చెప్పడాల్లేవ్.. ఆపేయడమే
గత కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విధిస్తున్న అప్రకటిత విద్యుత్తు కోతలతో అటు ప్రజలు..ఇటు చిరు వ్యాపారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
సరఫరాలో తరచూ అంతరాయంతో అల్లాడుతున్న జనం
చిరువ్యాపారుల జీవనోపాధికి ఆటంకం
అసలు కరెంటు కోతలే లేవంటున్న అధికారులు
ఈనాడు డిజిటల్, ఏలూరు, న్యూస్టుడే- ఆకివీడు, జంగారెడ్డిగూడెం పట్టణం, ఉండ ఎప్పుడు పోతుందో తెలియదు.. ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదు..ఎంత సేపు ఉంటుందో అర్థం కాదు. విద్యుత్తు కోతలపై ఉమ్మడి జిలాల్లో ప్రజల ఆవేదన ఇది. కనీస సమాచారం లేని కోతలతో జనం అల్లాడుతుండగా.. చిరువ్యాపారుల
రోజువారీ ఆదాయంపై ప్రభావం కనిపిస్తోంది.
గత కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విధిస్తున్న అప్రకటిత విద్యుత్తు కోతలతో అటు ప్రజలు..ఇటు చిరు వ్యాపారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణుల వేదన వర్ణనాతీతం. పగలంతా ఎండలు ఉక్కపోతతో బాధపడాల్సి వస్తోంది. పట్టణాలు, నగరాల్లో ఇళ్లు ఇరుకుగా ఉండటం బయట గాలి కూడా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సహజంగానే పట్టణాల్లో దోమల బెడద ఎక్కువ. తాజా కోతలతో అవి విజృంభిస్తున్నాయి. మరో వైపు జ్యూస్, పాలు, పెరుగు శీతలపానీయాలు, ఐస్క్రీం తదితర చిరు వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. విద్యుత్తు అంతరాయంతో వ్యాపారం పడిపోతోంది. పాలు, పెరుగు, ఐస్క్రీం ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. విద్యుత్తు ఆధారిత చేతివృత్తులు చేసేవారికి నష్టం జరుగుతోంది.
సాంకేతిక కారణాలట!
విద్యుత్తు కోతలతో ప్రజలు అల్లాడుతుంటే అధికారులు విద్యుత్తు కోతలే లేవని చెప్పటం గమనార్హం. అవి కోతలు కాదు కేవలం సాంకేతిక లోపాలు, వాతావరణ సమస్యలు, ఈదురుగాలుల వల్లే సరఫరా నిలుస్తోందని చెబుతున్నారు. ప్రతి ఉపకేంద్రం పరిధిలో స్థానిక పరిస్థితులు, లోడ్ రిలీఫ్ కోసం చేసే విద్యుత్తు సరఫరా నిలిపివేతను నమోదు చేయాల్సి ఉన్నా ఈ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదు. దెందులూరు మండలంలోని ఓ కేంద్రం పరిధిలో బుధవారం 2 గంటలు సరఫరా నిలిచిపోగా 30 నిమిషాలే ఆగినట్లు నమోదు చేశారు. రాత్రి సమయాల్లో విద్యుత్తు వినియోగం బాగా పెరగడంతో ఫీడర్లపై బాగా భారం పడటంతో రాత్రుళ్లు కోతలు పెడుతున్నారు.
ఇక్కడే అధికం
చింతలపూడి, జంగారెడ్డిగూడెం, చాట్రాయి, ఉండి, లింగపాలెం, కామవరపుకోట, మొగల్తూరు, గణపవరం, పోలవరం మండలాల్లో సమయంతో పని లేకుండా రోజుకు 2 నుంచి 4 గంటల వరకూ కోత పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో చాలా ప్రాంతాల్లో తక్కువ సమయం (15-30 నిమిషాలు) ఎక్కువ సార్లు విద్యుత్తు తీస్తున్నారు. ‘సాంకేతిక సమస్యలు, వాతావరణ ఇబ్బందుల వల్లే విద్యుత్తు అంతరాయం తప్ప కరెంటు కోతలు లేవు. కొన్నిచోట్ల ఫీడర్లపై భారం పడటంతో చాలా కొద్ది సమయం విద్యుత్తు నిలుపుతున్నాం’ అని విద్యుత్తుశాఖ ఎస్ఈ సాల్మన్రాజు తెలిపారు.
లో ఓల్టేజీ సమస్య వేధిస్తోంది..
లో ఓల్టేజీ సమస్యతో రాత్రుళ్లు ఫ్యాన్లు ఒక్కసారిగా ఆగిపోతున్నాయి. కొన్ని సార్లు సరిగా తిరగడం లేదు. సరఫరా ఎప్పుడు ఉంటుందో...! ఎప్పుడు తీసేస్తారో..? తెలియని పరిస్థితి. వర్షం పడినా గాలి వేసినా మా ప్రాంతంలో విద్యుత్తు సరఫరాకు గంటల కొద్దీ అంతరాయం కలుగుతోంది. అధికారులకు చెప్పినా ఫలితం లేదు.
పీవీఎస్ గోపాలకృష్ణంరాజు, వినియోగదారుడు, యండగండి.
పనులు పూర్తి చేయలేకపోతున్నా.. ఒప్పుకున్న పనులు సమయానికి పూర్తి చేయలేకపోతున్నాం. నా దగ్గర ముగ్గురు కూలీలు పని చేస్తారు. కరెంట్ సక్రమంగా లేకపోవటంతో గంటలకొద్దీ వారు ఖాళీగానే ఉంటున్నారు. అయినా జీతాలు ఇవ్వాల్సి వస్తోంది.
ఈర్ని సూరిబాబు, వడ్రంగి మేస్త్రీ, జంగారెడ్డిగూడెం'
పాలు, పెరుగు ప్యాకెట్లు పాడవుతున్నాయి
కిళ్లీకొట్టులో శీతలపానీయాలతో పాటు పాలు, పెరుగు, లస్సీ ప్యాకెట్లు అమ్ముతున్నా. రోజుకు సుమారు 3.30 గంటల వరకూ విద్యుత్తు సరఫరా నిలిచిపోతోంది. దీంతో శీతల పెట్టెలో నిల్వ ఉంచిన పాలు, పెరుగు ప్యాకెట్లలో కొన్ని పాడై నష్టపోవాల్సి వస్తుంది. ఏ సమయంలో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తారో తెలియడం లేదు.
డి.స్వరూప్కుమార్, చినకాపవరం, ఆకివీడు మండలం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ఇవా మెరున వైద్య సేవలు?
[ 30-04-2024]
ఏలూరు సర్వజన ఆసుపత్రిలో వైద్యం రోజు రోజుకూ తీసికట్టుగా మారుతోంది. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామంటూ సీఎం జగన్ బోధనాసుపత్రి ఏర్పాటు చేశారు కానీ సేవల గురించి పట్టించుకోకుండా వదిలేశారు. -
జనసేన అభ్యర్థులు లేనిచోట్ల గాజు గ్లాసు గుర్తు కేటాయింపు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ఆయా నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థుల తుది జాబితాలను సోమవారం విడుదల చేశారు. వీటిలో జనసేన పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. -
మనవడిని కొట్టిందని..కోడలిని హతమార్చిన మామ
[ 30-04-2024]
కోడలిపై మామ రోకలితో దాడి చేసి హతమార్చిన ఘటన తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో చోటు చేసుకుంది. -
ప్రజల ఆస్తుల స్వాహాకు జగన్ కుట్ర
[ 30-04-2024]
ప్రజల ఆస్తులను స్వాహా చేసే కుట్రలో భాగంగానే సీఎం జగన్మోహన్రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు ఆరోపించారు. -
అభివృద్ధి కావాలా.. జూద శిబిరాలు కావాలా
[ 30-04-2024]
సోమవారం సాయంత్రం 5.45 గంటలకు పవన్ గణపవరం మహాలక్ష్మి థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడికి భారీగా చేరుకున్న నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. -
యంత్రాంగం ఉండీ.. ఎందుకీ మంత్రాంగం?
[ 30-04-2024]
ఇంటింటి పింఛన్ల పంపిణీపై వైకాపా మరో కొత్త కుట్రకు శ్రీకారం చుట్టింది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసే అవకాశం ఉన్నా.. సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలని వృద్ధుల ప్రాణాలతో చెలగాటమాడింది. మే నెల పింఛన్లు బ్యాంకులో వేస్తామంటూ కొత్తగా జగన్నాటకం మొదలు పెట్టింది. -
నూజివీడు కూటమిలో జోష్
[ 30-04-2024]
నూజివీడులో కూటమికి మరింత జోష్ వచ్చింది. మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో పాటు ఆయన భార్య సోమవారం నామినేషన్లు ఉపసంహరించుకున్న నేపథ్యంలో కూటమి కార్యకర్తల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. -
నిర్వాసితులను నిలువునా ముంచారు
[ 30-04-2024]
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఎన్నికలకు ముందు ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పదవీ కాలం ముగుస్తున్నా కనీసం ఒక్క ఎకరానికి కూడా పరిహారం ఇవ్వకుండా మోసం చేశారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. -
ఎన్నికల బరిలో 99 మంది
[ 30-04-2024]
జిల్లాలో మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 99 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. నామపత్రాలను ఉపసంహరించుకునే ఘట్టం సోమవారం ముగిసింది. -
ఏలూరు పార్లమెంట్ అభ్యర్థులు వీరే
[ 30-04-2024]
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు నిలిచారు. -
సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారని వేధిస్తారా?
[ 30-04-2024]
కైకలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆయన కుమారుడి అకృత్యాలు పెరిగిపోతున్నాయని, అక్రమ కేసులు బనాయించి కూటమి శ్రేణులను ఇబ్బంది పెడితే సహించనని కూటమి కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. -
ఆగని ఇసుక దందా
[ 30-04-2024]
ఆచంట మండలం కరుగోరుమిల్లిలో సోమవారం కూడా ఇసుక తవ్వకాలు పెద్దఎత్తున జరిగాయి. ఆదివారం గ్రామస్థులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా ఇసుక రవాణా నిలిచింది. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 30-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు
తాజా వార్తలు (Latest News)
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా