కొల్లేరు గొంతెండుతోంది
కైకలూరు నియోజకవర్గంలోని లంక గ్రామాల ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. కలిదిండి, కైకలూరు, మండవల్లి మండలాల్లో ఆక్వా సాగు విస్తరించడం.. జనాభాకు తగ్గట్టుగా తాగునీటి చెరువుల విసీతర్ణం పెరగకపోవడం.. నేల స్వభావం తదితరాలు ఎద్దడికి దారితీస్తున్నాయి.
లంక గ్రామాల్లో తీరని నీటి ఎద్దడి
కలిదిండి, కైకలూరు, న్యూస్టుడే
కోరుకొల్లులో అడుగంటిన మంచినీటి చెరువు
కైకలూరు నియోజకవర్గంలోని లంక గ్రామాల ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. కలిదిండి, కైకలూరు, మండవల్లి మండలాల్లో ఆక్వా సాగు విస్తరించడం.. జనాభాకు తగ్గట్టుగా తాగునీటి చెరువుల విసీతర్ణం పెరగకపోవడం.. నేల స్వభావం తదితరాలు ఎద్దడికి దారితీస్తున్నాయి.
కొన్నేళ్లుగా కైకలూరు ప్రాంతంలో ఆక్వా సాగు వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో భూగర్భ జలాలు కలుషితమై తాగు నీటి చెరువుల్లో నీరు పనికిరాకుండా పోతుంది. మరోవైపు రొయ్యలు, చేపల చెరువుల్లో నీటిని కొందరు నేరుగా పంటకాలువల్లోకి వదిలేయడంతో విషతుల్యంగా మారుతోంది. గ్రామాల్లో అధికశాతం ఫిల్టర్ బెడ్లు మరమ్మతులకు గురవడంతో కలుషిత నీటినే నేరుగా కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నారు.
బావులు, చేతిపంపులపై పర్యవేక్షణ కరవు..
తాగునీటి చెరువులు కలుషితంగా మారడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు దాహార్తి తీర్చుకునేందుకు బావులు, చేతిపంపులపై ఆధారపడుతున్నారు. పర్యవేక్షణ కొరవడటంతో బావులు నాచుపట్టి అధ్వానంగా మారాయి. చేతిపంపులు వినియోగంలో లేకుండా పోయాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛమైన నీటికోసం ఆర్వోప్లాంట్లపై ఆధారపడుతున్నారు.
వింజరం: బావి నుంచి తాగునీరు తీసుకెళ్తున్న స్థానికులు
ఇక్కడ సరిపడా లేక.. నియోజకవర్గంలోని కలిదిండి, కోరుకొల్లు, సానారుద్రవరం, పడమటిపాలెం, పెదలంక, కొండంగి, కొల్లేటికోట, లక్ష్మీపురం, జంగంపాడు, తక్కెళ్లపాడు, చావలిపాడు, కాకతీయనగర్, సింగరాయపాలెం, వడాలి, కాకరవాడ, గురజ, దాకరం, పెదపాలపర్రు తదితర గ్రామాల్లో జనాభాకు సరిపడా మంచినీటి చెరువులు లేవు.
ఇదీ పరిస్థితి
కైకలూరు మండలంలోని తామరకొల్లు, వింజరం, వేమవరప్పాడు, రాచపట్నం, సీతనపల్లి, నరసాయపాలెం, దొడ్డిపట్ల్ల, రామవరం, గోపవరం, మండవల్లి మండలంలో చావలిపాడు, కానుకొల్లు, అయ్యవారి రుద్రవరం గ్రామాల్లో ప్రజలకు ఊట బావులే శరణ్యం. కొల్లేరు లంక గ్రామాల ప్రజలు ఆటోల్లో తీసుకొచ్చి విక్రయించే నీటిని కొనుగోలు చేసి దప్పిక తీర్చుకోవాల్సి వస్తోంది.
కైకలూరు మండలం పెంచికలమర్రులో ఏర్పాటు చేసిన సామూహిక రక్షిత నీటి పథకం పైపులైన్ ఏర్పాటు చేయకపోవడం తదితర కారణాలతో వృథాగా దర్శనమిస్తోంది.
మండవల్లి మండలం తక్కెళ్లపాడులో 14 గ్రామాలకు తాగునీరందించేలా నిర్మించిన సామూహిక నీటి పథకం ప్రస్తుతం రెండు గ్రామాలకు మాత్రమే అందించగలుగుతోంది. ఏడెకరాల చెరువు మాత్రమే ఉండటంతో నీటినిల్వ సామర్థ్యం చాలడం లేదు.
కలిదిండి మండలంలోని చినతాడినాడ, సున్నంపూడి, దుంపలకోడుదిబ్బ, మద్వానిగూడెం, కొండంగి, మట్టగుంట తదితర ఉప్పుటేరు తీర గ్రామాల్లో ఎద్దడి తీవ్రంగా ఉంది. సున్నంపూడి, దుంపలకోడుదిబ్బ గ్రామానికి తాగునీరందించేందుకు 12 ఎకరాల విస్తీర్ణంలో చెరువు తవ్వుతున్నారు. ఇది వినియోగంలోకి వస్తే కొంత మేరకు ఉపశమనం కలుగుతుంది.
చాటపర్రు రోడ్డులో కుళాయి చెంత నీటి కోసం స్థానికుల పడిగాపులు
చింతపాడులో మరో పథకానికి నిధులు మంజూరైనట్లు అధికారులు ప్రకటించినా నేటికీ పనులు కార్యరూపం దాల్చలేదు. ‘కృష్ణా నది నుంచి కాలువల ద్వారా తాగునీటి సరఫరా సజావుగా సాగుతోంది. ప్రతి గ్రామంలోని మంచినీటి చెరువులు నింపడానికి అవకాశం ఉంది. ఇంటింటికీ కుళాయి మంజూరు చేస్తున్నాం సమస్యలున్నట్లు మా దృష్టికి వస్తే పరిష్కారానికి వెంటనే చర్యలు చేపడతాం’ అని కైకలూరు ఆర్డబ్ల్యూఎస్ డీఈ ఎంవీవీఎస్ శాస్త్రి తెలిపారు.
నగర శివారు.. నీటికి బేజారు
ఏలూరు నగరపాలకసంస్థ పరిధిలోని శివారు ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. పన్నులు పెరిగినా సౌకర్యాలు కల్పించడం లేదని వారు వాపోతున్నారు. వాటితోపాటు నగరంలోని నల్లదిబ్బ, ఏఎస్సార్కాలనీ, లక్ష్మమ్మచెరువు, జలాపహరేశ్వరస్వామి ఆలయం, వెంకన్నచెరువు, అశోకనగర్ ఏటిగట్టు, తంగెళ్లమూడి ఏటిగట్టు, పాములదిబ్బ తదితర ప్రాంతాల్లో నీటి ఇబ్బందులు అధికంగా ఉన్నాయి. కొన్నిచోట్ల కుళాయిల నుంచి సన్నని ధార వస్తుంటే.. మరికొన్నిచోట్ల ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆటోలో నీళ్ల డబ్బాలు తీసుకెళ్తూ..
ఈనాడు, ఏలూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిన జగన్: వైఎస్ షర్మిల
[ 26-04-2024]
రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. -
మోడల్ పోలింగ్ కేంద్రం పరిశీలన
[ 26-04-2024]
ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 227 పోలింగ్ కేంద్రాన్ని కేంద్ర ఎన్నికల పరిశీలకుడు ఎస్. ఏ శ్రీరామన్ శుక్రవారం పరిశీలించారు. -
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!