చెలరేగుతున్న మందుల మాఫియా
ఆక్వాసాగులో నిషేధిత యాంటీబయోటిక్స్ విక్రయాలు, వినియోగం ఉమ్మడి పశ్చిమలో జోరుగా సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో నుంచి దిగుమతి చేసుకుని యథేచ్ఛగా విక్రయిస్తున్నారు.
చెరువుల్లో విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ వినియోగం
లైసెన్సు లేని దుకాణాలకు సరఫరా
హైదరాబాద్, నెల్లూరు నుంచి దిగుమతి
ఆక్వాసాగులో నిషేధిత యాంటీ¨బయోటిక్స్ విక్రయాలు, వినియోగం ఉమ్మడి పశ్చిమలో జోరుగా సాగుతున్నాయి. ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో నుంచి దిగుమతి చేసుకుని యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. ఏడాదికి రూ.వందల కోట్ల వ్యాపారం చేస్తున్నారు. అధికారులు పర్యవేక్షణ, తనిఖీలు పూర్తిగా గాలికొదిలేయటంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడుతోంది. ఇటీవల ఔషధ నియంత్రణ అధికారులు చేసిన తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
తణుకులో ఆక్వారైతులకు విక్రయిస్తున్న యాంటీబయోటిక్స్ నిల్వలను స్వాధీనం చేసుకున్న ఔషధ నియంత్రణ అధికారులు
ఈనాడు డిజిటల్, ఏలూరు: తణుకులో శ్రీలక్ష్మి ఆక్వా ఫీడ్స్ అండ్ నీడ్స్ దుకాణంలో ఔషధ నియంత్రణాధికారులు అబీద్అలీ షేక్, పి.మల్లికార్జునరావు ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు జరిగాయి. దుకాణదారుకి అనుమతులు కూడా లేవు. కానీ మనుషులు, జంతువులకు వినియోగించే యాంటీబయోటిక్స్కి సంబంధించిన ముడి సరకు పౌడరు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ముడి పదార్థాలను పొడి రూపంలో అమ్మడం నిబంధనలకు విరుద్ధమే కాదు..నేరం కూడా. ఉమ్మడి పశ్చిమలో ఆక్వాసాగు ఎక్కువగా ఉన్న భీమవరం, గణపవరం, తణుకు, నరసాపురం, పాలకొల్లు, కైకలూరు, ఆకివీడు, ఏలూరు గ్రామీణ తదితర ప్రాంతాల్లో పౌడరు విక్రయ ఏజెన్సీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఈ ఏజెన్సీలు లైసెన్స్లేని దుకాణాలకు కూడా మందులు సరఫరా చేస్తున్నాయి. హైదరాబాద్, నెల్లూరు తదితర ప్రాంతాల్లోని మందుల తయారీ కంపెనీల నుంచి పొడిని అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నారు.
ఎగుమతులకు గండి
ఏలూరు, పశ్చిమ.. రెండు జిల్లాల్లో రెండు లక్షలకుపైగా ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఇక్కడ నుంచి ఏడాదికి సుమారు రూ.30 వేల కోట్ల వరకూ వ్యాపారం సాగుతోంది. గతంలో 80 శాతం ఉత్పత్తులు అమెరికా, యూరప్ దేశాలకు ఎగుమతయ్యేవి. ఇక్కడి ఆక్వా ఉత్పత్తుల్లో విచ్చలివిడిగా యాంటీబయోటిక్స్ వినియోగిస్తున్నారని యూరప్ మార్కెట్ వర్గాలు గుర్తించాయి. పరీక్షల ద్వారా అవశేషాలున్నట్లు నిర్థారించుకున్నారు. అప్పటి నుంచి యూరప్ మార్కెట్ మన ఉత్పత్తుల దిగుమతిని చాలా వరకూ తగ్గించింది. దీని ప్రభావంతో రూ.కోట్లలో ఆదాయానికి గండిపడుతోంది. ఆయా దేశాల్లో ప్రజారోగ్యంపై ప్రభుత్వాలు అంత శ్రద్ధ తీసుకుంటుంటే జిల్లా అధికారులు కనీస చర్యలు తీసుకోవటం లేదు.
మేతతోనే మాయ చేస్తున్నారు
జంతువులు, పశువులకు వచ్చే వ్యాధులకు వినియోగించే కొన్ని యాంటీబయోటిక్స్.. చేపలు, రొయ్యల సాగులో వినియోగం నిషేధం. కాని కొన్ని ఆక్వా ఫీడ్ దుకాణాల్లో వీటి అమ్మకాలు సాగుతున్నాయి. రొయ్యలు, చేపల మేతలోనే ముడిపదార్థాలు కలిపి విక్రయిస్తున్నారు. దీంతో ఎవరికీ అనుమానం రావటం లేదు. జిల్లాలో కొన్ని వెటర్నరీ మందుల ఏజెన్సీలు భారీమొత్తంలో కొనుగోలు చేసి ఆక్వా రైతులకు సరఫరా చేస్తున్నాయి.
ఎంపెడా ఏదీ జాడ
ఆక్వా ఉత్పత్తుల విషయంలో విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్ వినియోగిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే. ఎంపెడా(మెరైన్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ) అధికారులు మాత్రం కనీస చర్యలు తీసుకోవటం లేదు. ఉత్పత్తులను తనిఖీ చేయటం, రసాయనాల వినియోగం తగ్గించే మార్గాలపై దృష్టి సారించడం గాలికొదిలేశారు. ఈ విషయంలో జిల్లా మత్స్యశాఖ అధికారులు కూడా చేతులెత్తేశారు. చెరువుల దగ్గరకు వెళ్లి ఉత్పత్తుల నమూనాలు సేకరించి, పరీక్షించాలి. యాంటీబయోటిక్స్ అవశేషాలు ఉంటే వారిపై చర్యలు తీసుకోవాలి. ఇవేవీ జరగటం లేదు. ఈ విషయంపై మత్స్యశాఖ జేడీఏని వివరణ కోరగా ‘నిబంధనలకు విరుద్ధంగా యాంటీబయోటిక్స్ విక్రయాలు జరుగుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. ఎంపెడా, మత్స్యశాఖ, ఔషధనియంత్రణ శాఖలతో బృందాలను ఏర్పాటు చేసి తనిఖీ చేస్తాం’ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరం.. చింతలపూడి పూర్తి చేస్తాం
[ 08-05-2024]
‘ఆంధ్రుల జీవనాడి..చంద్రబాబు కలల సౌధం పోలవరం పూర్తి చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పని చేస్తా. కేంద్ర సహకారంతో వేగంగా నిర్మాణ పనులు జరుగుతాయి. -
ఏం మార్చారు.. ఏమార్చారంతే?
[ 08-05-2024]
‘‘సీఎం మాటలకు... క్షేత్రస్థాయి పరిస్థితులకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన వైద్యం హామీలకే పరిమితమైంది. దెబ్బతిన్న పరికరాలు, శిథిలమైన భవనాలు... సదుపాయాల్లేని ఆసుపత్రుల్లో వైద్యమంటేనే గిరిజనులు వెనకడుగు వేస్తున్నారు.’ -
ప్రశ్నించే గొంతుకలపై దౌర్జన్యకాండ
[ 08-05-2024]
ప్రతిపక్షాలకు నోరెత్తే స్వేచ్ఛ లేకుండా చేయాలన్న ఉద్దేశంతోనే వైకాపా గత అయిదేళ్లు అక్రమ కేసుల పరంపరను కొనసాగించింది. ప్రతిపక్షాలను నోరు నొక్కేస్తే సాధారణ ప్రజలు కుక్కిన పేనుల్లా పడుంటారులే అన్న నియంతృత్వ పోకడలు జగన్ జమానాలో అడుగడుగునా కనిపించాయి -
యువతకు ఉపాధి ఆక్వాకు ఊతం
[ 08-05-2024]
‘వైకాపా అస్తవ్యస్త విధానాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాటి నుంచి అన్ని వర్గాలకు విముక్తి కల్పించేలా కూటమి మ్యానిఫెస్టోను ప్రకటించాం. -
విప్లవ ధ్రువతార అల్లూరి
[ 08-05-2024]
విప్లవ ఉద్యమంలో అల్లూరి సీతారామరాజు ధ్రువతార అని పలువురు వక్తలు కొనియాడారు. -
నేడు ఈసెట్
[ 08-05-2024]
పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి బుధవారం ఈసెట్ నిర్వహించనున్నారు -
గోదారికి వదిలేసిన జగన్
[ 08-05-2024]
వైకాపా ప్రభుత్వం వచ్చాక ఏటిగట్టు పరిరక్షణ పనుల నుంచి గోదావరిలో గ్రోయిన్ల నిర్మాణానికి పూర్తిగా తిలోదకాలిచ్చింది. -
జలఘోష పట్టదా.. జగన్
[ 08-05-2024]
గోదారి ప్రవహించే జిల్లాలో జలఘోష వినిపిస్తోంది. జిల్లాలోని పురపాలక సంఘాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల ప్రజలు అర్ధరాత్రి... అపరాత్రి తేడా లేకుండా కుళాయిల్లో బిందెడు నీటికి అర్రులుచాస్తున్నారు. -
గుత్తేదారును గుల్ల చేసిన పెత్తందారు!
[ 08-05-2024]
ఉమ్మడి జిల్లాలో 2015 మొదలు 2019 వరకు తెదేపా హయాంలో చేపట్టిన పనులు చేయడానికి గుత్తేదారులు పోటీపడేవారు. టెండర్లు పిలిస్తే చాలు ప్రతిపాదిత వ్యయానికంటే తక్కువకు టెండర్లు దాఖలు చేసేవారు. -
ఓటరు సమాచార చీటీలో స్వల్ప మార్పు
[ 08-05-2024]
గతంలో ఓటరు సమాచార చీటీపై సంబంధిత వ్యక్తి ఫొటోతో పాటు అతని వివరాలు ఉండేవి. సంస్కరణలలో భాగంగా ఈ సారి ఎన్నికల సంఘం వాటిలో ఓ మార్పు చేసింది -
పాలకొల్లు నియోజకవర్గంలో ఎన్నికల వీడియో గ్రాఫర్పై వైకాపా శ్రేణుల దాడి
[ 08-05-2024]
పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నికల వీడియోగ్రాఫర్, అధికారిపై వైకాపా శ్రేణులు దాడి చేశారు. పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం పెనుమర్రులో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
జాన్వీ పెళ్లిపై నెటిజన్ పోస్ట్.. రిప్లై ఇచ్చిన ‘దేవర’ భామ
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఉద్యోగుల మూకుమ్మడి సెలవు.. 70కి పైగా విమానాలు రద్దు
-
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
-
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ.. కోడె మొక్కులు చెల్లింపు
-
ఇజ్రాయెల్కు భారీ షాకిచ్చిన అమెరికా.. కీలక ఆయుధ సరఫరా నిలిపివేత
-
గిరాకీ తగ్గింది.. టీకాను మార్కెట్ నుంచి వెనక్కు తీసుకుంటున్నాం: ఆస్ట్రాజెనెకా