స్పందన లేని యాత్ర
ఎన్నికల నేపథ్యంలో మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విఫలమైంది.
జనం లేక మాట్లాడని సీఎం
పర్యటన మొత్తం అభివాదాలతో సరి
గణపవరంలో బస్సుయాత్ర వెలవెల
ఈనాడు, డిజిటల్, భీమవరం, పెనుమంట్ర, న్యూస్టుడే: ఎన్నికల నేపథ్యంలో మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో విఫలమైంది. ఉమ్మడి జిల్లాలో సోమ, మంగళవారాల్లో నిర్వహించిన పర్యటన పేలవంగా సాగింది. కలపర్రు టోల్గేట్ దగ్గర ఏలూరు జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర మొదటి రోజు నారాయణపురంలో ముగిసింది. రెండో రోజు అక్కడి నుంచే మొదలై భీమవరం మీదుగా సాగి తేతలిలో ముగిసింది. బుధవారం విరామం ప్రకటించారు. యాత్ర సాగిన గణపవరం, ఉండి, భీమవరం, వంటి ప్రధాన ప్రాంతాల్లో సైతం వెయ్యి మంది కూడా లేరంటే యాత్ర ఎంత పేలవంగా సాగిందో తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో జనం లేక జగన్ బస్సులోంచి తొంగి కూడా చూడలేదు. అరకొరగా వచ్చిన వారు కూడా నాయకులు వాహనాలు పెట్టి, డబ్బులు, మద్యం, బిర్యానీ ఇస్తే వచ్చిన వారే కావటం గమనార్హం.
ఆలకించలేదు.. ఆనతివ్వలేదు.. జగన్ ఉమ్మడి జిల్లాలో దాదాపు 150 కిమీ మేర యాత్ర చేసినా ఏ ఒక్క చోటా కూడా నోరు విప్పలేదు. జిల్లాకు ఆయన వల్ల ఏం ఒరిగిందో చెప్పలేదు. కష్టాలు చెప్పుకొనేందుకు, వినతులు ఇచ్చేందుకు వచ్చిన వృద్ధులు, దివ్యాంగులు,పేదల మొర వినే ప్రయత్నం చేయలేదు. యాత్ర ఆసాంతం సీఎం అభివాదాలు తప్ప జిల్లా ప్రజలకు ఏం భరోసా ఇచ్చారన్న చర్చ సాగుతోంది.
సాగిందిలా.. మంగళవారం సాయంత్రం భీమవరం నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర గొల్లలకోడేరు మీదుగా యండగండి, పిప్పర, చిలకంపాడు లాకులు, రావిపాడు, దువ్వ జాతీయ రహదారి మీదుగా తేతలి బస ప్రాంతానికి చేరుకుంది. చిలకంపాడు లాకుల నుంచి కాశిపాడు, రావిపాడు మీదుగా రహదారి అధ్వానంగా ఉండటంతో కాన్వాయ్ నెమ్మదిగా ముందుకు సాగింది. ఒకే దారి కావడంతో ఇతర వాహనాలను పోలీసులు అనుమతించలేదు. దారిలో కేవలం గొల్లలకోడేరు శివారు ఉప్పలగూడెం వద్ద జగన్ రెండు నిమిషాలు స్థానికులతో మాట్లాడారు తప్ప ఇంకెక్కడా బస్సు నుంచి కిందకు దిగలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. ఇవా మెరున వైద్య సేవలు?
[ 30-04-2024]
ఏలూరు సర్వజన ఆసుపత్రిలో వైద్యం రోజు రోజుకూ తీసికట్టుగా మారుతోంది. జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తామంటూ సీఎం జగన్ బోధనాసుపత్రి ఏర్పాటు చేశారు కానీ సేవల గురించి పట్టించుకోకుండా వదిలేశారు. -
జనసేన అభ్యర్థులు లేనిచోట్ల గాజు గ్లాసు గుర్తు కేటాయింపు
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు ఆయా నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్థుల తుది జాబితాలను సోమవారం విడుదల చేశారు. వీటిలో జనసేన పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. -
మనవడిని కొట్టిందని..కోడలిని హతమార్చిన మామ
[ 30-04-2024]
కోడలిపై మామ రోకలితో దాడి చేసి హతమార్చిన ఘటన తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో చోటు చేసుకుంది. -
ప్రజల ఆస్తుల స్వాహాకు జగన్ కుట్ర
[ 30-04-2024]
ప్రజల ఆస్తులను స్వాహా చేసే కుట్రలో భాగంగానే సీఎం జగన్మోహన్రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారని నరసాపురం ఎంపీ, తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు ఆరోపించారు. -
అభివృద్ధి కావాలా.. జూద శిబిరాలు కావాలా
[ 30-04-2024]
సోమవారం సాయంత్రం 5.45 గంటలకు పవన్ గణపవరం మహాలక్ష్మి థియేటర్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడికి భారీగా చేరుకున్న నాయకులు అపూర్వ స్వాగతం పలికారు. -
యంత్రాంగం ఉండీ.. ఎందుకీ మంత్రాంగం?
[ 30-04-2024]
ఇంటింటి పింఛన్ల పంపిణీపై వైకాపా మరో కొత్త కుట్రకు శ్రీకారం చుట్టింది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పంపిణీ చేసే అవకాశం ఉన్నా.. సచివాలయాలకు వెళ్లి తీసుకోవాలని వృద్ధుల ప్రాణాలతో చెలగాటమాడింది. మే నెల పింఛన్లు బ్యాంకులో వేస్తామంటూ కొత్తగా జగన్నాటకం మొదలు పెట్టింది. -
నూజివీడు కూటమిలో జోష్
[ 30-04-2024]
నూజివీడులో కూటమికి మరింత జోష్ వచ్చింది. మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావుతో పాటు ఆయన భార్య సోమవారం నామినేషన్లు ఉపసంహరించుకున్న నేపథ్యంలో కూటమి కార్యకర్తల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. -
నిర్వాసితులను నిలువునా ముంచారు
[ 30-04-2024]
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఎన్నికలకు ముందు ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పదవీ కాలం ముగుస్తున్నా కనీసం ఒక్క ఎకరానికి కూడా పరిహారం ఇవ్వకుండా మోసం చేశారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. -
ఎన్నికల బరిలో 99 మంది
[ 30-04-2024]
జిల్లాలో మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో 99 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. నామపత్రాలను ఉపసంహరించుకునే ఘట్టం సోమవారం ముగిసింది. -
ఏలూరు పార్లమెంట్ అభ్యర్థులు వీరే
[ 30-04-2024]
ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల బరిలో 13 మంది అభ్యర్థులు నిలిచారు. -
సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారని వేధిస్తారా?
[ 30-04-2024]
కైకలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆయన కుమారుడి అకృత్యాలు పెరిగిపోతున్నాయని, అక్రమ కేసులు బనాయించి కూటమి శ్రేణులను ఇబ్బంది పెడితే సహించనని కూటమి కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. -
ఆగని ఇసుక దందా
[ 30-04-2024]
ఆచంట మండలం కరుగోరుమిల్లిలో సోమవారం కూడా ఇసుక తవ్వకాలు పెద్దఎత్తున జరిగాయి. ఆదివారం గ్రామస్థులు అడ్డుకోవడంతో తాత్కాలికంగా ఇసుక రవాణా నిలిచింది. -
రెండో విడత ర్యాండమైజేషన్ పూర్తి
[ 30-04-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ తెలిపారు
తాజా వార్తలు (Latest News)
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా
-
సెక్షన్ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన