నూజివీడు కూటమిలో జోష్
నూజివీడులో కూటమికి మరింత జోష్ వచ్చింది. మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో పాటు ఆయన భార్య సోమవారం నామినేషన్లు ఉపసంహరించుకున్న నేపథ్యంలో కూటమి కార్యకర్తల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది.
నామినేషన్ ఉపసంహరించుకున్న ముద్దరబోయిన
అధినేతను కలిసి తెదేపాలోకి పునరాగమనం
ఈనాడు, ఏలూరు, న్యూస్టుడే, నూజివీడు రూరల్: నూజివీడులో కూటమికి మరింత జోష్ వచ్చింది. మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో పాటు ఆయన భార్య సోమవారం నామినేషన్లు ఉపసంహరించుకున్న నేపథ్యంలో కూటమి కార్యకర్తల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. సోమవారం ముద్దరబోయిన తెదేపా అధినేత చంద్రబాబును కలిశారు. కూటమి అభ్యర్థుల ఎంపికలో పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి నూజివీడు స్థానాన్ని కేటాయించారు. ఈ సీటు కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన తెదేపాకు రాజీనామా చేయడం, స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయటం, ప్రచారంలో తిరగటంతో కూటమి ఓట్లు చీలిపోతాయంటూ వైకాపా ప్రచారం చేసింది. అయినప్పటికీ పార్థసారథి ప్రచారంలో అందరినీ కలుపుకొని దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలు కలియదిరుగుతూ..ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నూజివీడు ఎన్నికల ప్రచార రథానికి పార్థసారథిలా నడిపిస్తూ వస్తున్నారు.
కూటమికి అనుకూల పవనాలు.. ముద్దరబోయిన పునరాగమనంతో ఎన్నికల్లో నూజివీడులో కూటమికి మరింత బలం పెరగనుంది. మంగళవారం నుంచి ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నాయి. పార్థసారథి సారథ్యంలో రానున్న పదిరోజులు ఇద్దరు కలిసి ప్రచారం చేయనుండటంతో తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు అభిమానుల్లో ఇప్పటికే జోష్ కనిపిస్తోంది. ముద్దరబోయిన వర్గంతోపాటు, ఆయన పార్టీని వీడటంతో ఎటూ వెళ్లలేక స్తబ్దుగా ఉన్న కార్యకర్తలు, అభిమానులు తాజా పరిణామంతో నూతనోత్సాహం కనిపిస్తోంది. పార్థసారథి, ముద్దరబోయిన ఒకే సామాజిక వర్గం కావటం, ఇద్దరు తలోదారైపోవటంతో ఆ వర్గం ఎటూ తేల్చుకోలేక నలిగిపోయింది. తాజా నిర్ణయంతో వారంతా కూటమికిజై అంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాబోయ్.. ఇంతలా తవ్వేశారా?
[ 21-05-2024]
పోలవరం ప్రధానకాలువ అంత వెడల్పు, లోతులో కందకాలు.. దాదాపు తాటిచెట్టంత ఎత్తులో నిల్వ చేసిన ఇసుక గుట్టలు.. జిల్లాలో ఎక్కడా లేనంతగా.. -
ఇసుక ర్యాంపుల తనిఖీ
[ 21-05-2024]
జిల్లాలోని ఆచంట మండలం పరిధిలోని కోడేరు, కరుగోరుమిల్లి ఇసుక ర్యాంపులను సోమవారం జిల్లా అధికారుల బృందం ఆకస్మికంగా తనిఖీ చేసింది. -
సహకరిస్తే.. అండగా నిలుస్తాం
[ 21-05-2024]
ఓఎన్జీసీ పైపులైను వెళ్లే గ్రామాలకు ప్రత్యేక నిధులు మంజూరు చేయించి న్యాయం చేస్తామని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు. -
చాకిరీ చేసినా.. సొమ్ముల్లేవ్!
[ 21-05-2024]
ఎన్నికల క్షేత్రంలో బూత్ స్థాయి అధికారులది కీలకపాత్ర. మిగిలిన ఉద్యోగులకు ఎన్నికల సమయంలోనే పని అప్పగిస్తారు. -
మళ్లీ వరండాలు.. అరుగులే!
[ 21-05-2024]
గతేడాది నవంబరు నుంచి నిధుల సమస్యతో కొన్ని, ఇసుక, సిమెంట్ అందుబాటులో లేక మరికొన్ని పనులు నిలిచిపోయాయి. జరుగుతున్నాయనిపించుకునేందుకు అక్కడక్కడా పనులు చేయిస్తున్నారు. -
సూర్యకిరణ ఉషస్సు.. శ్రీనివాసుని తేజస్సు
[ 21-05-2024]
ద్వారకాతిరుమల శేషాచల పర్వతంపై కొలువుతీరిన శ్రీవేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరు కల్యాణ మహోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. -
రీ-సర్వేతో కొత్త కష్టాలు
[ 21-05-2024]
భూ రికార్డుల స్వచ్ఛీకరణ పేరుతో ప్రభుత్వం చేపట్టిన రీ-సర్వే రైతులకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ఈ ప్రక్రియలో లోపాలతో ఇప్పటికే పలువురు రైతులు కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. -
రోగులకు పరీక్షే!
[ 21-05-2024]
అనారోగ్యంతో ఆసుపత్రికొస్తే అక్కడ ఓపీ చీటీ రాయించుకోవాలంటే ఆధార్నంబరుతో అనుసంధానం చేసిన చరవాణి ఉందా అని అడుగుతున్నారు. -
సోమేశ్వరునికి పంచామృతాభిషేకాలు
[ 21-05-2024]
వైశాఖమాస ద్వాదశి సందర్భంగా పంచారామక్షేత్రం గునుపూడి సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో సోమవారం ఉదయం పంచామృతాలతో అభిషేకాలు చేశారు. -
పెనుగొండ యువతికి ప్రశంస
[ 21-05-2024]
పెనుగొండకు చెందిన మహ్మద్ నర్గీస్, ఆరీఫ్ మహ్మద్ దంపతుల పెద్ద కుమార్తె మహ్మద్ రుక్సార్ శనివారం రాత్రి అమెరికాలోని బర్కిలీ అంతర్జాతీయ పాఠశాలలో జరిగిన ఎంసీబీ విద్యార్థుల 2024 ప్రారంభోత్సవ సమావేశంలో -
ఆ సర్కిల్లో అంతే!
[ 21-05-2024]
పెరుగుతున్న జనాభా దృష్ట్యా ఉన్న సిబ్బంది సరిపోక అదనంగా పెట్టుకోవాల్సిన పరిస్థితుల్లో కొంతమంది తీరు చర్చనీయాంశంగా మారింది. వారు విధులకు హాజరు కారు.. -
‘సొమ్ము’సిల్లిన పనులు
[ 21-05-2024]
నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తామని ముఖ్యమంత్రి ఎన్ని కబుర్లు చెప్పినా క్షేత్రస్థాయిలో పనులు మాత్రం చతికిలపడ్డాయి. -
రోజుకు రూ.20 వేతనం
[ 21-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొన్న తమకు రోజుకు రూ.20 వేతనం కేటాయించడంతో సిబ్బంది షాక్కు గురయ్యారు.