లీజ్: ఆనంద్ మహీంద్రా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. అందుకే సిగ్గుపడ్డాను: ‘హిరామండీ’ నటుడు
-
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన బైకు.. ఇద్దరి మృతి