పశ్చిమ తీరంలో విశ్వనాథ కిరణాలు
కళాతపస్వి కె.విశ్వనాథ్ సినిమాల్లో తారల కంటే కథే బలంగా కనిపిస్తుంది. ఆయన సినిమా పేరు కూడా దైనందిన జీవితాలతో ముడిపడినట్టే వినిపిస్తుంది.
ఉమ్మడి జిల్లాలో కళాతపస్వి జ్ఞాపకాలు
పంచారామక్షేత్రం సోమేశ్వరుని సన్నిధిలో ..
పాలకొల్లు, పోలవరం, న్యూస్టుడే: కళాతపస్వి కె.విశ్వనాథ్ సినిమాల్లో తారల కంటే కథే బలంగా కనిపిస్తుంది. ఆయన సినిమా పేరు కూడా దైనందిన జీవితాలతో ముడిపడినట్టే వినిపిస్తుంది. సాగర సంగమం, సిరివెన్నెల, శృతిలయలు, స్వాతి కిరణం, స్వాతిముత్యం, శుభ సంకల్పం, సూత్రధారులు, సిరిసిరిమువ్వ ఇలా చెబుతూ పోతే ప్రతి చిత్రం పేరు ప్రజలకు పరిచయమున్నదే. అంతటి ప్రఖ్యాత దర్శకుడు విశ్వనాథుడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అనేక సందర్భాల్లో పర్యటించారు. సహజసిద్ధమైన ప్రదేశాలకు ప్రాధాన్యమిచ్చే ఆయన సన్నివేశాలకు, పాటల చిత్రీకరణకు అనుకూలంగా ఉండే జిల్లాలోని గోదావరి తీర ప్రాంతాన్ని ఎక్కువగా ఎంచుకునేవారు. అదే కోవలో పోలవరం ప్రాంతంలో సిరిసిరి మువ్వ అప్పట్లో గజ్జెగట్టి ఝుమ్మందినాదం అంటూ పల్లవించింది. సూత్రధారులను గోదావరి ప్రాంతానికి తీసుకొచ్చింది. ఆపద్బాంధవుడు అడుగులు పడేలా చేసింది. జిల్లాలోని ప్రకృతి అందాలను వెండితెరపై వెలిగిస్తూ కలుసుందాం రా అంటూ తెలుగు తెర ఆహ్వానించేలా చేసిన దర్శకుల్లో కళా తపస్విని ఎల్లవేళలా జిల్లా గుర్తుపెట్టుకునేలా చేసింది. కె.విశ్వనాథ్ను 1989 మే 28న లలిత కళాంజలి నాటక అకాడమి ఆధ్వర్యంలో దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ చేతుల మీదుగా పాలకొల్లులో ఘనంగా సత్కరించారు. ఆయన మీద ఒక సావనీర్ కూడా అప్పట్లో విడుదల చేసినట్లు ప్రముఖ కళాకారుడు మానాపురం సత్యనారాయణ గుర్తు చేసుకున్నారు.
అభిమానులతో మమేకమై..
భీమవరం సాంస్కృతికం, న్యూస్టుడే: భీమవరంలో చైతన్య భారతి సంగీత, నృత్య, నాటక పరిషత్తు వార్షికోత్సవాల సందర్భంగా 2011లో దర్శకుడు కె.విశ్వనాథ్ను ఆ సంస్థ నిర్వాహకులు ‘చైతన్య భారతి జీవన సాఫల్య’ పురస్కారం ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముఖాముఖిలో ఆయన ప్రేక్షకులు, అభిమానులతో మమేకమై వారితో ముచ్చటించారు. మానవ సంబంధాలు, మన సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతను తెలియజెప్పే చిత్రాలను తీయాలన్నదే తన తపన అన్నారు. మనమంతా ‘అమ్మా.. నాన్న’ అని సిగ్గుపడకుండా పిలిచినంతకాలం తెలుగు సాహిత్యం అజరామంగా నిలిచి ఉంటుందన్నారు.
మొగల్తూరు, న్యూస్టుడే: తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకువెళ్లిన ఘనత కళా తపస్వి కె.విశ్వనాథ్కే దక్కుతుందని, ఈ పరిశ్రమకు ఆయన లేని లోటు తీరనిదని నరసాపురానికి చెందిన సినీ దర్శకుడు దవళ సత్యం అన్నారు. శుక్రవారం ఆయన ‘న్యూస్టుడే’తో మాట్లాడారు.
కళాశిఖరానికి ఆత్మీయ సత్కారం
బాపు పేరిట ఇచ్చిన అవార్డు అందుకుంటున్న విశ్వనాథ్
నరసాపురం, న్యూస్టుడే: కళాతపస్వి విశ్వనాథ్కు నరసాపురంతో అనుబంధం ఉంది. అక్కినేని నాగేశ్వరరావు, జమున కథానాయకా, నాయికలుగా తెరకెక్కించిన ‘మూగమనసులు’ సినిమాలోని కొన్ని సన్నివేశాలను నరసాపురంలో 1963లో చిత్రీకరించారు. ఆ సినిమాకు సెకండ్ యూనిట్ డైరెక్టర్గా విశ్వనాథ్ పనిచేశారు. ‘మూగమనసులు’ను హిందీ అనువాదంలో రూపొందించిన ‘మిలన్’కు కొన్ని సన్నివేశాలను ఇక్కడే చిత్రీకరించారు. స్థానిక వైఎన్ కళాశాలలో విశ్వనాథ్ను సన్మానించారని నరసాపురానికి చెందిన రెడ్డప్ప ధవేజీ తెలిపారు.నరసాపురం గోదావరి తీరంలో బాపు విగ్రహావిష్కరణ సందర్భంగా 2017లో బాపు జయంతి రోజున ఆయన పేరిట అవార్డులు ప్రదానం చేశారు. అప్పటి మంత్రి పితాని సత్యనారాయణ, అప్పటి ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుల చేతులమీదుగా కె.విశ్వనాథ్కు బాపు స్మారక మొదటి అవార్డు అందించి ఆత్మీయ సత్కారం చేశారు.
కొత్త జీవితాన్ని ప్రసాదించారు
ఏలూరు గ్రామీణ, న్యూస్టుడే: కళాతపస్వి కె.విశ్వనాథ్ తనకు కొత్త జీవితం ప్రసాదించారని ప్రముఖ నృత్యకారుడు ఏలూరుకు చెందిన కె.వి.సత్యనారాయణ అన్నారు. ‘1986లో ఆయన దర్శకత్వం వహించిన శృతిలయలు చిత్రానికి నృత్య దర్శకునిగా పని చేశా. నృత్య దర్శకునిగా నంది అవార్డు రావడంతో నా జీవితం మలుపు తిరిగింది. తర్వాత స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం చిత్రాలకు నృత్య దర్శకునిగా పనిచేశా. నా ఆహ్వానాన్ని మన్నించి అప్పట్లో ఏలూరులోని హిందూ యువజన సంఘం నిర్వహించిన కార్యక్రమానికి విశ్వనాథ్ వచ్చారు’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.
చించినాడలో అల్లరి రాముడు షూటింగ్ సమయంలో ..
హేలాపురిలో అడుగు జాడలు
ఏలూరు అర్బన్, న్యూస్టుడే: సమాజంలో చైతన్యం కలిగించేలా పలు సందేశాత్మక చిత్రాలను అందించిన కళాతపస్వి కె.విశ్వనాథ్కు హేలాపురితో అనుబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఛైర్మన్గా నగరానికి చెందిన ఎంబీఎస్ శర్మ పనిచేశారు. ఆయన ఆహ్వానం మేరకు విశ్వనాథ్ అప్పట్లో ఏలూరు వచ్చి బ్రాహ్మణులకు పలు రకాల ఉపకరణాలు అందజేశారు. ఐదు దశాబ్దాల సినీ ప్రస్థానంలో విశ్వనాథ్ తీసిన సినిమాలు ఎన్నటికీ సజీవంగానే ఉంటాయని శర్మ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన జగన్: వైఎస్ షర్మిల
[ 26-04-2024]
రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. -
మోడల్ పోలింగ్ కేంద్రం పరిశీలన
[ 26-04-2024]
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 227 పోలింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు ఎస్. ఏ శ్రీరామన్ శుక్రవారం పరిశీలించారు. -
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!